Today Stock Market Roundup 11-04-23: మూడేళ్లలో 900 శాతం పెరిగిన షేర్ విలువ
Today Stock Market Roundup 11-04-23: దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారంలో వరుసగా రెండో రోజు లాభాలతో ప్రారంభమై లాభాలతో ముగిసింది. మొత్తమ్మీద వరుసగా ఏడో రోజు లాభాలను సొంతం చేసుకుంది. ఇవాళ మంగళవారం ఉదయం నుంచే ఈక్విటీ మార్కెట్లో జోష్ కనిపించింది.
read more: World Worst Currency no-3: ప్రపంచంలోనే 3వ అతి చెత్త కరెన్సీగా రూబుల్
Also Read
- UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
- PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol Bunks Rush: పెట్రోల్ బంకుల వద్ద రద్దీకి అసలు కారణాలు ఇవే..!
అంతర్జాతీయ మార్కెట్ నుంచి అనుకూల సంకేతాలు వెలువడటంతో ఎర్లీ ట్రేడింగ్లోనే సెన్సెక్స్ 60 వేల బెంచ్మార్క్ని దాటింది. ఇంట్రాడేలో కూడా ఇలాంటి సానుకూల వాతావరణమే కనిపించటంతో సాయంత్రం వరకు ఇన్వెస్టర్లలో ఉత్సాహం కొనసాగింది. సంస్థల క్యూ4 ఫలితాలు వెలువడే తరుణంలో షేర్ బిజినెస్ జోరుగా సాగుతోంది.
సెన్సెక్స్ 311 పాయింట్లు లాభపడి 60 వేల 157 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ 98 పాయింట్లు పెరిగి 17 వేల 722 పాయింట్ల వద్ద ఎండ్ అయింది. సెన్సెక్స్లోని మొత్తం 30 కంపెనీల్లో 20 కంపెనీలు మంచి పనితీరు కనబరచగా మిగతా పది కంపెనీలు నేలచూపులు చూశాయి.
బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లో ఐటీసీ, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతీ సుజుకీ, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ ట్విన్స్, రిలయెన్స్ ఇండస్ట్రీస్ బాగా రాణించాయి. బీఎస్ఈలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, విప్రో, టెక్ మహింద్రా వెనకబడ్డాయి.
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో కొటక్ బ్యాంక్ నాలుగున్నర శాతానికి పైగా.. జేఎస్డబ్ల్యూ నాలుగు శాతం.. లాభపడగా.. టీసీఎస్ మరియు ఇన్ఫోసిస్ 2 శాతం దాక పడిపోయాయి. వ్యక్తిగత స్టాక్స్ విషయానికొస్తే.. వర్ధమాన్ స్పెషల్ స్టీల్స్.. వీఎస్ఎస్ఎల్ షేర్ వ్యాల్యూ మూడేళ్లలో ఏకంగా 900 శాతం పెరిగింది.
10 గ్రాముల బంగారం ధర 456 రూపాయలు పెరిగింది. గరిష్టంగా 60 వేల 519 రూపాయలుగా ట్రేడ్ అయింది. కేజీ వెండి రేటు 649 రూపాయలు పెరిగింది. అత్యధికంగా 74 వేల 972 రూపాయలు పలికింది. క్రూడాయిల్ ధర నామమాత్రంగా 16 రూపాయలు పెరిగింది. ఒక బ్యారెల్ ముడి చమురు 6 వేల 584 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ 13 పైసలు బలహీనపడింది. డాలరుతో పోల్చితే 82 రూపాయల 14 పైసల వద్ద స్థిరపడింది.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో