TRS Fire: ఫాంహౌస్ లో బీజేపీ వ్యవహారంపై టీఆర్ఎస్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మునుగోడు ఉప ఎన్నిక వేళ బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు పాల్పడింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతూ బీజేపీ నేతలు అడ్డంగా బుక్కైన వ్యవహారం తెలంగాణను షేక్ చేస్తోంది. ఈ వ్యవహారంపై టీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ను ఎలాగైనా దెబ్బకొట్టాలనే దురాలోచనతో అడ్డదార్లు ఎంచుకుంది. ఈ క్రమంలోనే డబ్బు ఆశ చూపి టీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేసి పోలీసులకు దొరికిపోయింది. చండూర్ లో ఎమ్మెల్యే బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. అంగట్లో సరుకులా రాజగోపాల్ రెడ్డిని కొనవచ్చు. కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోరన్నారు బాల్క సుమన్. నలుగురు ఎమ్మెల్యేలను కొనేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా ముగ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని బీజేపీ అధిష్టానం ఏర్పాటు చేసింది. ఆపరేషన్ ఆకర్ష్ వల విసిరింది.
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
వీరు భారీగా డబ్బులు ఎర వేసేందుకు ప్రయత్నిస్తూ హైదరాబాద్లో పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. ఇప్పటివరకు రూ.15 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు.మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి అజీజ్ నగర్లోని పీవీఆర్ ఫామ్ హౌస్లో కోట్లలో నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీపీఐ నేత కూనమనేని సాంబశివరావు మాట్లాడుతూ.. బీజేపీపై మండిపడ్డారు.
బీజేపీ రోజు నీతి మాటలు చెప్తుంది. చేసేదేమో చీకటి వ్యవహారం.. మత పెద్దలను ముందు పెట్టి MLAలను కొనుగోలు చేయడం అంటే బీజేపీ ఆలోచన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నారు. దేశమంతా బిజెపి ఇదే చేస్తుంది. మెజార్టీ లేని చోట కూడా ఎమ్మెల్యే లని కొనుగోలు చేసి అధికారం చేజిక్కించుకుంటుందని మండిపడ్డారు.ఏక్ నాథ్ షిండే తరహాలో ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేశారని, తెలంగాణలో ఇలాంటి ఆటలు సాగవన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.
ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కులగొట్టాలి అని ఆకునున్న బీజేపీ కుట్రను మా ఎమ్మెల్యేలు బయపెట్టారు. షిండే అలాంటి వారిని తయారు చేయాలనుకునే మీ ప్రయత్నాలు తెలంగాణ నెరవేరవు. ఈ కుట్రలు కుతంత్రాలు.. అపకపోతే ప్రజలు తగిన బుద్ధి చెబుతారు..గతంలోను కొందరు టిఆర్ఎస్ కులగొట్టేందుకు చేసిన ప్రయత్నాలు కూడా వీగిపోయి బీజేపీ మా ఎమ్మెల్యేలను కొనడం సాధ్యం కాదన్నారు. ఈ వ్యవహారంతో మునుగోడులో భారీ మెజారిటీ సాధిస్తామన్నారు. 50 వేల మెజారిటీ తథ్యం అన్నారు వినయ్ భాస్కర్.
ఇదంతా పక్కా సినిమా స్టోరీ.. డీకె అరుణ
ఇదిలా వుంటే.. ఇదంతా కేసీఆర్ సృష్టించిన సినిమా స్టోరీ అని కొట్టిపారేశారు బీజేపీ నేత డీకె అరుణ. చిల్లర రాజకీయాలు చేయడంలో దిట్ట. చిన్నపిల్లలు కూడా ఇలాంటి కథ చెప్పరు. వాళ్ళ ఎమ్మెల్యేకి చెందిన ఫాం హౌస్ లో ఇలా జరుగుతుందా? మునుగోడు లో ఓడిపోతామనే ఈ చిల్లర రాజకీయాలు చేశారన్నారు. ఇది మీరు చేయకపోతే.. యాదాద్రి ఆలయంలో ప్రమాణం చేయాలన్నారు డీకె అరుణ.

Read Also: BIG Breaking: నలుగురు TRS ఎమ్మెల్యేలకు వల.. పోలీసుల భారీ ఆపరేషన్
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!