TTD Parakamani Case: టీటీడీ పరకామణి చోరీ కేసు విచారణ.. ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
- టీటీడీ పరకామణి చోరీ కేసుపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- పరకామణిలో జరిగిన ఘటన సాధారణ దొంగతనం కంటే తీవ్రమైన నేరమని వ్యాఖ్య
- ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు అవసరమని సూచన
- టీటీడీలో ఆధునిక టెక్నాలజీ, ముఖ్యంగా AI వినియోగంపై హైకోర్టు స్పష్టత
- ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకం సమంజసం కాదన్న అభిప్రాయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD Parakamani Case: టీటీడీ పరకామణి చోరీ కేసు విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టీటీడీలో ఆధునిక టెక్నాలజీ, ముఖ్యంగా కృత్రిమ మేధ (AI)ని వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. పరకామణిలో జరిగిన ఘటన సాధారణ దొంగతనం కంటే తీవ్రమైన నేరమని పేర్కొన్న న్యాయస్థానం, ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. టీటీడీలో ఔట్సోర్సింగ్ నియామకాలు సమంజసం కావని హైకోర్టు అభిప్రాయపడింది. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు తగిన బాధ్యతాభావం ఉండదని, అదే కారణంగా పరకామణిలో ఈ ఘటన చోటు చేసుకుందని వ్యాఖ్యానించింది. శాశ్వత సిబ్బంది స్థానంలో ఔట్సోర్సింగ్పై ఆధారపడటం వల్ల భద్రతా లోపాలు తలెత్తుతున్నాయని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
Also Read
- Karnataka: ‘‘చిల్లర లేకుపోతే దిగిపో..’’ మంత్రికే షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
- Monsoon: రైతులకు గుడ్ న్యూస్.. జోరందుకోనున్న రుతుపవనాలు.. జూలై 18-25 మధ్య భారీ వర్ష సూచన
- Tamil Nadu: కాంగ్రెస్ ద్రోహం చేసింది, విజయ్తో చేతులు కలిపేది లేదు: డీఎంకే.
- US-Iran War: ప్రభుత్వం vs మిలిటరీ.. హార్ముజ్ అంశంపై ఇరాన్లో అంతర్గత విభేదాలు..
విరాళాల లెక్కింపులో పారదర్శకత పెంచేందుకు ప్రత్యేకంగా టేబుళ్లు ఏర్పాటు చేయాలని హైకోర్టు సూచించింది. అంతేకాకుండా విరాళాల కౌంటింగ్ ప్రక్రియలో భక్తులను కూడా ఎందుకు భాగస్వాములుగా తీసుకోకూడదని ప్రశ్నించింది. అయితే ఆగమన శాస్త్రం ప్రకారం భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఏదైనా తప్పిదం జరిగితే వెంటనే అప్రమత్తం అయ్యేలా విజిలెన్స్ అధికారులు అలర్ట్ టెక్నాలజీని అమలు చేయాలని ఆదేశించింది. కౌంటింగ్ ప్రక్రియలో హ్యూమన్ ఇంటర్ఫెరెన్స్ను సాధ్యమైనంతవరకు తగ్గించి, పూర్తి స్థాయిలో టెక్నాలజీని వినియోగించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు టీటీడీ యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. చివరగా ఈ కేసు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Eat Curd in Winter: చలికాలంలో గడ్డ పెరుగు తింటున్నారా.. అయితే వీటిని తెలుసుకోండి..
తాజావార్తలు
-
Karnataka: ‘‘చిల్లర లేకుపోతే దిగిపో..’’ మంత్రికే షాక్ ఇచ్చిన బస్ కండక్టర్..
-
Tollywood Directors: కథలు రెడీ.. హీరోలే మిస్సింగ్! టాలీవుడ్ హిట్ డైరెక్టర్లకు కొత్త టెన్షన్..
-
Maa Inti Bangaram: 100 కోట్ల క్లబ్లో ‘మా ఇంటి బంగారం’.. తెలుగు సినీ చరిత్రలో సమంత రేర్ ఫీట్..
-
Monsoon: రైతులకు గుడ్ న్యూస్.. జోరందుకోనున్న రుతుపవనాలు.. జూలై 18-25 మధ్య భారీ వర్ష సూచన
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..