BIG Breaking: నలుగురు TRS ఎమ్మెల్యేలకు వల.. పోలీసుల భారీ ఆపరేషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లో పోలీసుల భారీ ఆపరేషన్ బయటపడింది. తెలుగు రాష్ట్రాలను ఇది షేక్ చేయనుంది.టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కోసం వల వేశారు. ఎమ్మెల్యేల బేరసారాలు బెడిసికొట్టాయి. తెలుగు రాష్ట్రాల్ని షేక్ చేసే బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది. తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్ లో పట్టుబడ్డవారిలో రామచంద్రభారతి, సింహయాజులు, నందకుమార్ వున్నారు. పూర్తి సాక్ష్యాధారాలతో రెడ్ హ్యాండె డ్ గా పట్టుకున్నారు పోలీసులు.. పట్టుబడ్డవారంతా బీజేపీ వారే అని తేలింది.
Also Read
కాసేపట్లో పోలీసుల ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ఈ ఆపరేషన్ లో పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, హర్షవర్థన్ రెడ్డి, రేగా కాంతారావు పేర్లు బయటకు వచ్చాయి.బీజేపీ ఆపరేషన్ బెడిసికొట్టింది. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో ఫిరాయింపుల కోసం నలుగురు TRS ఎమ్మెల్యేలతో బేరం జరుపుతుండగా పోలీసులు దాడులు జరిపారు. రూ.15 కోట్ల వరకు నగదు దొరికినట్లు సమాచారం. నలుగురు TRS ఎమ్మెల్యేల్లో పైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.100 కోట్లు ఇచ్చేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం.
మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో హైదరాబాద్ శివారు మొయినాబాద్లోని ఓ ఫాంహౌస్లో నలుగురు వ్యక్తులు భారీగా నగదుతో పట్టుబడ్డారు. రామచంద్రభారతి, సోమయాజులు స్వామి, తిరుపతి, నందకుమార్లను పోలీసులు పూర్తి సాక్ష్యాలతో పట్టుకున్నారు. మునుగోడులో ఫిరాయింపుల కోసం ప్లాన్ చేసినట్లు అనుమానిస్తున్నారు. TRS ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది.ఫామ్ హౌస్ కి చేరుకున్నారు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర. ఈ ఆపరేషన్ ని ఎన్టీవీ బ్రేక్ చేసింది.బంజారాహిల్స్ డెక్కన్ ప్రైడ్ అంబర్ పేట లో సెలబ్రేషన్స్ హోటల్స్ నిర్వహిస్తున్న నందు అనే వ్యక్తి కీలకంగా మారాడు. నందు ఒక మంత్రికి సన్నిహితుడుగా ప్రచారం సాగుతోంది.

సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ఏం చెప్పారంటే…
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారని మాకు సమాచారం వచ్చింది. రామచంద్రభారతి సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఈ సమాచారం ఇచ్చారు. డబ్బులు, కాంట్రాక్టులు, ఇతర పదవులు ఇస్తామని చెప్పారన్నారు. ఫాం హౌస్ లో రైడ్ చేస్తే ముగ్గురు పట్టుబడ్డారు. రామచంద్రభారతి ఢిల్లీలో వుంటారు. తిరుపతికి చెందిన స్వామీజీ సింహయాజులు వచ్చారు. హైదరాబాద్ కి చెందిన నందకుమార్ S/o శంకరప్ప ఇక్కడ వున్నారు. లీగల్ యాక్షన్ తీసుకుంటాం అన్నారు సీపీ స్టీఫెన్ రవీంద్ర. పార్టీ ఫిరాయింపుల కోసం వత్తిడి, ప్రలోభాలు పెట్టారన్నారు.
తాజావార్తలు
-
Crispy Poori Recipe: పూరీలు వెంటనే అణిగిపోతున్నాయా? ఈ చిన్న ట్రిక్ పాటిస్తే గంటల తరబడి ఉబ్బి కరకరలాడతాయి
-
Abhishek Nayar: శ్రేయస్ అయ్యర్ను కెప్టెన్సీ నుంచి తప్పించొద్దు.. రోహిత్, కోహ్లీ లాగే అయ్యర్కూ స్వేచ్ఛ ఇవ్వాలి
-
Disha Patani: హాలీవుడ్ ఛాన్స్ కొట్టేసిన దిశా పటాని.. భారీ థ్రిల్లర్ తో అరంగేట్రం!
-
Mana Jampala: 12 ఏళ్ల చిన్నారి.. మూడు దేశాల్లో ఏఐ కంపెనీ.. ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న వండర్ కిడ్ సక్సెస్ స్టోరీ!
-
Trikala : ఏకంగా మూడు OTTలలో త్రికాల స్ట్రీమింగ్
ట్రెండింగ్
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..