TSRTC: ‘హైదరాబాద్ దర్శన్’ పేరుతో టీఎస్ ఆర్టీసీ స్పెషల్ ప్యాకేజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSRTC: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఎన్నో చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వాటిని చూసేందుకు ఇతర రాష్ట్రాలనుంచే కాకుండా దేశ విదేశాలనుంచి పర్యాటకులు వస్తుంటారు. అయితే నగరానికి కొత్తగా వచ్చిన వారికి ప్రదేశాలను సందర్శించేందుకు ఏ బస్సు ఎక్కాలో .. గమ్య స్థానాన్ని ఎలా చేరుకోవాలో తెలియక తికమక పడుతుంటారు. ఇలాంటి వారి కోసమే తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక చర్యలు తీసుకుంది. ఎలాంటి టెన్షన్ లేకుండా నగరంలోని పలు ప్రాంతాలను సందర్శించేలా వీలు కల్పించింది. హైదరాబాద్ దర్శన్ పేరుతో స్పెషల్ ప్యాకేజ్ ను తీసుకొచ్చింది టీఎస్ ఆర్టీసీ. వారాంతాల్లో శని, ఆదివారాల్లో ఈ స్పెషల్ ప్యాకేజీ అందుబాటులో ఉండనుంది.
పాఠశాల యాజమాన్యాలు, కాలేజీ స్టూడెంట్స్, కుటుంబాలకు, ఉద్యోగులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ ప్యాకేజీలో భాగంగా మెట్రో ఎక్స్ప్రెస్లో ప్రయాణించాలనుకునే పెద్దలు రూ. 250, చిన్నారులు రూ. 130 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే మెట్రో లగ్జరీ ఏసీ బస్సు అయితే పెద్దలకు రూ. 450, చిన్నారులు రూ. 340 చెల్లించాలి. టికెట్లను ఆర్టీసి అధికారిక వెబ్సైట్లో బుక్ చేసుకోవచ్చు. అలాగే పూర్తి సమాచారం కోసం 040-23450033 or 040-69440000 నెంబర్లకు సంప్రదించాల్సి ఉంటుంది.
Also Read
- Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ 'జీరా రైస్' ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
- RAW NTR: 'ఊరు–వాడ' కార్యక్రమంపై 'రా ఎన్టీఆర్' కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
- Potti Sriramulu's Sacrifice: 58 రోజుల పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష.. దేశాన్ని కదిలించిన ఉద్యమ చరిత్ర
- Bahadurguda: బహుద్దుర్ గుడాలో హైటెన్షన్..!
Read Also: Idli ATM: డబ్బులిచ్చే ఏటీఎం ఓకే.. ఇడ్లీ ఇచ్చే ఏటీఎంను చూశారా..
హైదరాబాద్ దర్శన్ ప్యాకేజీలో భాగంగా ఉదయం 8.30 గంటలకు సికింద్రాబాద్ ఆల్ఫా హోటల్ నుంచి బస్సు బయలుదేరుతుంది. 9 గంటల నుంచి 10 గంటల వరకు బిర్లామందిర్, తర్వాత 10.30 నుంచి 12.30 వరకు చౌమల్లా ప్యాలెస్, మధ్యాహ్నం 1 గంట నుంచి 1.45 గంటల వరకు తారామతి బరాదరి రిసార్ట్స్, 2 గంటల నుంచి 3.30 గంటల వరకు గోల్కోండ కోట, సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు దుర్గం చెరువు, 5.30 గంటల నుంచి 6 గంటల వరకు కేబుల్ బ్రిడ్జ్, 6.30 నుంచి 7.30 గంటల వకు హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ పార్క్లను సందర్శించవచ్చు. మొత్తం 12 గంటల పాటు జర్నీ సాగుతుంది. తిరిగి రాత్రి 8.30 గంటలకు ఆల్ఫ హోటల్ దగ్గర దించుతారు.
తాజావార్తలు
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Lenin Success Meet: ‘లెనిన్’ సక్సెస్ సెలబ్రేషన్స్.. రెండో ఈవెంట్కు ముఖ్య అతిథిగా నాగ చైతన్య ?
-
Infinix Hot 70 Pro: ఇన్ఫినిక్స్ హాట్ 70 ప్రో రిలీజ్.. డ్యూయల్ డిస్ప్లే, 144Hz స్క్రీన్, 6000mAh బ్యాటరీ
-
RAW NTR: ‘ఊరు–వాడ’ కార్యక్రమంపై ‘రా ఎన్టీఆర్’ కీలక ప్రకటన.. ఆరోపణలకు కౌంటర్..
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!