Lok sabha election: బీజేపీ సెకండ్ లిస్ట్ రెడీ! పోటీలో కీలక వ్యక్తులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ లోక్సభ అభ్యర్థుల రెండో లిస్ట్ విడుదలకు రంగం సిద్ధమైంది. మంగళవారం ఏ క్షణములోనైనా సెకండ్ లిస్ట్ విడుదలయ్యే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలుపుతున్నాయి.
ఇప్పటికే 195 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను కమలం పార్టీ విడుదల చేసింది. ప్రధాని మోడీ మరోసారి వారణాసి నుంచే బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఆ నియోజకవర్గం నుంచి రెండు సార్లు మోడీ భారీ విజయంతో గెలుపొందారు. మూడోసారి ముచ్చటగా ఇదే నియోజకవర్గం నుంచి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టేందుకు రంగంలోకి దిగారు.
Also Read
- West Bengal: "రాళ్లతో కొట్టారు?".. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
- Kharif 2026: రైతులకు శుభవార్త.. సాగునీటిని విడుదల చేసిన ప్రభుత్వం!
- UP: బక్రీద్ రోజు హిందూ యువకుడి దారుణ హత్య.. పోలీసుల ఎన్కౌంటర్లో ప్రధాన నిందితుడు అసద్ ఖతం..
- East Godavari Horror: తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. భార్యను దారుణంగా హత్య చేసిన భర్త!
ప్రధాని మోడీ నేతృత్వంలో సోమవారం జరిగిన ఎన్నికల సమావేశంలో ఎనిమిది రాష్ట్రాలకు చెందిన 99 స్థానాలపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేశారు. ఈ రెండో లిస్టులో కీలక మైన వ్యక్తులు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తొలి జాబితాలో ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులను ప్రకటించలేదు. తాజాగా బీజేపీ-కాంగ్రెస్-జనసేన పార్టీలో పొత్తు కుదుర్చుకున్నాయి. పొత్తులో భాగంగా బీజేపీకి ఆరు పార్లమెంట్ స్థానాలు దక్కాయి. ఈ సెకండ్ లిస్టులో ఏపీ అభ్యర్థులను కూడా ప్రకటించనున్నట్లు సమాచారం.
రెండో జాబితాలో పలువురు కీలక నేతలు ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇందులో తాజాగా రాజీనామా చేసిన హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, అలాగే కర్ణాటకకు చెందిన మాజీ ముఖ్యమంత్రులు బసవరాజు బొమ్మై, జగదీష్ షెట్టార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి పేర్లు రెండో జాబితాలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక విశాఖ నుంచి జీవీఎల్.నరసింహారావు పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ శనివారంలోపు.. ఏదొక రోజు ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధం చేసినట్లు సమాచారం. ఏప్రిల్లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసి మే నెలలో ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
తాజావార్తలు
-
Paris Psg Violence: పీఎస్జీ గెలుపుతో తగలబడ్డ పారిస్.. వందల సంఖ్యలో ఫ్యాన్స్ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
Mega 158 : మెగా సినిమాలో నారా వారి హీరో?
-
West Bengal: “రాళ్లతో కొట్టారు?”.. టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై దాడి
-
Kharif 2026: రైతులకు శుభవార్త.. సాగునీటిని విడుదల చేసిన ప్రభుత్వం!
-
IPL 2026 Final: ఆర్సీబీ ఫ్యాన్స్కు జోష్ ఇచ్చే 8 ఏళ్ల సెంటిమెంట్.. ఈ హిస్టరీ రిపీట్ అయితే ఈసారి కప్పు బెంగళూరుదే!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..