TRS Fire: ఫాంహౌస్ లో బీజేపీ వ్యవహారంపై టీఆర్ఎస్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మునుగోడు ఉప ఎన్నిక వేళ బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు పాల్పడింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతూ బీజేపీ నేతలు అడ్డంగా బుక్కైన వ్యవహారం తెలంగాణను షేక్ చేస్తోంది. ఈ వ్యవహారంపై టీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. టీఆర్ఎస్ను ఎలాగైనా దెబ్బకొట్టాలనే దురాలోచనతో అడ్డదార్లు ఎంచుకుంది. ఈ క్రమంలోనే డబ్బు ఆశ చూపి టీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేసి పోలీసులకు దొరికిపోయింది. చండూర్ లో ఎమ్మెల్యే బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. అంగట్లో సరుకులా రాజగోపాల్ రెడ్డిని కొనవచ్చు. కానీ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అమ్ముడుపోరన్నారు బాల్క సుమన్. నలుగురు ఎమ్మెల్యేలను కొనేందుకు ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా ముగ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని బీజేపీ అధిష్టానం ఏర్పాటు చేసింది. ఆపరేషన్ ఆకర్ష్ వల విసిరింది.
Also Read
- Uday Krishna Reddy: లైంగిక వేధింపుల కేసులో ట్విస్ట్.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ రెడ్డి ఆత్మహత్య యత్నం..!
- Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
- PM Modi: వాదనలు బలంగా ఉండాలి.. శబ్దం కాదు.. వర్షాకాల సమావేశాలపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
- Towel Cleaning Tips: టవల్ ఉతికినా దుర్వాసన పోవట్లేదా? ఈ చిట్కాలతో సమస్యకు చెక్
వీరు భారీగా డబ్బులు ఎర వేసేందుకు ప్రయత్నిస్తూ హైదరాబాద్లో పోలీసులకు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. ఇప్పటివరకు రూ.15 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు.మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి అజీజ్ నగర్లోని పీవీఆర్ ఫామ్ హౌస్లో కోట్లలో నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీపీఐ నేత కూనమనేని సాంబశివరావు మాట్లాడుతూ.. బీజేపీపై మండిపడ్డారు.
బీజేపీ రోజు నీతి మాటలు చెప్తుంది. చేసేదేమో చీకటి వ్యవహారం.. మత పెద్దలను ముందు పెట్టి MLAలను కొనుగోలు చేయడం అంటే బీజేపీ ఆలోచన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అన్నారు. దేశమంతా బిజెపి ఇదే చేస్తుంది. మెజార్టీ లేని చోట కూడా ఎమ్మెల్యే లని కొనుగోలు చేసి అధికారం చేజిక్కించుకుంటుందని మండిపడ్డారు.ఏక్ నాథ్ షిండే తరహాలో ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేశారని, తెలంగాణలో ఇలాంటి ఆటలు సాగవన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.
ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మాట్లాడుతూ.. టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కులగొట్టాలి అని ఆకునున్న బీజేపీ కుట్రను మా ఎమ్మెల్యేలు బయపెట్టారు. షిండే అలాంటి వారిని తయారు చేయాలనుకునే మీ ప్రయత్నాలు తెలంగాణ నెరవేరవు. ఈ కుట్రలు కుతంత్రాలు.. అపకపోతే ప్రజలు తగిన బుద్ధి చెబుతారు..గతంలోను కొందరు టిఆర్ఎస్ కులగొట్టేందుకు చేసిన ప్రయత్నాలు కూడా వీగిపోయి బీజేపీ మా ఎమ్మెల్యేలను కొనడం సాధ్యం కాదన్నారు. ఈ వ్యవహారంతో మునుగోడులో భారీ మెజారిటీ సాధిస్తామన్నారు. 50 వేల మెజారిటీ తథ్యం అన్నారు వినయ్ భాస్కర్.
ఇదంతా పక్కా సినిమా స్టోరీ.. డీకె అరుణ
ఇదిలా వుంటే.. ఇదంతా కేసీఆర్ సృష్టించిన సినిమా స్టోరీ అని కొట్టిపారేశారు బీజేపీ నేత డీకె అరుణ. చిల్లర రాజకీయాలు చేయడంలో దిట్ట. చిన్నపిల్లలు కూడా ఇలాంటి కథ చెప్పరు. వాళ్ళ ఎమ్మెల్యేకి చెందిన ఫాం హౌస్ లో ఇలా జరుగుతుందా? మునుగోడు లో ఓడిపోతామనే ఈ చిల్లర రాజకీయాలు చేశారన్నారు. ఇది మీరు చేయకపోతే.. యాదాద్రి ఆలయంలో ప్రమాణం చేయాలన్నారు డీకె అరుణ.

Read Also: BIG Breaking: నలుగురు TRS ఎమ్మెల్యేలకు వల.. పోలీసుల భారీ ఆపరేషన్
తాజావార్తలు
-
Vivo X300e: వివో X300e.. 7200mAh బ్యాటరీ, Snapdragon 8 Gen 5 చిప్, 50MP ZEISS కెమెరాతో కొత్త ఫ్లాగ్షిప్
-
Team India: 200 వికెట్స్ తీసినా విలువ లేదా.. ఇక రిటైర్ అవ్వడమే బెటరా?
-
Zee5 Upcoming Movies: జీ5 మెగా లైనప్ అనౌన్స్.. వెంకటేష్, బాలయ్య, నాగచైతన్య సినిమాలతో భారీ ప్లాన్!
-
Uday Krishna Reddy: లైంగిక వేధింపుల కేసులో ట్విస్ట్.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ రెడ్డి ఆత్మహత్య యత్నం..!
-
Jung Ho-Yeon: ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీని ఆవిష్కరించిన తొలి కొరియన్ నటి.. ‘స్క్విడ్ గేమ్’ స్టార్ మరో అరుదైన ఘనత
ట్రెండింగ్
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్గా రోహిత్ అరుదైన రికార్డు!
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!