Ahmedabad Plane Crash: అద్భుతం.. ఇనుము కరిగింది కానీ, కానీ క్షేమంగా ఉన్న భగవద్గీత..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ahmedabad Plane Crash: ఎయిర్ ఇండియా విమానానికి సంబంధించి జరిగిన ఘోరమైన ప్రమాదం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్లే AI-171 ఫ్లైట్, టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే నియంత్రణ తప్పి ఒక మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనానికి ఢీకొని పేలిపోయింది. ఈ విషాద సంఘటనలో మొత్తం 242 మంది ప్రయాణికులలో 241 మంది ప్రాణాలు కోల్పోగా కేవలం ఒకరే ప్రాణాలతో బయటపడ్డారు. ఇది ఇలా ఉండగా ఈ ప్రమాదం తర్వాత జరిగిన రేస్క్యూ ఆపరేషన్ సమయంలో రక్షణ సిబ్బందికి ఒక అపూర్వమైన దృశ్యం కనిపించింది. మంటలు విమానం ఇనుమును కరిగించే స్థాయిలో ఉన్నా, ఆ మంటల మధ్య భగవద్గీత పూర్తిగా క్షేమంగా ఉండటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరిచింది.
Read Also: Gautam Gambhir: జట్టును వదిలేసి భారత్ కు చేరుకున్న టీమిండియా కోచ్.. ఎందుకంటే..?
Also Read
- IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
- Motichoor Laddu Recipe: మార్కెట్ లడ్డూలు తిని విసిగిపోయారా?.. ఇంట్లోనే మెత్తని మోతీచూర్ లడ్డూ సులువుగా..
- Tilak Varma: వైస్ కెప్టెన్పై పీక్స్లో ఒత్తిడి.. నేడు తెలుగు తేజం తిలక్ వర్మకు ఛాన్స్ దక్కుతుందా?
- TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
విమానంలో ఉన్న ఒక ప్రయాణికుడు తనతో పాటు తీసుకెళ్లిన ఈ పవిత్ర గ్రంథం, విమానంలోని మనుషులు, అన్ని వస్తువులు తగలబడిపోయిన ఆ తరువాత కూడా పవిత్ర గ్రంథం భగవద్గీతకు ఎలాంటి డ్యామేజ్ కాకుండా గమనించిన ప్రజలు ఇది ఒక దైవ సంకేతంగా భావిస్తున్నారు. మంటలు, పేలుళ్ల మధ్యన కూడా భగవద్గీత అలానే ఉండటం, ధర్మం పట్ల విశ్వాసం కలిగించే సంఘటనగా మారింది. ఈ సంఘటనకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా పంచుకుంటున్నారు. అందులో ఒక వ్యక్తి విమాన శకలాల వద్ద భగవద్గీత పేజీలను చూపిస్తున్నాడు. చుట్టూ దగ్ధమైన పదార్థాల మధ్యన పాడవని భగవద్గీత పుస్తకం చూసినవారందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు.
Read Also: Plane Crash: ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్న వైద్య విద్యార్థి..
ఈ ఘోరమైన ప్రమాదం నుండి రమేష్ విశ్వాశ్కుమార్ అనే ప్రయాణికుడు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. అతను సీటు నం. 11A, అంటే అత్యవసర ద్వారానికి దగ్గరగా కూర్చున్నాడు. సకాలంలో స్పందించి విమానం కూలకముందే బయటకు దూకడం వల్ల అతను ప్రాణాలతో బయటపడగలిగాడు. ఇది విన్నవారి గుండెల్లో భయాన్ని కలిగించినప్పటికీ అతని తెలివితేటలు అతని ప్రాణాన్ని నిలబెట్టాయి.
A passenger aboard the ill-fated AirIndia flight was carrying a copy of the Bhagavad Gita. In a remarkable turn, the sacred book was found intact and unharmed amidst the wreckage at the crash site. 🙏 pic.twitter.com/VBu4jYuvIi
— Megh Updates 🚨™ (@MeghUpdates) June 13, 2025
తాజావార్తలు
-
Salman Khan: పాకిస్తాన్ బాక్సాఫీస్ను షేక్ చేసిన సల్మాన్ సినిమా ఇదే.. 10 ఏళ్లైనా చెక్కుచెదరని రికార్డు!
-
Explainer: ప్రమాదంలో పశ్చిమ కనుమలు…ఇంతటి విలయానికి అదే కారణమా…?
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
MOTOROLA Moto Book 60 Pro: మళ్లీరాని ఆఫర్.. మోటరోలా AI ల్యాప్టాప్.. సగం ధరకే.. OLED డిస్ప్లే
-
హీరోయిన్ అంటే గ్లామర్ మాత్రమేనా?.. బాలీవుడ్ ట్రెండ్పై హుమా ఫైర్
ట్రెండింగ్
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!