Elections: రేపు మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రేపు మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఇక్కడి పార్టీల భవిష్యత్తును ఓటర్లు తేల్చనున్నారు. ఎవరు గెలుస్తారన్న సర్వేలు చెప్పిన.. ఓటర్లు మాత్రం ఎవ్వరి వైపు మొగ్గుచూపుతారు అనేది తెలియాల్సి ఉంది. రెండు రాష్ట్రాల్లోనూ పలు పార్టీలు ఎన్నికల పోటీలో ఉన్నప్పటికీ ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్ ల మధ్యనే తీవ్రమైన పోటీ కొనసాగుతుంది. మధ్యప్రదేశ్ లో బీఎస్పీ, సమాజ్ వాద్ పార్టీ, కమ్యూనిస్టులు కూడా బరిలో నిలిచారు.
Read Also: Kajol Deep Fake Video: వైరల్ అవుతున్న హీరోయిన్ కాజోల్ న్యూడ్ వీడియో
Also Read
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
ఇక, మధ్యప్రదేశ్ లో 5.6 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో 22.36 మంది తొలిసారి తమ ఓటు హక్కును వేయనున్నారు. ఇక్కడ మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ పార్టీనే అని దాదాపు ఎన్నికల సర్వేలు వెల్లడించాయి. 20 ఏళ్ళుగా మధ్యప్రదేశ్ లో బీజేపీ అధికారంలో ఉంది. అయితే ప్రస్తుతం బీజేపీపై ప్రజల్లో తీవ్రమైన వ్యతిరికేత ఉన్నట్టు సమాచారం. దానికి తోడు గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చి హస్తం పార్టీ ఎమ్మెల్యేల్ని లాక్కోవడంతో కాషాయ పార్టీకి ప్రతికూలంగా మారింది. ఇక, ఈసారి ఎలాగైనా గెలిచేందుకు బీజేపీ గట్టి పట్టుదలతో కనబడుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఓట్లను నమ్ముకుని ఎన్నికల బరిలోకి దిగుతోంది. అయితే, ఎస్సీ, ఎస్టీలు ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉంటున్నారు. కులాల సర్వే హామీతో ఓబీసీ ఓట్లు తమకు పడతాయని కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది.
Read Also: Bryan Johnson: వామ్మో.. కొడుకు బ్లడ్ ఎక్కించుకుంటే తండ్రి వయసు తగ్గిందా..?
మరో వైపు, ఛత్తీస్ ఘడ్ లో ఇప్పుడు రెండో విడత ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. నవంబర్ 7న తొలి విడతగా 20 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఇప్పుడు మరో 70 అసెంబ్లీ స్థానాలకు రేపు పోలింగ్ జరగబోతుంది. రెండో విడతలో మొత్తం 958 అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 1.63 కోట్ల ఓటర్లు రేపు (శుక్రవారం) వీరి భవితవ్యం తేల్చనున్నారు. ఇక, మరోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. కానీ బీజేపీ మాత్రం అధికార పార్టీపై అవినీతి ఆరోపణలు చేస్తుంది. అయితే ఛత్తీస్ ఘడ్ లో రాహుల్ గాంధీ, సీఎం భూపేశ్ బఘేల్, ప్రియాంక గాంధీలు సైతం పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. బీజేపీ పార్టీ తరపున అమిత్ షా, జేపీ నడ్డా, హిమంత బిశ్వశర్మ, అనురాగ్ ఠాకూర్తో పాటు ఇతర నేతలు ప్రచారం చేశారు.
తాజావార్తలు
-
Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
-
Nana Patekar Slap Incident : నానాపటేకర్ గారు నన్ను చెంపదెబ్బ కొట్టింది నిజమే.! ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్
-
MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
-
NBK 112 : బాలయ్య సినిమాలో విలన్ గా యాంగ్రీ యంగ్ సీనియర్ హీరో?
-
Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!