Mahua Moitra: టీఎంసీ ఎంపీపై ఆరోపణల వ్యవహారం.. బీజేపీ ఎంపీ, సుప్రీం న్యాయవాదిపై లీగల్ నోటీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahua Moitra: తృణమూల్ కాంగ్రెస్కు చెందిన ఎంపీ మహువా మొయిత్రా లోక్సభలో ప్రశ్నలు అడిగేందుకు లంచం తీసుకున్నారనే ఆరోపణలపై బీజేపీ ఎంపి నిషికాంత్ దూబే, సుప్రీం న్యాయవాది జై అనంత్ దేహద్రాయ్లకు లీగల్ నోటీసులు పంపారు. మొయిత్రా లోక్సభ లాగిన్ వివరాలను ఓ వ్యాపారవేత్తకు అందజేశారని సోమవారం ఆరోపించారు. ఈ అంశంపై వేర్వేరుగా దర్యాప్తు ప్రారంభించాలని స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్లను కూడా బీజేపీ నేత నిషికాంత్ దూబే కోరారు. నిషికాంత్ దూబే చేసిన ఆరోపణలను హీరానందానీ గ్రూప్ ఖండించింది. రాజకీయ వ్యాపారంలో ప్రమేయం లేదని పేర్కొంది.
Also Read: Rahul Gandhi: రేపటి నుంచి తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన..షెడ్యూల్ ఇదే..!
Also Read
- Cannes: కేన్స్ ఫెస్టివల్స్లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
- 705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
- Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
- New IPL Team: ఐపీఎల్ అభిమానులకు శుభవార్త.. కొత్తగా ఆ రాష్ట్రం పేరుతో మరో ఐపీఎల్ టీం..
ఈ ఆరోపణలపై టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా తీవ్రంగా స్పందించారు. ఎంపీల పార్లమెంటరీ పనులను పర్సనల్ అసిస్టెంట్లు, ఇంటర్న్లతో పాటు పెద్దబృందాలు చూసుకుంటాయని పేర్కొ్న్నారు. నిషికాంత్ దూబే, జై అనంత్ దేహద్రాయ్ వ్యక్తిగత, రాజకీయ పగ తీర్చుకోవడానికి తన ప్రతిష్ట, సద్భావనపై దాడి చేశారని ఆమె ఆరోపించారు. పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు టీఎంసీ ఎంపీ డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అదానీ గ్రూప్ స్పందించింది. తమ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొన్ని గ్రూప్లు, కొందరు వ్యక్తులు ప్రయత్నిస్తున్నారంటూ మొయిత్రాను ఉద్దేశించి తీవ్రంగా విమర్శలు గుప్పించింది. మరోవైపు టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా నిషికాంత్ దుబేతో పాటు జై అనంత్ దేహద్రాయ్కు లీగల్ నోటీసులు పంపారు. లోక్సభ స్పీకర్కు రాసిన లేఖలో తనపై వచ్చిన ఆరోపణలను ఉపసంహరించుకోవాలని మహువా మోయిత్రా నిషికాంత్ దూబేని కోరారు. ఆమె దూబే, దేహద్రాయ్ల నుండి వ్రాతపూర్వక క్షమాపణ కూడా కోరింది.
Also Read: Yogi Adityanath: వారికి దీపావళి కానుక.. ఒక గ్యాస్ సిలిండర్ ఫ్రీ..
మహువా మొయిత్రా లంచం తీసుకుంటూ పార్లమెంట్లో ప్రశ్నలు అడిగారంటూ బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. ఇప్పుడు స్పీకర్ ఈ ఫిర్యాదును లోక్సభ నైతిక విలువల కమిటీకి అందజేశారు. మహువా మొయిత్రా వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీ నుంచి నగదు, బహుమతుల రూపంలో లంచం తీసుకున్నారని, అందుకు ప్రతిఫలంగా ఆమె పార్లమెంటులో కూడా కొన్ని ప్రశ్నలు అడిగారని దూబే చెప్పారు. మహువా తన లోక్సభ లాగిన్ వివరాలను కూడా లీక్ చేశారని నిషికాంత్ దూబే ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్తో చెప్పారు. దీనిపై కూడా విచారణ జరపాలన్నారు.
తాజావార్తలు
-
Anna Lezhneva: జిమ్’లో వర్కౌట్స్ మొదలెట్టిన పవన్ భార్య
-
Cannes: కేన్స్ ఫెస్టివల్స్లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
-
Protein Rich Sattu Drink : ‘సత్తు డ్రింక్’ శరీరానికి పవర్ బూస్టర్.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా.!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
ట్రెండింగ్
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!