Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Tsutf Want To Solve Demands

TSUTF : కోర్టు ఆటంకాలను తొలగించి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి

Published Date :March 10, 2024 , 6:33 pm
By Gogikar Sai Krishna
TSUTF : కోర్టు ఆటంకాలను తొలగించి ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలి
  • Follow Us :
  • google news
  • dailyhunt

న్యాయపరమైన చిక్కులను తొలగించి ఉపాధ్యాయుల బదిలీలు,పదోన్నతుల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర విస్తృత కమిటీ సమావేశం డిమాండ్ చేసింది. రెండవ రోజు హైదరాబాద్ లోని టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు కే .జంగయ్య అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు కే జంగయ్య , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి లు ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు కే జంగయ్య మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ప్రత్యేక చొరవ చూపాలని అన్నారు . రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని కోర్టు ఆటంకాలను తొలగించి ఉపాధ్యాయుల బదిలీలు పదోన్నతులు షెడ్యూల్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మల్టీ జోన్ 2 జడ్పీ హైస్కూల్ హెచ్ఎం ప్రమోషన్స్ నిలిచిపోయాయి. కోర్ట్ కేసు కారణంగా రంగారెడ్డి జిల్లాకు చెందిన కొందరు స్కూల్ అసిస్టెంట్స్ బదిలీలను ఆపడం కోసం సీనియారిటీ జాబితాపై కేసు వేశారు. ఇటీవల ఎమ్మెల్సీ నర్సిరెడ్డి జోక్యం చేసుకొని సీఎం, సిఎం సలహాదారు, అడ్వకేట్ జనరల్ తో చర్చించిన ఫలితంగా కేసులో కొంత పురోగతి వచ్చింది. ఒకటి రెండు రోజుల్లో డైరెక్షన్ వచ్చిన వెంటనే ప్రధానోపాధ్యాయుల పదోన్నతుల షెడ్యూల్ ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్లో విద్యారంగానికి కేటాయింపులు స్వల్పంగా పెంచడం అభినందనీయమని అన్నారు.

 

అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో కాంట్రిబ్యూషన్ పెన్షన్ విధానాన్ని(సిపిఎస్)రద్దు చేస్తాను ఇచ్చిన హామీని గుర్తు చేశారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు సామాజిక భద్రతను కల్పించే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న 4 విడతల డి.ఎ.ను వెంటనే విడుదల చేయాలి డిమాండ్ చేశారు.ఈ నెల మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. జి.ఓ. 317 అమలు కారణంగా ఏర్పడిన సమస్యలను అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి తగిన పరిష్కార మార్గాలను సిఫారసు చేయటానికి ఇటీవలే వైద్య ఆరోగ్య శాఖామంత్రి శ్రీ దామోదర రాజనర్సింహా చైర్మన్ గా మంత్రులు డి. శ్రీధర్ బాబు, శ్రీ పొన్నం ప్రభాకర్ సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. క్యాడర్ సీనియారిటీ కారణంగా స్థానికత కోల్పోయిన వారికి జి.ఓ. 317 కారణంగా వేరు చేయబడి బ్లాక్ చేయబడిన 13 జిల్లాల్లో బదిలీల కోసం ఎదురుచూస్తున్న స్పౌజ్లకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము.పండిట్,పి ఇ టి ల అప్గ్రేడేషన్ సమస్యను పరిష్కరించి పండిట్, పి ఇ టి లకు ప్రమోషన్లు ఇవ్వాలని అన్నారు. ఉన్నత పాఠశాలలో జూనియర్,రికార్డ్ అసిస్టెంట్స్ ని నియమించాలని,పాఠశాలల శుభ్రతకై పారిశుధ్య కార్మికులను నియమించాలని.KGBV ఉపాధ్యాయులకు మినిమం బేసిక్ పే వర్తింప చేసి ఉద్యోగులతో సమానంగా అన్ని సెలవులు వర్తింప చేసే విధంగా చర్యలు తీసుకొవాలని అన్నారు .ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, గురుకుల ఉపాధ్యాయుల సమస్యలు , మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఉన్నారు. సమావేశంలో విద్యా రంగం, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై తీర్మానాలు చేయడం జరిగింది. ఈ సమావేశాల్లో రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ రాములు, చావ దుర్గా భవాని , కోశాధికారి టి. లక్ష్మారెడ్డి, పత్రిక సంపాదకులు పి మాణిక్‌రెడ్డి, కుటుంబ సంక్షేమ నిధి , రాష్ట్ర కార్యదర్శి ఎం రాజశేఖర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కే. సోమశేఖర్, ఎం వెంకటి, వి.శాంతికుమారి, ఈ గాలయ్య, ఎస్‌ మల్లారెడ్డి, డి సత్యానంద్‌, జి నాగమణి, కె రవికుమార్‌, ఎస్‌ రవిప్రసాద్‌గౌడ్‌, ఎ సింహాచలం, వై జ్ఞానమంజరి,ఆడిట్ కమిటీ కన్వీనర్ మహబూబ్‌అలీ , వివిధ జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు , రాష్ట్ర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • latest news
  • telugu news
  • tsutf

తాజావార్తలు

  • Devi Sri Prasad: దేవీశ్రీ దూరం అవుతున్నాడా? పక్కన పెడుతున్నారా?

  • Mojtaba Khamenei: అమెరికా – ఇజ్రాయెల్ లొంగిపోతేనే యుద్ధం ఆగిపోతుంది: ఇరాన్ సుప్రీం లీడర్

  • Anirudh Ravichander: అనిరుధ్ ‘అల్బుకర్క్యూ రికార్డ్స్’తో కలిసిన యూనివర్సల్ మ్యూజిక్

  • Oppo K14 5G: 7000mAh బ్యాటరీ బీస్ట్ Oppo K14 5G భారత్‌లో లాంచ్.. IP69 వాటర్‌ప్రూఫ్ + 50MP AI కెమెరా

  • Rakasa : భారీ మొత్తానికి రాకాస‌ హక్కుల అమ్మకం

ట్రెండింగ్‌

  • Health Tips : బెండకాయతో కలిపి వీటిని అస్సలు తినకండి.. ఆరోగ్యానికి ప్రమాదకరం..!

  • Summer Tips : 40°+ ఎండలో కూల్‌గా ఉండాలంటే.. ఈ సమ్మర్ సీక్రెట్స్ ట్రై చేయండి..!

  • Viral News: నిమ్మకాయ జ్యూస్‌కి ‘గ్యాస్ ఛార్జ్‌’.. షాకైన కస్టమర్లు!

  • Spiritual Tips : పచ్చ కర్పూరం ఇలా వాడితే..? ఇంట్లో నెగటివ్ ఎనర్జీ మాయం.!

  • Gond Katira Summer Drinks: వేసవిలో ఈ డ్రింక్ తాగారా..? శరీరం ఐస్‌లా చల్లబడుతుంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions