INDIA Bloc: బీహార్ ఎఫెక్ట్.. తెరపైకి కొత్త డిమాండ్
- బీహార్ ఎఫెక్ట్
- తెరపైకి కొత్త డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి వైఫల్యంతో ఇండియా కూటమిలో కొత్త డిమాండ్ తెరపైకి వస్తోంది. అఖిలేష్ యాదవ్కు ఇండియా కూటమి బాధ్యతలు అప్పగించాలంటూ వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం పార్లమెంట్లో 37 మంది ఎంపీలతో లోక్సభలో రెండో అతిపెద్ద శక్తిగా ఉంది. ఈ నేపథ్యంలో అఖిలేష్ యాదవ్కు బాధ్యతలు అప్పగిస్తే కూటమి గాడిన పడుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అఖిలేష్ యాదవ్కు బాధ్యతలు అప్పగిస్తే ప్రతిపక్ష కూటమి గాడిన పడుతుందని సమాజ్వాదీ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే అన్నారు. ఇంకోవైపు మమతా బెనర్జీకి బాధ్యతలు అప్పగించాలంటూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: Sheikh Hasina: బంగ్లాదేశ్ కోర్టు సంచలన తీర్పు.. షేక్ హసీనాకు మరణశిక్ష
Also Read
- AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
- NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
లక్నో సెంట్రల్ ఎమ్మెల్యే రవిదాస్ మెహ్రోత్రా మాట్లాడుతూ.. ఎన్నికలు నిర్వహించడానికి బ్యాలెట్ పద్ధతిని ఉపయోగించినట్లయితే ఇండియా కూటమి బీహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉండేదని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్ని్కల్లో ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు అని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: IMD warning: ఐఎండీ వార్నింగ్.. ఈ రాష్ట్రాల్లో చలి తీవ్రంగా ఉంటుందని హెచ్చరిక
మహారాష్ట్ర, హర్యానా.. ఇలా వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ పేలవమైన ప్రదర్శన కనబరచడంతో కూటమిలో నాయకత్వం మార్పుపై డిమాండ్ పెరుగుతోంది. మహారాష్ట్ర, హర్యానాలో కాంగ్రెస్ విఫలమైందని.. కూటమి బాధ్యతలు మమతా బెనర్జీకి అప్పగిస్తే గాడిన పడుతుందని కళ్యాణ్ బెనర్జీ పేర్కొన్నారు.
ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆర్జేడీ ఘోర పరాజయం పాలైంది. ఆర్జేడీ 25, కాంగ్రెస్ 6 స్థానాల్లో గెలిచాయి. బీజేపీ 89, జేడీయూ 85, ఎల్జీపీ 19, ఎంఐఎం 5 సీట్లు సాధించాయి.
తాజావార్తలు
-
World War 3: తైవాన్ కోసం మూడో ప్రపంచ యుద్ధం? మరో వార్కు కౌంట్డౌన్ మొదలైందా?
-
Army Chief: ‘‘భూమిపై ఉంటారా.? చరిత్రలో కలుస్తారా.?’’ పాకిస్తాన్కు ఆర్మీ చీఫ్ వార్నింగ్..
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..