TRS : సెప్టెంబర్ 3న టీఆర్ఎస్ఎల్పీ సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సెప్టెంబర్ 3న తెలంగాణ క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ క్యాబినెట్ మీటింగ్ తరువాత తెలంగాణ భవన్లో సాయంత్రం 5 గంటలకు టీఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ (టీఆర్ఎస్ఎల్పీ) సమావేశాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించినట్లు పార్టీ శ్రేణుల వెల్లడించాయి.
టీఆర్ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ అధ్యక్షతన సాగే ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీలు కూడా పాల్గొంటారని టీఆర్ఎస్ శ్రేణులు వెల్లడించారు. ఈ సందర్భంగా, రాష్ట్రంలో అమలవుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, నూతనంగా అమలు చేస్తున్న పెన్షన్లు, గిరిజనులకు పోడు భూములు,తదితర అంశాలపై, సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే రేపు సీఎం కేసీఆర్ బీహార్ పర్యటనకు వెళ్లనున్నారు.
Also Read
- Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
- TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
- CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
- US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్.. బీహార్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో పాట్నాకు బయలుదేరి వెళతారు సీఎం కేసీఆర్. గాల్వాన్ ఘర్షణల్లో అమరులైన సైనిక కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందజేసి, అలాగే సికింద్రాబాద్ టింబర్ డిపోలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన పన్నెండు మంది కూలీల కుటుంబాలకు కూడా సాయం అందించనున్నారు.
తాజావార్తలు
-
Watermelon Case: పుచ్చకాయ తిని నలుగురు మృతి.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ నిజం..
-
TVK Vijay: విజయ్కు కొత్త చిక్కులు.. వాట్సాప్ మెసేజ్లపై వామపక్షాలు గుర్రు!
-
CM Chandrababu : బుల్లెట్ బండి.. కాలేజీ జ్ఞాపకాలు.. రాయల్ ఎన్ఫీల్డ్ నడపడంపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
-
US-Iran Talks: హార్ముజ్పై గుడ్న్యూస్.. ఇరాన్-యూఎస్ మధ్య కీలక చర్చలు.. ఏం నిర్ణయం తీసుకున్నారంటే..!
-
Ponnam Prabhakar : రాజకీయాల్లో హుందాతనం ముఖ్యం.. భౌతిక దాడులపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం