TTD: భక్తుల సమస్యలు తెలుసుకునేందుకు ఫీడ్బ్యాక్ వ్యవస్థ.. టీటీడీ కీలక నిర్ణయాలు
- టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు
- దేశవ్యాప్తంగా టీటీడీ కార్యక్రమాలు నిర్వహించడానికి కమిటీ ఏర్పాటు
- ప్రతి రాష్ట్ర రాజధానిలో టీటీడీ ఆలయాలు నిర్మిస్తాం
- తిరుమలలో ఉన్న హోటల్స్ టెండర్ల కేటాయింపులో మార్పులు
- అన్నప్రసాదం కోసం అదనంగా 258 సిబ్బంది నియామకం
- భక్తుల సమస్యలు తెలుసుకునేందుకు ఫీడ్బ్యాక్ వ్యవస్థ.
TTD: టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా టీటీడీ కార్యక్రమాలు నిర్వహించడానికి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ప్రతి రాష్ర్ట రాజధానిలో టీటీడీ ఆలయాలు నిర్మిస్తామని ఆయన వెల్లడించారు. స్విమ్స్ హస్పిటల్కు జాతీయ హోదా కల్పించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామన్నారు. తిరుమల పర్యటనలో భక్తుల ఆరోగ్య సమస్యలు గుర్తించి సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. దర్శనం, వసతి సౌకర్యాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. భక్తులకు అందించే సేవలపై, వారి సమస్యలను తెలుసుకునేందుకు ఫీడ్ బ్యాక్ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
Read Also: Kunamneni Sambasiva Rao: సంధ్య థియేటర్ ఘటనను రాజకీయం చేయడం తగదు..
Also Read
- Best Bedsheets for Summer: వేసవి ఉక్కపోతతో నిద్రపట్టడం లేదా..? ఈ బెడ్షీట్ మార్చి చూడండి.. హాయిగా నిద్ర పడుతుంది...!
- Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
- Spirit : స్పిరిట్.. మెంటలెక్కించే అప్డేట్!
- Stock Market: హార్ముజ్ డెడ్లాక్ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో సూచీలు
తిరుమలలో వున్న హోటల్స్ టెండర్ల కేటాయింపులో మార్పులు చేస్తామని తెలిపారు. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో అన్నప్రసాద తయారీ కేంద్రంలో ప్రస్తుతం ఉన్న సిబ్బంది సరిపోవడం లేదని.. అన్నప్రసాద తయారీ కేంద్రంలో అదనంగా 258 మంది సిబ్బందిని నియమిస్తామని టీటీడీ ఈవో తెలిపారు. తిరుమలలో ఫుడ్ సేఫ్టీ విభాగాన్ని ఏర్పాటు చేయాలని తిరుమల పాలకమండలి సమావేశంలో నిర్ణయించినట్లు చెప్పారు. కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంప్రదాయ పాఠశాల నిర్వహణకు రూ.2 కోట్లు కేటాయించామన్నారు. భక్తులు సౌకర్యార్థం క్యూ కాంప్లెక్స్ వద్ద 3.6 కోట్ల రూపాయలతో టాయిలెట్స్ నిర్మాణం చేపట్టామన్నారు. ఒంటిమిట్ట రామాలయంలో 42 లక్షల బంగారు కలశం ఏర్పాటు చేశామని చెప్పారు. శారదా పీఠానికి కేటాయించిన మఠం లీజు రద్దు చెయ్యడానికి నోటీసులు జారీ చేశామని.. వారి సమాధానంపై తదుపరి చర్యలు ఉంటాయని టీటీడీ ఈవో శ్యామల రావు వెల్లడించారు.
తాజావార్తలు
-
5G Smart Phones Under 15000: 7,000 mAh బ్యాటరీ.. హైటెక్ ఫీచర్లతో, 15,000 బడ్జెట్లో కొత్త 5G స్మార్ట్ఫోన్లు ఇవే
-
Best Bedsheets for Summer: వేసవి ఉక్కపోతతో నిద్రపట్టడం లేదా..? ఈ బెడ్షీట్ మార్చి చూడండి.. హాయిగా నిద్ర పడుతుంది…!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Spirit : స్పిరిట్.. మెంటలెక్కించే అప్డేట్!
-
Stock Market: హార్ముజ్ డెడ్లాక్ ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో సూచీలు
ట్రెండింగ్
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!