Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Business News Today Business Headlines 27 04 23 Reliance Mukesh Ambani Gifts A Multi Story House Worth Rs 1500 Crore To Close Friend Manoj Modi

Today Business Headlines 27-04-23: అదిరిపోయే కానుక.. అంబానీనా మజాకా. మరిన్ని వార్తలు.

Published Date :April 27, 2023 , 12:01 pm
By Akkirala Kondala Rao
Today Business Headlines 27-04-23: అదిరిపోయే కానుక.. అంబానీనా మజాకా. మరిన్ని వార్తలు.
  • Follow Us :
  • google news
  • dailyhunt

Today Business Headlines 27-04-23:

అత్యధిక.. పేటెంట్లు

గత ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో పేటెంట్ ఫైలింగ్స్ సంఖ్య 13 పాయింట్ 6 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. ఇది గడచిన పదేళ్లలో అత్యధికం కావటం విశేషం. ఈ విషయాన్ని నాస్‌కామ్ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. డొమెస్టిక్ పేటెంట్ ఫైలింగ్స్ వాటా 41 శాతం నుంచి 44 శాతానికి పెరిగినట్లు పేర్కొంది. మరీ ముఖ్యంగా.. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్ డేటా, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చెయిన్ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీలకు సంబంధించిన పేటెంట్ల సంఖ్య బాగా పెరిగిందని నాస్‌కామ్ తెలిపింది.

ఆధార్ లావాదేవీలు

ఆధార్ నంబర్ల ఆధారంగా.. అంటే.. ఇ-కేవైసీని బేస్ చేసుకొని నిర్వహించిన లావాదేవీల సంఖ్య మార్చి నెలలో 2 పాయింట్ మూడు ఒకటి బిలియన్‌లుగా నమోదైంది. ఫిబ్రవరిలో జరిగిన ట్రాన్సాక్షన్ల కన్నా మార్చిలో 16 శాతం ఎక్కువ ట్రాన్సాక్షన్లు జరిగాయి. దేశంలో డిజిటల్ ఎకానమీ డెవలప్ అవుతోందనటానికి దీన్నొక ఉదాహరణగా చెప్పుకోవచ్చని అంటున్నారు. ఈ లావాదేవీల్లో ఎక్కువ శాతం బయోమెట్రిక్ ఫింగర్‌ప్రింట్‌ తీసుకోవటం ద్వారా నిర్వహించారు. ఆ తర్వాతి స్థానాల్లో డెమోగ్రఫిక్ మరియు ఓటీపీ ఆథెంటికేషన్లు నిలిచాయి.

మోడీకి ముఖేష్ గిఫ్ట్

రిలయెన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ.. తనకు రైట్ హ్యాండ్ లాగా ఉండే మనోజ్ మోడీకి భారీ కానుక ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ గిఫ్ట్ విలువ ఏకంగా 1500 కోట్ల రూపాయలని చెబుతున్నారు. ముంబైలోని నేపియన్ సీ రోడ్‌ ఏరియాలో బృందావన్ పేరుతో ఉన్న 22 అంతస్తుల భవనాన్ని బహుమతి కింద ఇచ్చినట్లు తెలుస్తోంది. ఫేస్‌బుక్‌తోపాటు మరికొన్ని సంస్థలతో రిలయెన్స్ పెద్ద పెద్ద ఒప్పందాలు కుదుర్చుకోవటంలో మనోజ్ మోడీ కీలక పాత్ర పోషించారని, అందుకే ముఖేష్ అంబానీ ఈ రేంజ్‌లో గుడ్‌విల్ ఇచ్చారని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

‘పీఎల్ఐ’కి పేమెంట్లు

ప్రొడక్షన్ లింక్డ్ ఇన్‌సెంటివ్.. పీఎల్ఐ పథకం లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం మార్చి నెల వరకు 2 వేల 874 కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఎలక్ట్రానిక్స్, టెలికం, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి 8 సెక్టార్లలోని సంస్థలకు ఈ ప్రయోజనం కలిగినట్లు తెలిపింది. 3 వేల 420 కోట్ల రూపాయలకు కంపెనీల నుంచి క్లెయిమ్‌లు అందాయని వెల్లడించింది. దేశంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించటం ద్వారా ఎక్స్‌పోర్ట్‌లను పెంచటం కోసం పీఎల్ఐ పథకాన్ని 2020వ సంవత్సరంలో ప్రారంభించిన సంగతి తెలిసిందే.

2 తెలుగు రాష్ట్రాల్లోకి

గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసులను అందించే వి-ట్రాన్స్ ఇండియా సంస్థ సౌతిండియాలో విస్తరించాలని చూస్తోంది. తద్వారా.. ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో వచ్చే ఒకటీ రెండేళ్లలో 600 మందికి ఉద్యోగాలు ఇవ్వనుంది. వివిధ సంస్థలతో బిజినెస్ పార్ట్నర్‌షిప్‌లను ఏర్పరచుకోనున్నట్లు తెలిపింది. 2026 నాటికి 3 వేల కోట్ల రూపాయల టర్నోవర్ సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు సంస్థ సీఎండీ మహేంద్ర షా పేర్కొన్నారు. వి-ట్రాన్స్ ఇండియాకి ప్రస్తుతం 2 వేల 500లకు పైగా వాహనాలు, 3 వేల 300 మంది ఉద్యోగులు ఉన్నట్లు వెల్లడించారు.

డివిడెండ్.. 1800%..

మారుతీ సుజుకీ ఇండియా మార్చి క్వార్టర్‌లో అద్భుతమైన ఫలితాలను సాధించింది. 42 శాతం ఎక్కువ లాభాలను ఆర్జించింది. కంపెనీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా 1800 శాతం డివిడెండ్ ప్రకటించింది. 5 రూపాయల ఫేస్ వ్యాల్యూ కలిగిన ఒక్కో షేర్‌కి 90 రూపాయల డివిడెండ్ ఇచ్చింది. విదేశీ మారకపు సానుకూలతలు లాభాలు పెరగటానికి దోహదపడ్డాయని వెల్లడించింది. ప్రతి సంవత్సరం మరో 10 లక్షల కార్ల తయారీ కోసం కొత్త ప్లాంట్ నిర్మాణానికి ప్రతిపాదన కూడా చేసింది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • aadhar transactions
  • dividend
  • Manoj Modi
  • maruti suzuki
  • Mukesh Ambani gift

తాజావార్తలు

  • Israel – Iran War Live Updates : దుబాయి, బహ్రెయిన్‌లో మళ్లీ డ్రోన్లతో ఇరాన్‌ దాడులు. జుఫైర్‌పై డ్రోన్‌లతో విరుచుకుపడుతున్న ఇరాన్‌.

  • Israel-Iran War: “యూఎస్ఎస్ అబ్రహం లింకన్‌”పై ఇరాన్ మిస్సైల్ అటాక్..

  • Rakasa Teaser Talk: నవ్విస్తూనే భయపెడుతున్న సంగీత్ శోభన్.. రిలీజ్ డేట్ ఫిక్స్.!

  • Iran: ‘‘ఇది ముస్లింలపై యుద్ధం’’.. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్..

  • Ind vs WI: టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్న సూర్య.. రింకూకు నో ఛాన్స్.. వెస్టిండీస్ జట్టులో కీలక మార్పు!

  • Breaking News: మోడీ అధ్యక్షతన అత్యున్నత CCS సమావేశం..

ట్రెండింగ్‌

  • Virendra Sehwag-MS Dhoni: ఎంఎస్ ధోనీ అదృష్టంతో జన్మించాడు.. సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

  • IND vs WI Super 8: ఈడెన్‌ గార్డెన్స్‌లో ‘కింగ్’.. అయినా భారత్‌ను వెంటాడుతున్న ఆ సమస్య!

  • Korralu Upma Benefits : కొర్రల ఉప్మా.. షుగర్ ఉన్నవారికి ఒక వరం.. నరాల బలహీనతకు చెక్..

  • Chaganti Koteswara Rao: “ఇంతకంటే అడుక్కు తినడం మంచిది”.. అలాంటి యూట్యూబర్స్‌పై చాగంటి ఫైర్..

  • 100W ఫాస్ట్ ఛార్జింగ్, IP68/IP69 రేటింగ్ తో Huawei Mate 80 Pro గ్లోబల్ లాంచ్‌..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions