NTV Telugu Site icon

Tragedy: గుజరాత్లో విషాదం.. నదిలో స్నానానికి దిగి ఏడుగురు గల్లంతు

Gujarath

Gujarath

గుజరాత్‌లో తీవ్ర విషాదం నెలకొంది. పోయిచా గ్రామాన్ని సందర్శించేందుకు వచ్చిన ఆ ఏడుగురిని మృత్యువు వెంటాడింది. మంగళవారం నర్మదా నదిలో ఆరుగురు బాలురుతో పాటు ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. కాగా.. అది చూసిన స్థానికులు భయంతో అరుపులు, కేకలు వేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్మదా నదిలో స్నానం చేసేందుకని అందులోకి దిగారని, అయితే లోతు ఎక్కువగా ఉన్నట్లు గమనించకపోవడంతో అందులో మునిగిపోయినట్లు చెబుతున్నారు. కాగా.. వారి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

Delhi: తీహార్ జైలుకు బాంబు బెదిరింపు.. పోలీసుల తనిఖీలు

ఈ ఘటన మధ్యాహ్నం 12 గంటల సమయంలో జరిగిందని పోలీసులు చెప్పారు. గల్లంతైన వారు 7 నుంచి 15 ఏళ్ల మధ్య వయసున్న ఆరుగురు బాలురు, 45 ఏళ్ల వ్యక్తి ఉన్నట్లు గుర్తించారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతోందని పోలీసులు చెబుతున్నారు. వారంతా.. సూరత్ నుంచి వచ్చారని, వారు మొత్తం 17 మందితో కూడిన బృందం ఇక్కడికి వచ్చిందన్నారు. ఆలయంలో పూజలు చేసిన అనంతరం నర్మదా నదిలో పుణ్యస్నానం చేసేందుకు పోయిచా గ్రామానికి వచ్చినట్లు తెలుపుతున్నారు.

Kerala: విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన అంబులెన్స్.. మంటలు చెలరేగి రోగి సజీవదహనం

కాగా.. వారి ఆచూకీ కనుగునేందుకు అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లతో గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. దాదాపు 3 గంటలు అవుతున్న వారి ఆచూకీ తెలియకపోవడంతో.. వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.