TSPCB : స్టోన్ క్రషింగ్ యూనిట్లపై కొరడా.. రూ.5.5 కోట్ల పర్యావరణ పరిహారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీఎస్పీసీబీ) జీఓ 111 పరిధిలోని స్టోన్ క్రషింగ్ యూనిట్లపై రూ.5.5 కోట్ల పర్యావరణ పరిహారాన్ని విధించింది. ప్రభుత్వ ఉత్తర్వు (GO) 111 ప్రకారం.. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరివాహక ప్రాంతంలో 10 కిలోమీటర్ల పరిధిలో అభివృద్ధి, నిర్మాణ పనులను నిషేదించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. జీఓ 111 ప్రాంతంలో నిర్వహిస్తున్న అక్రమ, అనధికార స్టోన్ క్రషర్ యూనిట్లపై చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) సౌత్ బెంచ్లో హైదరాబాద్కు చెందిన పీవీ సుబ్రమణ్య వర్మ పిటిషన్ దాఖలు చేయడంతో పెనాల్టీ విధించారు.
Also Read : Elon Musk: ఉద్యోగులనే కాదు.. ఒంట్లో కొవ్వునూ వదలట్లేదు.. ఏకంగా 13కేజీలు తగ్గిన మస్క్
రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లోని వట్టినాగులపల్లి, కోకాపేట్, గౌల్దొడ్డి, గోపన్పల్లి, కొల్లూరు, కొత్వాల్గూడ, ఉస్మాన్నగర్ గ్రామాల్లో క్రషర్లు ఉన్నాయి. అక్టోబర్ 14న జరిగిన విచారణ అనంతరం తీసుకున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని టీఎస్పీసీబీని ఎన్జీటీ ఆదేశించింది. హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ సరస్సుల 10కిలోమీటర్ల పరిధిలో ఉన్న స్టోన్ క్రషింగ్ యూనిట్లలో బోర్డు అధికారులు అక్టోబర్, నవంబర్లో తనిఖీలు చేపట్టారు. బోర్డు అనుమతి లేకుండా యూనిట్లను నిర్వహించడం, బోర్డు మూసివేత ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత కూడా కార్యకలాపాలు కొనసాగించడం, పర్యావరణానికి హాని కలిగించడం వంటి కారణాలతో కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ఎన్జీటీ ఆదేశాలకు అనుగుణంగా ఉల్లంఘించిన యూనిట్లకు నోటీసులు జారీ చేసింది.
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
టీఎస్పీసీబీ, జోనల్ కార్యాలయాలు, హైదరాబాద్ మరియు ఆర్సి పురం జోనల్ కార్యాలయంలోని టాస్క్ఫోర్స్ కమిటీ ముందు విచారణ నిర్వహించి పర్యావరణ పరిహారం వసూలు చేయాలని సిఫార్సు చేసింది. అనంతరం ఒక్కో స్టోన్ క్రషర్ యూనిట్ కు రూ.8.45 లక్షల నుంచి రూ.91 లక్షల వరకు పరిహారం విధించారు. జరిమానాతో కూడిన యూనిట్లలో శేరిలింగంపల్లిలోని గ్రేట్ ఇండియా మైనింగ్, శ్రీ లక్ష్మీ నరసింహ మెటల్ ఇండస్ట్రీస్, శ్రీ లక్ష్మీ కన్స్ట్రక్షన్స్, హైదరాబాద్ రాక్ సాండ్, ఆదేశ్వర్ ట్రేడర్స్, తేజా రెడ్డి క్రషర్స్, సిఎస్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ (క్రషర్) ఉన్నాయి. వట్టినాగులపల్లికి చెందిన పేరులేని స్టోన్ క్రషర్, గండిపేటకు చెందిన షామా మెటల్ సప్లై, డీబీఆర్ మెటల్ ఇండస్ట్రీ, కొత్వాల్గూడకు చెందిన SMI స్టోన్ క్రషర్ (షామా మెటల్ ఇండస్ట్రీ), శ్రీ సాయి బాలాజీ రాక్ సాండ్ ఇండస్ట్రీ ఉన్నాయి..
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..