Sad News : మానవత్వంలేని మనుషులు.. శవం దుర్వాసన వచ్చేదాక సోయిలేదా?
నేటి సమాజంలో కొన్ని సంఘటనలు చూస్తుంటే.. మనుషులు ఇంతగా దిగజారిపోయారా అనిపిస్తుంది. తమ ప్రాణాలకు ఇచ్చే విలువలో పక్కవారి ప్రాణాలపై ఒక శాతం కూడా ఉండదనే దానికి ఈ ఘటనే నిదర్శనం. యాక్సిడెంట్ జరిగి ఆసుపత్రిలో చేరిన వ్యక్తి మరణించి పదిరోజులైనా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. చివరికి మృతదేహాం నుంచి దుర్వాసన రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ హృదయవిదాకర ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా పోలీసులు, వైద్యాధికారుల నిర్లక్ష్యంతో సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో 13 రోజులుగా శవం కుళ్లిపోయింది. గత నెల 18న సుల్తాన్ పూర్ లో రోడ్డు ప్రమాదంలో శ్రీనివాస్ (28) అనే యువకుడు గాయపడ్డాడు. అయితే.. ఇది గమనించి సంగారెడ్డి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు స్థానికులు. అయితే.. హాస్పిటల్కి తరలించి పుల్కల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు, 108 సిబ్బంది. గత నెల 18 నుంచి 22 వరకు సంగారెడ్డి ప్రభుత్వాసుపత్రిలో ఆస్పత్రిలో చికిత్స అందించారు వైద్యులు.. అయితే.. చికిత్స పొందుతూ డిసెంబర్ 23న శ్రీనివాస్ మృతి చెందాడు.
Also Read : Elephant Video Viral : రోడ్డుపై బైక్ పెడతారా బుద్ధిలేదు.. తన్ని అవతలేసిన ఏనుగు
Also Read
- MI Vs LSG: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ పటాపంచల్..
- Vijay Anil Army: ‘అనిల్’ నుంచి అసెంబ్లీ వరకు.. విజయ్ రాజకీయ ప్రస్థానంలో ఆ ‘ఈల’ వేసిన మలుపులేంటి..?
- TPCC Mahesh Goud : కేరళలో యూడీఎఫ్ ఘనవిజయం.. తెలంగాణ మోడల్ పాలనే గెలిపించిందన్న మహేష్ గౌడ్.!
- Mamata Banerjee: మమతకు బిగ్ షాక్.. భవానీపూర్లో ఘోర పరాజయం
శ్రీనివాస్ చనిపోయిన వెంటనే సంగారెడ్డి టౌన్, పుల్కల్ పోలీసులకు సమాచారం ఇచ్చామంటున్నారు ఆసుపత్రి వైద్యులు. అప్పటి నుంచి ఈ రోజు వరకు మార్చురీలోనే శ్రీనివాస్ డెడ్ బాడీ ఉంది. ప్రతి రోజు సమాచారం ఇచ్చినా పోలీసులు రెస్పాన్డ్ కాలేదని వైద్యులు చెబుతున్నారు. ఈ రోజు డెడ్ బాడీ దుర్వాసన రావడంతో మరోసారి పుల్కల్ పోలీసులకు ఫోన్ చేశారు ఆస్పత్రి సిబ్బంది. అయితే.. దీంతో పోలీసులు ఆసుపత్రికి చేరుకొని.. శవాన్ని మార్చురీ నుంచి బయటికి తీస్తుండగా శ్రీనివాస్ జేబులో నుంచి ఆధార్ కార్డ్ బయటపడింది. ఆధార్ కార్డ్ ఆధారంగా శ్రీనివాస్ ది ఝారసంఘం మండలం కిష్టపూర్ గ్రామంగా గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. ఆస్పత్రికి హుటాహుటిన వచ్చిన బంధువులు.. పుల్కల్ పోలీసులు తమకు కనీస సమాచారం ఇవ్వలేదని ఆస్పత్రి ముందు బంధువుల ఆందోళన చేపట్టారు. డెడ్ బాడీ తీసుకెళ్లడానికి నిరాకరించిన బంధువులు.. తమకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. డెడ్ బాడీ తీసుకెళ్లకుండా ఇంటికి వెళ్లిపోయారు శ్రీనివాస్ బంధువులు. రేపు ఆసుపత్రి ముందు నిరసన తెలిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
MI Vs LSG: ఆకాశమే హద్దుగా చెలరేగిన రోహిత్ శర్మ.. ఆ రికార్డులన్నీ పటాపంచల్..
-
Telangana Cabinet : తెలంగాణ కేబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
Indigo: టేకాఫ్ తర్వాత షాక్.. ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.!
-
Vijay Anil Army: ‘అనిల్’ నుంచి అసెంబ్లీ వరకు.. విజయ్ రాజకీయ ప్రస్థానంలో ఆ ‘ఈల’ వేసిన మలుపులేంటి..?
-
TPCC Mahesh Goud : కేరళలో యూడీఎఫ్ ఘనవిజయం.. తెలంగాణ మోడల్ పాలనే గెలిపించిందన్న మహేష్ గౌడ్.!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!