Today (15-02-23) Stock Market Roundup: లేటుగా లేచినా.. లాటుగా లాభాల్లోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Today (15-02-23) Stock Market Roundup: దేశీయ స్టాక్ మార్కెట్ ఇవాళ బుధవారం లేటుగా పుంజుకుంది. దీంతో.. ఉదయం నష్టాలతో ప్రారంభమైనప్పటికీ సాయంత్రం భారీ లాభాల్లోనే ముగిసింది. రెండు కీలక సూచీలు కూడా బెంచ్ మార్క్లకు పైనే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ చాలా రోజుల తర్వాత 18 వేల పాయింట్లను మించటం విశేషం. రిలయెన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ర్యాలీ తీయటం కలిసొచ్చింది.
సెన్సెక్స్ ఒకానొక దశలో నేటి కనిష్ట విలువైన 60 వేల 750 పాయింట్లకు పడిపోయింది. చివరి సెషన్లో ఊపందుకోవటంతో తిరిగి 61 వేలు దాటింది. చివరికి.. సెన్సెక్స్.. 242 పాయింట్లు పెరిగి 61 వేల 275 పాయింట్ల వద్ద ఎండ్ అయింది. నిఫ్టీ.. 86 పాయింట్లు బలపడి 18 వేల 15 పాయింట్ల వద్ద ఆగింది. సెన్సెక్స్లోని మొత్తం 30 కంపెనీల్లో 20 కంపెనీలు పాజిటివ్ జోన్కి దగ్గరలో క్లోజ్ అయ్యాయి.
Also Read
- iPhone 18 Launch Date: యాపిల్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 18 ప్రో లాంచ్ డేట్ లీక్..! ఫీచర్లు, ధరలు వైరల్..
- Boondi Sev Curry Recipe: ఇంట్లో కూరగాయలు లేవా..? పెరుగు, బూందీ, సేవ్తో సూపర్ టేస్టీ కూర..
- Salman Nadwi D*eath: అయోధ్య వివాదంపై చర్చలకు మద్దతిచ్చిన మౌలానా సల్మాన్ నద్వీ మృతి..
- Cooking Tips: మిగిలిన గ్రేవీని పారేయకండి.. ఇలా వాడితే కొత్త రుచులు మీ సొంతం
read more: Loss For Life Insurers: అధిక ప్రీమియం ప్రొడక్టులపై పన్నుల ప్రభావం
బీఎస్ఈలో టొరెంట్ పవర్, తేజాస్ నెట్వర్క్, జీఐసీ ఇండియా భాగా రాణించాయి. టీసీఎన్ఎస్ క్లాతింగ్, సీజీ పవర్, ఉల్ఫెక్స్ కంపెనీల షేర్లు నష్టపోయాయి. సెక్టార్ల వారీగా చూస్తే నిఫ్టీలో ఐటీ మరియు రియాల్టీ, ఆటో ఇండెక్స్లు ఒక శాతానికి పైగా పెరిగాయి. వ్యక్తిగత స్టాక్స్ను పరిశీలిస్తే.. అదానీ ఎంటర్ప్రైజెస్ స్టాక్స్ విలువ వరుసగా రెండో రోజు కూడా పెరిగింది.
డిసెంబర్ త్రైమాసికంలో మంచి పనితీరు కనబరచటం ఈ సంస్థకు ప్లస్ అయింది. టెక్ మహింద్రా షేర్ వ్యాల్యూ దాదాపు ఆరు శాతం మెరుగుపడి వెయ్యీ 71 రూపాయలకు చేరింది. మరోవైపు.. హిందుస్థాన్ యూనిలీవర్, ఐటీసీ, సన్ ఫార్మా ఒక్కో శాతం చొప్పున డౌన్ అయ్యాయి. 10 గ్రాముల బంగారం రేటు 603 రూపాయలు పడిపోయింది.
అత్యధికంగా 56 వేల 147 రూపాయల వద్ద ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర ఏకంగా 992 రూపాయలు తగ్గిపోయింది. గరిష్టంగా 65 వేల 259 రూపాయలు పలికింది. క్రూడాయిల్ రేటు 107 రూపాయిలు మైనస్ అయింది. ఒక బ్యారెల్ ముడిచమురు 6 వేల 459 రూపాయలుగా నమోదైంది. రూపాయి వ్యాల్యూ రెండు పైసలు బలహీనపడింది. డాలరుతో పోల్చితే 82 రూపాయల 81 పైసల వద్ద స్థిరపడింది.
తాజావార్తలు
-
Team India: టీమిండియాకు ఒక్క పరుగు షాక్.. ఇదేం మొదటిసారి కాదు!
-
iPhone 18 Launch Date: యాపిల్ ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ఐఫోన్ 18 ప్రో లాంచ్ డేట్ లీక్..! ఫీచర్లు, ధరలు వైరల్..
-
Tilak Varma Fifty: కీలక హాఫ్ సెంచరీ చేసినా.. చెత్త జాబితాలో తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ!
-
Boondi Sev Curry Recipe: ఇంట్లో కూరగాయలు లేవా..? పెరుగు, బూందీ, సేవ్తో సూపర్ టేస్టీ కూర..
-
G2: అడివి శేష్ స్పై థ్రిల్లర్కు బ్రేకులు.. ఈ ఏడాది రిలీజ్ కష్టమేనా?
ట్రెండింగ్
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!