Tirumala: తిరుమల కొండపై కొలువై ఉన్న కలియుుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు నిత్యం ప్రపంచ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. అయితే.. నడిచి వెళ్లలేని వారికోసం టీటీడీ ప్రత్యేక దర్శన టికెట్లు జారీ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో జులై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను.. టీటీడీ ఆన్లైన్లో విడుదల చేసింది. తాజాగా జులై నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను నేడు ఉదయం 10 గంటలకు విడుదల చేయగా.. టికెట్లను హాట్ కేకుల్లా భక్తులు బుక్ చేసుకున్నారు. అంగప్రదక్షిణం టోకెన్లను విడుదల చేసిన 4 నిమిషాల్లోనే భక్తులు పొందారు. 20 నిముషాల వ్యవధిలో వయోవృద్దులు, వికలాంగుల దర్శన టికెట్లను భక్తులు బుక్ చేసుకున్నారు. గంటా 55 నిమిషాల వ్యవధిలో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు అన్ని అయిపోయాయి.
అలాగే ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలో గదుల కోటాను ఆన్లైన్లో అందుబాటులోకి తీసుకొస్తారు. ఇక.. శ్రీవారి సేవ కోటాను 27న ఉదయం 11 గంటలకు, నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పరకామణి సేవ కోటాను మధ్యాహ్నం ఒంటి గంటకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.కాలినడకన వెళ్లలేని వారు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవడం మంచిది. చిన్న పిల్లలు, వృద్ధులు ఉన్నవారికి ఈ అవకాశం ఎంతో మేలు చేస్తుంది. మీరు టికెట్లు బుకు చేసుకోవాలని అనుకుంటే.. https://tirupatibalaji.ap.gov.in వెబ్సైట్కు వెళ్లండి. ఇందులో ప్రత్యేక దర్శన టికెట్లతో పాటు మరిన్ని సేవలూ బుక్ చేసుకోవచ్చు.