Mahesh Kumar Goud: ఓటు శాతం తక్కువగా వచ్చినా.. ఎన్డీయే సీట్లు గెలవడం వెనక ఆంతర్యం ఏంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahesh Kumar Goud: బీహార్లో దొడ్డి దారిన ఎన్డీయే కూటమి విజయం సాధించిందని టీపీసీసీ చీఫ్ మహేష్కుమార్ గౌడ్ ఆరోపించారు.. ఓట్ చోరీ నీ నిరసిస్తూ గాంధీ భవన్ ముందు యూత్ కాంగ్రెస్ నేతల ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్నికలు జరగాలన్నారు. యువజన కాంగ్రెస్ చేపట్టిన ఈ కార్యక్రమం ప్రజల్ని చైతన్య వంతం చేసే విధముగా ఉందని కొనియాడారు. ఓట్ చోరీపై ప్రజలను చైతన్యవంతం చేస్తూ రాహుల్ గాంధీ ఎనలేని పోరాటం చేస్తున్నారన్నారు. ఓటు విలువ తెలియక ఉండటం శోచనీయమన్నారు. బీహార్ ఎన్నికల్లో సామాన్యులకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయన్నారు. ఓటు శాతం తక్కువగా వచ్చి ఎన్డీయే సీట్లు గెలవడం వెనక ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. బీహార్లో ఓట్ చోరీతో ఎన్డీయే కూటమికి సీట్లు వచ్చాయని ఆరోపించారు. ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా బీహార్ లో ఎన్డీయే కూటమికి సీట్లు గెలుచుకుందన్నారు. దేశ భవిష్యత్ కి విఘాతం కలిగించే విధంగా ఓట్ చోరీ ఉందన్నారు.
READ MORE: INDIA Bloc: బీహార్ ఎఫెక్ట్.. తెరపైకి కొత్త డిమాండ్
Also Read
- Pakistan Cricket Board: పాక్ క్రికెటర్లకు పీసీబీ బంపర్ ఆఫర్.. జీతాలు, మ్యాచ్ ఫీజులు భారీగా పెంపు..
- Israel: అమెరికా-ఇరాన్ ఒప్పందంతో మాకు సంబంధం లేదు.. దక్షిణ లెబనాన్పై చర్యలు కొనసాగుతాయన్న ఇజ్రాయెల్
- Aqua Feed Price Reduction: ఆక్వా రైతులకు గుడ్ న్యూస్.. సీఎం జోక్యంతో తగ్గిన ఫీడ్ ధరలు
- YS Jagan: సాయికృష్ణ కుటుంబాన్ని ఓదార్చిన జగన్.. కృష్ణలంక ఘటనలపై సీరియస్.. సీబీఐ విచారణకు డిమాండ్..
ఓట్ శతం మహాఘాట్ బంధన్ కి ఎక్కువ వస్తే.. సీట్లు ఎన్డీయే కూటమికి సీట్లు పెరిగాయని మహేష్కుమార్ గౌడ్ అన్నారు.”సెక్యులర్ ఓట్లను తొలగించారు.. ఓట్ చోరీ తో రాజ్యాంగానికి తూట్లు.. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీరు తెన్నులు శోచనీయం.. BJYM లాగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పని చేస్తుంది. దేశం బాగుపడాలంటే ప్రజాస్వామ్య విలువలను కాపాడుకోవాల్సిన అవశ్యకత ఉంది.. అధికారం పరమావధిగా మోడీ అమిత్ షా ఓట్ చోరీకి పాల్పడుతున్నారు.. బీహార్ ఎన్డీయే కూటమి గెలుపు అప్రజాస్వామికం.. ఓట్ చోరీ గురించి 8 ఏళ్ల క్రితమే పోరాడాం.. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బీజేపీకి ఫ్రంట్ ఆర్గనైజర్ గా పనిచేస్తుంది.. రేపటి నుంచి తెలంగాణలో ఓట్ చోరీ సంతకాల సేకరణ ముమ్మరంగా జరుగుతుంది.. తెలంగాణలో సర్ పేరిట ఓట్లు తొలగించే ప్రమాదం పొంచి ఉంది..” అని టీపీసీసీ ఛీప్ వ్యాఖ్యానించారు.
READ MORE: MLA Wife Digital Arrest Scam: ఎమ్మెల్యే భార్య డిజిటల్ అరెస్ట్ కేసును ఛేదించిన పోలీసులు..
తాజావార్తలు
-
Pakistan Cricket Board: పాక్ క్రికెటర్లకు పీసీబీ బంపర్ ఆఫర్.. జీతాలు, మ్యాచ్ ఫీజులు భారీగా పెంపు..
-
Israel: అమెరికా-ఇరాన్ ఒప్పందంతో మాకు సంబంధం లేదు.. దక్షిణ లెబనాన్పై చర్యలు కొనసాగుతాయన్న ఇజ్రాయెల్
-
CM Revanth Reddy : ఎల్బీనగర్ నా సొంతూరు లాంటింది.. కబ్జాదారులు ఎంతటి వారైనా వదిలేదే లేదు
-
Aqua Feed Price Reduction: ఆక్వా రైతులకు గుడ్ న్యూస్.. సీఎం జోక్యంతో తగ్గిన ఫీడ్ ధరలు
-
CM Revanth Reddy : కబ్జాదారుల వీపులు సున్నం చేస్తాం.. హైడ్రా పేదల జోలికి వెళ్లదు
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..