TTD Parakamani Case: టీటీడీ పరకామణి చోరీ కేసు విచారణ.. ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
- టీటీడీ పరకామణి చోరీ కేసుపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
- పరకామణిలో జరిగిన ఘటన సాధారణ దొంగతనం కంటే తీవ్రమైన నేరమని వ్యాఖ్య
- ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు అవసరమని సూచన
- టీటీడీలో ఆధునిక టెక్నాలజీ, ముఖ్యంగా AI వినియోగంపై హైకోర్టు స్పష్టత
- ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకం సమంజసం కాదన్న అభిప్రాయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TTD Parakamani Case: టీటీడీ పరకామణి చోరీ కేసు విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టీటీడీలో ఆధునిక టెక్నాలజీ, ముఖ్యంగా కృత్రిమ మేధ (AI)ని వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. పరకామణిలో జరిగిన ఘటన సాధారణ దొంగతనం కంటే తీవ్రమైన నేరమని పేర్కొన్న న్యాయస్థానం, ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. టీటీడీలో ఔట్సోర్సింగ్ నియామకాలు సమంజసం కావని హైకోర్టు అభిప్రాయపడింది. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు తగిన బాధ్యతాభావం ఉండదని, అదే కారణంగా పరకామణిలో ఈ ఘటన చోటు చేసుకుందని వ్యాఖ్యానించింది. శాశ్వత సిబ్బంది స్థానంలో ఔట్సోర్సింగ్పై ఆధారపడటం వల్ల భద్రతా లోపాలు తలెత్తుతున్నాయని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
Also Read
- IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
- China: షిప్యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
- Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
- CM Chandrababu : కలెక్టర్లకు చంద్రబాబు బిగ్ టార్గెట్.. న్యూ ఏజ్ గవర్నెన్స్పై ఫోకస్
విరాళాల లెక్కింపులో పారదర్శకత పెంచేందుకు ప్రత్యేకంగా టేబుళ్లు ఏర్పాటు చేయాలని హైకోర్టు సూచించింది. అంతేకాకుండా విరాళాల కౌంటింగ్ ప్రక్రియలో భక్తులను కూడా ఎందుకు భాగస్వాములుగా తీసుకోకూడదని ప్రశ్నించింది. అయితే ఆగమన శాస్త్రం ప్రకారం భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఏదైనా తప్పిదం జరిగితే వెంటనే అప్రమత్తం అయ్యేలా విజిలెన్స్ అధికారులు అలర్ట్ టెక్నాలజీని అమలు చేయాలని ఆదేశించింది. కౌంటింగ్ ప్రక్రియలో హ్యూమన్ ఇంటర్ఫెరెన్స్ను సాధ్యమైనంతవరకు తగ్గించి, పూర్తి స్థాయిలో టెక్నాలజీని వినియోగించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు టీటీడీ యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. చివరగా ఈ కేసు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Eat Curd in Winter: చలికాలంలో గడ్డ పెరుగు తింటున్నారా.. అయితే వీటిని తెలుసుకోండి..
తాజావార్తలు
-
1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
-
IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
-
CM Chandrababu : వచ్చే కాన్ఫరెన్స్ నాటికి 100 శాతం కనెక్టివిటీ ఉండాల్సిందే
-
China: షిప్యార్డులో భారీ అగ్నిప్రమాదం.. విదేశీ కార్గో నౌకలో 20 మంది మృతి
-
Karnataka: ఇకపై వందేమాతరంలో రెండు చరణాలే పాడండి.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?