TSLPRB : పోలీస్ అభ్యర్థులకు అలర్ట్.. నియామక తుది పరీక్ష తేదీల్లో మార్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పోలీసు నియామక తుది పరీక్ష తేదీల్లో మార్పులు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్పీఆర్బీ) వెల్లడించింది. టీఎస్పీఎస్సీ విజ్ఞప్తి మేరకు టీఎస్ఎల్పీఆర్బీ మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే.. నాలుగు పరీక్ష తేదీల్లో మార్పులు చేసినట్లు టీఎస్ఎల్పీఆర్బీ వెల్లడించింది. ఎస్సై(ఐటీ), ఏఎస్సై( ఫింగర్ ఫ్రింట్స్), కానిస్టేుబుల్, కానిస్టేబుల్(ఐటీ) పరీక్షల్లో తేదీలు మార్పు చేసింది టీఎస్ఎల్పీఆర్బీ. ఏప్రిల్ 23వ తేదీన జరగాల్సిన కానిస్టేబుల్ రాత పరీక్ష 30వ తేదీకి మార్చగా,, ఎస్సై(ఐటీ విభాగం) పరీక్ష మార్చి 12వ తేదీ నుంచి 11వ తేదీకి మార్పు చేసినట్లు పేర్కొంది టీఎస్ఎల్పీఆర్బీ. అంతేకాకుండా.. ఏఎస్సై( ఫింగర్ ప్రింట్స్) పరీక్ష మార్చి 12వ తేదీ నుంచి 11వ తేదీకి మార్పు చేయగా.. కానిస్టేబుల్(ఐటీ విభాగం) పరీక్ష ఏప్రిల్ 23వ తేదీ నుంచి 30వ తేదీకి మార్పు చేసింది టీఎస్ఎల్పీఆర్బీ. అయితే.. ఈ నెల 5తో దేహాదారుఢ్య పరీక్షలు ముగిశాయి. రాష్ట్రంలో మొత్తం 12 సెంటర్లలో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించగా.. 2 లక్షల 7 వేల 106 మంది అభ్యర్ధులు ఈవెంట్స్ కి హాజరయ్యారు.
Also Read : Purple Cabbage: ఊదారంగు క్యాబేజీ తింటే.. ఆ ప్రాబ్లమ్ ఉండదా..!
Also Read
- Bangladesh: పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్.. చైనా నుంచి 20 ఫైటర్ జెట్ల కొనుగోలు!
- Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
- SSC Memos: మార్చి, జూన్ 2026 పరీక్షల్లో పాసైన ‘పది’ విద్యార్థులకు అలర్ట్.. రేపు సర్టిఫికేట్ల పంపిణీ..
- Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
అయితే.. వీరిలో 1,11,209 అర్హత సాధించినట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ తెలిపింది. మొత్తం 53.7 శాతం అభ్యర్థులు క్వాలిఫై అయినట్లు వెల్లడించింది. 2018-19 నోటిఫికేషన్ లో 48.5 శాతం అభ్యర్థులు ఫిజికల్ ఈవెంట్స్ లో క్వాలిఫై కాగా.. ఈసారి 53.7 శాతం క్వాలిఫై అయ్యారని తెలిపింది టీఎస్ఎల్పీఆర్బీ. ఈవెంట్స్ మొత్తం ప్రక్రియను సీసీ కెమెరాల్లో రికార్డ్ చేసినట్లు టీఎస్ఎల్పీఆర్బీ పేర్కొంది. అయితే, ఈసారి లాంగ్ జంప్, షాట్ ఫుట్ ఈవెంట్స్ కి ఒక్కొక్కరికి మూడుసార్లు చాన్స్ ఇచ్చినట్లు తెలిపారు టీఎస్ఎల్పీఆర్బీ అధికారులు. లాంగ్ జంప్ లో 83శాతం పురుషులు, 80 శాతం మంది మహిళా అభ్యర్ధులు క్వాలిఫై అవగా, షాట్ పుట్ లో 91 శాతం మంది పురుషులు, 96 శాతం మంతి మహిళా అభ్యర్ధులు క్వాలిపై అయ్యారని టీఎస్ఎల్పీఆర్బీ అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Bangladesh: పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్.. చైనా నుంచి 20 ఫైటర్ జెట్ల కొనుగోలు!
-
Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
-
SSC Memos: మార్చి, జూన్ 2026 పరీక్షల్లో పాసైన ‘పది’ విద్యార్థులకు అలర్ట్.. రేపు సర్టిఫికేట్ల పంపిణీ..
-
Jio IPO: మీకు జియోలో వాటా కావాలా..? ఐపీఓకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన సెబీ..
-
CM Chandrababu : స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!