Today Stock Market Roundup 11-04-23: మూడేళ్లలో 900 శాతం పెరిగిన షేర్ విలువ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today Stock Market Roundup 11-04-23: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారంలో వరుసగా రెండో రోజు లాభాలతో ప్రారంభమై లాభాలతో ముగిసింది. మొత్తమ్మీద వరుసగా ఏడో రోజు లాభాలను సొంతం చేసుకుంది. ఇవాళ మంగళవారం ఉదయం నుంచే ఈక్విటీ మార్కెట్లో జోష్ కనిపించింది.
read more: World Worst Currency no-3: ప్రపంచంలోనే 3వ అతి చెత్త కరెన్సీగా రూబుల్
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
అంతర్జాతీయ మార్కెట్ నుంచి అనుకూల సంకేతాలు వెలువడటంతో ఎర్లీ ట్రేడింగ్లోనే సెన్సెక్స్ 60 వేల బెంచ్మార్క్ని దాటింది. ఇంట్రాడేలో కూడా ఇలాంటి సానుకూల వాతావరణమే కనిపించటంతో సాయంత్రం వరకు ఇన్వెస్టర్లలో ఉత్సాహం కొనసాగింది. సంస్థల క్యూ4 ఫలితాలు వెలువడే తరుణంలో షేర్ బిజినెస్ జోరుగా సాగుతోంది.
సెన్సెక్స్ 311 పాయింట్లు లాభపడి 60 వేల 157 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 98 పాయింట్లు పెరిగి 17 వేల 722 పాయింట్ల వద్ద ఎండ్ అయింది. సెన్సెక్స్లోని మొత్తం 30 కంపెనీల్లో 20 కంపెనీలు మంచి పనితీరు కనబరచగా మిగతా పది కంపెనీలు నేలచూపులు చూశాయి.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో ఐటీసీ, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతీ సుజుకీ, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ ట్విన్స్, రిలయెన్స్ ఇండస్ట్రీస్ బాగా రాణించాయి. బీఎస్ఈలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, విప్రో, టెక్ మహింద్రా వెనకబడ్డాయి.
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో కొటక్ బ్యాంక్ నాలుగున్నర శాతానికి పైగా.. జేఎస్డబ్ల్యూ నాలుగు శాతం.. లాభపడగా.. టీసీఎస్ మరియు ఇన్ఫోసిస్ 2 శాతం దాక పడిపోయాయి. వ్యక్తిగత స్టాక్స్ విషయానికొస్తే.. వర్ధమాన్ స్పెషల్ స్టీల్స్.. వీఎస్ఎస్ఎల్ షేర్ వ్యాల్యూ మూడేళ్లలో ఏకంగా 900 శాతం పెరిగింది.
10 గ్రాముల బంగారం ధర 456 రూపాయలు పెరిగింది. గరిష్టంగా 60 వేల 519 రూపాయలుగా ట్రేడ్ అయింది. కేజీ వెండి రేటు 649 రూపాయలు పెరిగింది. అత్యధికంగా 74 వేల 972 రూపాయలు పలికింది. క్రూడాయిల్ ధర నామమాత్రంగా 16 రూపాయలు పెరిగింది. ఒక బ్యారెల్ ముడి చమురు 6 వేల 584 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 13 పైసలు బలహీనపడింది. డాలరుతో పోల్చితే 82 రూపాయల 14 పైసల వద్ద స్థిరపడింది.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!