తెలంగాణలో 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి ఈ నెల 11న టీఎస్పీఎస్సీ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పలు కీలక సూచనలు చేసింది. పరీక్ష ప్రారంభమయ్యే సమయానికి 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రం గేట్లు మూసివేస్తామని వెల్లడించింది. ఉదయం 10.15 AM తర్వాత అభ్యర్థులను ఎవరినీ లోపలికి అనుమంతించేది లేదని తేల్చి చెప్పింది. అందువల్ల అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించింది. అలాగే ఓఎంఆర్ పత్రంలో ఎవరైనా తప్పులు చేసినట్లైతే దానికి బదులుగా కొత్తది ఇవ్వలేమని టీఎస్పీఎస్సీ వెల్లడించింది.
Also Read : Machilipatnam Tirupati Express: మచిలీపట్నం-తిరుపతి ఎక్స్ప్రెస్కు తప్పిన ప్రమాదం
అలాగే ఓఎంఆర్ పత్రంలో వ్యక్తిగత వివరాలను, సమాధానాలను బ్లూ లేదా బ్లాక్ బాల్పాయింట్ పెన్తో మాత్రమే కరెక్ట్ గా బబ్లింగ్ చేయాలని సూచించింది. సరిగ్గా బబ్లింగ్ చేయకపోయినా, పెన్సిల్, ఇంక్పెన్, జెల్పెన్ ఉపయోగించినా, డబుల్ బబ్లింగ్ చేసినా పత్రాలు చెల్లుబాటు కావని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చెప్పింది. అభ్యర్థులు హాల్టికెట్తో పాటు ఆధార్, పాన్ కార్డులు, ప్రభుత్వ ఉద్యోగి అయితే దానికి సంబంధించిన గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్సు తదితర ఫొటోతో కూడిన ప్రభుత్వ గుర్తింపు కార్డులు వెంట తీసుకొని రావాలని క్లారిటీ ఇచ్చింది. ఈ విషయంలో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వారిపై తగిన కేసులు నమోదు చేసి, కమిషన్ నిర్వహించే పరీక్షలు రాయకుండా డిబార్ చేస్తామని టీఎస్పీఎస్సీ హెచ్చరించింది. అయితే నిన్నటి ( ఆదివారం ) నుంచి గ్రూప్-1కి సంబంధించి అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది.
Also Read : Wrestlers Protest: అమిత్ షాను కలిసిన రెజ్లర్లు.. బ్రిజ్ భూషన్పై చర్యలు తీసుకోవాలని ఒత్తిడి..