Aqua Feed Price Reduction: ఆక్వా రైతులకు గుడ్ న్యూస్.. సీఎం జోక్యంతో తగ్గిన ఫీడ్ ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aqua Feed Price Reduction: ఆంధ్రప్రదేశ్లో ఆక్వా రైతులకు ప్రభుత్వం కీలక ఊరట కల్పించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో ఆక్వా ఫీడ్ ధరను కేజీకి రూ.4 మేర తగ్గించేందుకు ఫీడ్ తయారీ సంస్థలు అంగీకరించాయి. దీంతో ప్రస్తుతం కేజీకి రూ.112గా ఉన్న ఫీడ్ ధర రూ.108కు తగ్గనుంది. ఆక్వా రైతులు, ఫీడ్ తయారీ సంస్థల ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆక్వా రంగంలో పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాల నేపథ్యంలో రైతులకు ఉపశమనం కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఇక, ఈ సమావేశంలో పాల్గొన్న ఆక్వా రైతులు ప్రభుత్వ చొరవపై హర్షం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని పేర్కొన్నారు. ఫీడ్ ధర తగ్గింపు నిర్ణయం రైతులకు ఎంతో ఊరటనిస్తుందని తెలిపారు. ధరల స్థిరీకరణ కోసం ఆక్వా రైతులు, ఫీడ్ తయారీదారులు, సంబంధిత అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ కమిటీ 20 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని సూచించారు. ఆ నివేదిక ఆధారంగా భవిష్యత్తులో ధరలపై తుది నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
Also Read
- Deputy CM Pawan Kalyan: గురువాయూరప్ప సన్నిధిలో ఏపీ డిప్యూటీ సీఎం.. ప్రత్యేక పూజలు చేసిన పవన్..
- AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
- AP Government: వడ్డెర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్.. 16 జిల్లాల్లో 32 చోట్ల క్వారీ భూములు.. 50% రాయితీ
- CM Chandrababu: Gen Zపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు..
ఈ సందర్భంగా ఆక్వా సాగుకు యూనిట్ విద్యుత్ను రూ.1.50కే అందిస్తున్నందుకు రైతులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. గోదావరి జిల్లాలకు మాత్రమే పరిమితమైన ఆక్వా సాగును శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు విస్తరించేలా చేసిన ఘనత చంద్రబాబుదేనని రైతులు అభిప్రాయపడ్డారు. ఇక, గత ప్రభుత్వ హయాంలో ఫీడ్ ధరలు ఆరు సార్లు పెరిగినా, ధరల నియంత్రణపై చర్యలు తీసుకోలేదని రైతులు పేర్కొన్నారు. 2019లో కేజీ ఫీడ్ ధర రూ.87.80 ఉండగా, గత ప్రభుత్వ పాలన ముగిసే సమయానికి అది రూ.107.80కు చేరిందని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే రూ.5.80 తగ్గించిందని, తాజాగా మరో రూ.4 తగ్గించడం రైతులకు మరింత లాభదాయకమని చెప్పారు.
రైతులు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకుని అధిక లాభాలు పొందేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. లక్షలాది మంది జీవనాధారంగా ఉన్న ఆక్వా రంగాన్ని పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు, ఉన్నతాధికారులు, ఆక్వా రైతు సంఘాల ప్రతినిధులు, ఫీడ్ తయారీ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. రైతుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
గత ప్రభుత్వ హయాంలో ఫీడ్ ధరలు ఆరు సార్లు పెంచారని, అయినా ఆనాటి ప్రభుత్వం ఫీడ్ ధర తగ్గింపుపై చొరవ తీసుకోలేదని ఆక్వా రైతులు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడుకు తెలిపారు. 2019లో కేజీ ఫీడ్ ధర రూ.87.80 ఉంటే గత ప్రభుత్వం దిగిపోయేనాటికి రూ.107.80కి చేరిందని రైతులు వివరించారు.… pic.twitter.com/4oPGQhmGZg
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) June 18, 2026
తాజావార్తలు
-
Best Investment Scheme: పథకం చిన్నదే.. కానీ కోటీశ్వరులను చేస్తుంది.. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు..
-
Vijay – Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
-
Dinesh Karthik: టెస్టు క్రికెట్ను పాకిస్థాన్ మర్చిపోవడం మంచిది.. ఘోరమైన స్థితిలో పాక్ జట్టు..
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Ravi Shastri: పుతిన్, మోడీ, జిన్పింగ్.. బ్రిక్స్పై రవిశాస్త్రి సంచలన పోస్ట్..
ట్రెండింగ్
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!