Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Top Headlines 1pm 12 11 2023

Top Headlines @1PM : టాప్ న్యూస్

Published Date :November 12, 2023 , 1:00 pm
By Gogikar Sai Krishna
Top Headlines @1PM : టాప్ న్యూస్
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రగతి పథాన్ని అడ్డుకునే ‘దుష్టశక్తుల’ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆదివారం దీపావళి పండుగను పురస్కరించుకుని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయోత్సవానికి గుర్తుగా జరిగే పండుగకు హిందూ సంస్కృతిలో ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు. చీకటిని పారద్రోలి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుంది. వెలుగుల పండుగ అజ్ఞానాన్ని పోగొడుతుందని, చైతన్యాన్ని రగిలించడంతోపాటు నూతనోత్తేజంతో ముందడుగు వేసేలా స్ఫూర్తినిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. మనలో అంతర్గత జ్వాల రగిలినప్పుడు జీవితాలు మరింత అర్థమవుతాయి. ప్రగతి పథాన్ని అడ్డుకునే ‘దుష్టశక్తుల’ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా భద్రతా నియమాలను పాటిస్తూ పటాకులు పేల్చి పండుగను ఉత్సాహంగా జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలకు లక్ష్మీదేవి సకల సౌభాగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు.

నోటాకు ఓటు వేయాలనే నినాదంతో ప్రజల్లోకి వెళతా..!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా దృష్టి సారించిన ప్రజాశాంతి పార్టీ, జనసేన పార్టీలకు ఎన్నికల సంఘం నుంచి చిక్కులు ఎదురయ్యాయి. తెలంగాణలో జనసేన పార్టీకి గుర్తింపు లేనందున ఆ పార్టీకి కంచె ఎన్నికల గుర్తు రిజర్వ్ కాలేదు. ఉచిత చిహ్నాల జాబితాకు గాజు చిహ్నం రిజర్వ్ చేయలేదు. దీంతో పాటు జనసేన అభ్యర్థులందరికీ గాజుల మార్కు వస్తుందన్న గ్యారెంటీ లేదు. దీంతో పాటు వీరంతా స్వతంత్ర అభ్యర్థులుగా ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ప్రజాశాంతి పార్టీ పరిస్థితి మరీ దారుణం. దీంతో ప్రజాశాంతి పార్టీ క్రియాశీలకంగా లేదని ఎన్నికల సంఘం తెలిపింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ లేని ఫలితమే.

తిరుపతిలో చెడ్డి గ్యాంగ్ హల్ చల్

తిరుపతిలో చెడ్డి గ్యాంగ్ హల్ చల్ చేస్తోంది. మొన్న రాత్రి మారూతి షో రూంలో నిన్న రాత్రి శ్రీవారి విల్లాస్ లో చోరికి యత్నించారు. చెర్లోపల్లి వద్ద వున్న శ్రీవారి విల్లాస్ నెంబర్ 31లో చెడ్డి గ్యాంగ్ చోరికి పాల్పడ్డారు. ఊరి శివార్లో వున్న ఇళ్లను చెడ్డి గ్యాంగ్ టార్గేట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉదయం వేళలో రెక్కి నిర్వహించి రాత్రి సమయాలలో చోరి ఆపరేట్ చేస్తున్నాయి చెడ్డిగ్యాంగ్. రెండు సందర్భాలలోను ఎవ్వరు లేని సమయంలోనే చోరికి ప్రయత్నించింది చెడ్డిగ్యాంగ్‌.

రోడ్డుపై వెళుతున్న కారును ఢీకొట్టిన విమానం.. వీడియో వైరల్!

అగ్ర రాజ్యం అమెరికాలో ఊహించని ఘటన ఒకటి చోటుచేసుకుంది. రోడ్డుపై ప్రయాణిస్తున్న కారును ఓ విమానం ఢీకొట్టింది. ఈ ఘటన టెక్సాస్‌ రాష్ట్రంలోని మెక్‌కిన్నేలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకొంది. ఈ ప్రమాదంలో ఒకరికి స్వల్ప గాయాలు కాగా.. అతడిని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో ఇద్దరు విమానంలో ఉండగా.. ఒకరు కారులో ఉన్నారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

శనివారం మధ్యాహ్నం 12:30 గంటల ప్రాంతంలో ఏరో కౌంటీ ఎయిర్‌పోర్టులో ఓ సింగిల్-ఇంజిన్ లాంకైర్ Iv-P ప్రాప్‌జెట్‌ విమానం రన్‌వే పై నుంచి టేకాఫ్‌ అయ్యింది. అయితే దానిని పైలట్‌ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చింది. విమానం రన్‌వేపై చివరి వరకు వచ్చినా.. ఆగలేదు. బుల్లి విమానం ఎయిర్‌పోర్టు కంచెను దాటుకొని ఈస్ట్‌బౌండ్ వర్జీనియా పార్క్‌వేపై వెళుతున్న కారును ఒక్కసారిగా ఢీకొట్టింది. వెంటనే సహాయక బృందాలు అక్కడికి చేరుకొని.. పైలట్‌, కారు డ్రైవర్‌ను రక్షించాయి.

బీఆర్ఎస్ లోకి పాల్వాయి స్రవంతి.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన కేటీఆర్

దివంగత రాజ్యసభ సభ్యుడు పాలవాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె పాలవాయి స్రవంతి భారత్ పార్టీలో చేరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆమెకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రవంతి మాట్లాడుతూ. ఆలోచించే బీఆర్‌ఎస్‌ లో చేరా.. గౌరవం లేని చోట ఉండాల్సిన అవసరం లేదు. పార్టీలో ముందు నుంచి వచ్చిన నేతలను వదిలేసి ఇతరులకు అవకాశం కల్పిస్తున్నారు. నేను పదవుల కోసం బీఆర్‌ఎస్‌లో చేరలేదు. బీఆర్‌ఎస్‌ తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని శ్రవంతి అన్నారు. ఇవాళ కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన స్రవంతి ఈరోజు తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ దుపట్టా ధరించారు. బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత శ్రవంతి మాట్లాడుతూ.. గౌరవం లేని చోట బతకాల్సిన అవసరం లేదని తన తండ్రి ముందే చెప్పారన్నారు. తనను గౌరవించని కాంగ్రెస్‌లో ఉండాల్సిన అవసరం లేదని, అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చానని అన్నారు. తన అనుచరులు, కార్యకర్తల భవిష్యత్తు కేటీఆర్ చేతుల్లోనే ఉందని.. వారి భవిష్యత్తు కోసం పాటుపడాలని కోరారు.

అవసరం అయితే కాళ్ళు పట్టుకుని ఓట్లు అడగాలి..!

గువ్వల బాలరాజు పై దాడి జరిగినట్టు తెలిసిందని, దాడులు సరికావని, మొన్న ప్రభాకర్ రెడ్డి పై కత్తితో దాడి… ఇప్పుడు బాలరాజు పై రాళ్ళ దాడి చేశారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ప్రజలను మెప్పించాలి.. అవసరం అయితే కాళ్ళు పట్టుకుని ఓట్లు అడగాలన్నారు. మునుగోడులో రాజ్ గోపాల్ రెడ్డికి బుద్ధి చెప్పాలన్నారు. కోట్ల రూపాయలు పెట్టీ మునుగోడు ప్రజలను కొనవచ్చు అని రాజ్ గోపాల్ రెడ్డి అనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల నుంచి చాలా కుట్రలు రాబోతున్నాయని అన్నారు. కాళేశ్వరం పనైపోయిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గువ్వల బాలరాజుపై దాడిని ఖండిస్తున్నామని అన్నారు. మొన్న కొత్త ప్రభాకర్‌ రెడ్డిపై కత్తితో దాడి చేశారు. ఎన్నికల్లో గెలవాలంటే ప్రజలను మెప్పించాలి కానీ.. కత్తిపోట్లు, రాళ్ల దాడులు మంచిది కాదన్నారు. మునుగోడు విచిత్రమైన పరిస్థితి చూసామన్నారు. కోమటి రెడ్డి రాజ్ గోపాల్ ఎందుకు ఉప ఎన్నిక తెచ్చాడు అనేది ఆయనకే తెలవాలని అన్నారు.

ఆ.. ప్రకటనలు ప్రసారం చేయవద్దు.. టీవీఛానెళ్లకు ఎన్నికల సంఘం లెటర్..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతూ ప్రజలను ఓట్లు అడుగుతున్నారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి…ప్రకటనలే ముఖ్యం. అన్ని రాజకీయ పార్టీలు కూడా ప్రధాన వార్తాపత్రికలు, టీవీ ఛానెల్‌ల ద్వారా ఎన్నికల ప్రచార ప్రకటనలు ఇస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ ఎన్నికల ప్రచారం జరుగుతోంది. ప్రతిపక్షంలో ఉన్నవారే ప్రభుత్వ వైఫల్యాలను వీడియోలు తీసి ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నవారు తమ సంక్షేమ కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నారు. ఇలాంటి ప్రచారం నిర్వహించడం ద్వారా తమ భావాలను ప్రజలకు సులభంగా చేరవేయవచ్చని పార్టీలు భావిస్తున్నాయి. అయితే ఈ ప్రచార ప్రకటనలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఆదేశాలు జారీ చేసింది. అన్ని రకాల రాజకీయ ప్రకటనలపై నిషేధం విధిస్తూ సీఎం ఆదేశించారు. ఈ మేరకు అన్ని ఛానళ్లు, సోషల్ మీడియా ఛానళ్లకు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి లేఖ రాశారు.

ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అదరగొడుతున్నాడు. ముందుగా బ్యాటింగ్ చేసినా.. ఛేజింగ్ చేసినా ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ పరుగుల వరద పారిస్తున్నాడు. ఇప్పటివరకు 8 మ్యాచులు ఆడిన కోహ్లీ 543 రన్స్ చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. ఇప్పటికే ఎన్నో రికార్డ్స్ తన ఖాతాలో వేసుకున్న కోహ్లీ.. ఈరోజు నెదర్లాండ్స్ మ్యాచ్ నేపథ్యంలో వన్డే క్రికెట్ చరిత్రలోనే అతి పెద్ద రికార్డుపై కన్నేశాడు. అదే వన్డేల్లో 50వ సెంచరీ.

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏకం కావాలని కోరుకున్నా.. శ్రీవారి సేవలో రేవంత్ రెడ్డి

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏకం కావాలని స్వామిని కోరుకున్నట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామివారి ప్రసాదం సెలవు సందర్భంగా రేవంత్ తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని స్వామి కోరుకున్నానని అన్నారు. ఆంధ్ర, తెలంగాణ మధ్య మానవ సంబంధాలు, ఆర్థిక, రాజకీయ సంబంధాలు బాగుండాలని తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలు శాశ్వతంగా పరిష్కారం కావాలని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఏకం కావాలని స్వామిని కోరుకున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయన్నారు.

సాగునీటి ప్రాజెక్టుల అవినీతికి కేసీఆర్ కుటుంబమే కారణమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై ఈరోజు సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అవినీతి ఫలితమే మేడిగడ్డ ప్రాజెక్టు అని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలోనే ధర్మపురి ప్రాంతం సంపద పొంది అభివృద్ధి చెందిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తెలిపారు. ఆరు హామీలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో మార్పు రావాలంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • big news
  • KA Paul
  • revanth reddy
  • telugu news
  • Top News

తాజావార్తలు

  • Sanju Samson: “జట్టులో చోటు లేనప్పుడు కుంగిపోయా.. కానీ”.. విక్టరీ వెనకున్న కన్నీళ్లను పంచుకున్న సంజూ శామ్సన్..

  • RaashiiKhanna : ‘తెలుసుకదా’ సినిమా ప్లాప్ అవుతుందని ముందే తెలుసు.. కానీ నా మాట ఎవరు వినలేదు

  • Drugs Party: మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌ రెడ్డి ఫామ్‌ హౌస్‌లో డ్రగ్స్‌ పార్టీ.. ఈ ఐదుగురికి డ్రగ్ టెస్ట్ పాజిటివ్

  • OTT Movies : ఈ వీకెండ్ డిజిటల్ తెరపై సినీ జాతర

  • Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఊహించని ప్రయోజనాలు!

ట్రెండింగ్‌

  • No Need Oven : ఓవెన్ లేకుండానే.. కుక్కర్‌లోనే హెల్తీ ఎగ్ లెస్ డ్రై ఫ్రూట్ కేక్..!

  • Gongura Pickle Recipe: ఏడాది పాటు నిల్వ ఉండే ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి.. అన్నంలో నెయ్యితో కలుపుకొని తింటే..

  • Suzuki Burgman Street EXకి స్టైలిష్ అప్డేట్.. కొత్త లుక్ తో భారత మార్కెట్‌లోకి ఎంట్రీ..!

  • 7.55mm స్లిమ్ డిజైన్‌, 120Hz AMOLED డిస్‌ప్లే, 50MP కెమెరాతో రూ.12,999కే Lava Bold 2 5G లాంచ్..!

  • Michael Vaughan: వరల్డ్‌ కప్‌లో తెలివి తక్కువ టీమ్ దక్షిణాఫ్రికానే.. మైకేల్ వాన్ సంచలన వ్యాఖ్యలు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions