TSRTC: ‘హైదరాబాద్ దర్శన్’ పేరుతో టీఎస్ ఆర్టీసీ స్పెషల్ ప్యాకేజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSRTC: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఎన్నో చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వాటిని చూసేందుకు ఇతర రాష్ట్రాలనుంచే కాకుండా దేశ విదేశాలనుంచి పర్యాటకులు వస్తుంటారు. అయితే నగరానికి కొత్తగా వచ్చిన వారికి ప్రదేశాలను సందర్శించేందుకు ఏ బస్సు ఎక్కాలో .. గమ్య స్థానాన్ని ఎలా చేరుకోవాలో తెలియక తికమక పడుతుంటారు. ఇలాంటి వారి కోసమే తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఎలాంటి టెన్షన్ లేకుండా నగరంలోని పలు ప్రాంతాలను సందర్శించేలా వీలు కల్పించింది. హైదరాబాద్ దర్శన్ పేరుతో స్పెషల్ ప్యాకేజ్ ను తీసుకొచ్చింది టీఎస్ ఆర్టీసీ. వారాంతాల్లో శని, ఆదివారాల్లో ఈ స్పెషల్ ప్యాకేజీ అందుబాటులో ఉండనుంది.
పాఠశాల యాజమాన్యాలు, కాలేజీ స్టూడెంట్స్, కుటుంబాలకు, ఉద్యోగులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ ప్యాకేజీలో భాగంగా మెట్రో ఎక్స్ప్రెస్లో ప్రయాణించాలనుకునే పెద్దలు రూ. 250, చిన్నారులు రూ. 130 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే మెట్రో లగ్జరీ ఏసీ బస్సు అయితే పెద్దలకు రూ. 450, చిన్నారులు రూ. 340 చెల్లించాలి. టికెట్లను ఆర్టీసి అధికారిక వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. అలాగే పూర్తి సమాచారం కోసం 040-23450033 or 040-69440000 నెంబర్లకు సంప్రదించాల్సి ఉంటుంది.
Also Read
- INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
- CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
- India vs Pakistan: అంపైర్లు కూడా భారత్కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
- TG20 League: 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' ఫైనల్ స్క్వాడ్.. ఇదిగో పూర్తి లిస్ట్..
Read Also: Idli ATM: డబ్బులిచ్చే ఏటీఎం ఓకే.. ఇడ్లీ ఇచ్చే ఏటీఎంను చూశారా..
హైదరాబాద్ దర్శన్ ప్యాకేజీలో భాగంగా ఉదయం 8.30 గంటలకు సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ నుంచి బస్సు బయలుదేరుతుంది. 9 గంటల నుంచి 10 గంటల వరకు బిర్లామందిర్, తర్వాత 10.30 నుంచి 12.30 వరకు చౌమల్లా ప్యాలెస్, మధ్యాహ్నం 1 గంట నుంచి 1.45 గంటల వరకు తారామతి బరాదరి రిసార్ట్స్, 2 గంటల నుంచి 3.30 గంటల వరకు గోల్కోండ కోట, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు దుర్గం చెరువు, 5.30 గంటల నుంచి 6 గంటల వరకు కేబుల్ బ్రిడ్జ్, 6.30 నుంచి 7.30 గంటల వకు హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ పార్క్లను సందర్శించవచ్చు. మొత్తం 12 గంటల పాటు జర్నీ సాగుతుంది. తిరిగి రాత్రి 8.30 గంటలకు ఆల్ఫ హోటల్ దగ్గర దించుతారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!