TN Elections 2026: నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. తెలుగు ఓటర్లే లక్ష్యంగా సీఎం చంద్రబాబు రోడ్ షో!
- నేటితో ముగియనున్న తమిళనాడు ఎన్నికల ప్రచారం
- ప్రధాన పార్టీల అగ్రనేతలంతా రోడ్ షోలు, భారీ ర్యాలీలతో బిజీ
- తెలుగు ఓటర్లే లక్ష్యంగా సీఎం చంద్రబాబు రోడ్ షో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల హోరాహోరీ ప్రచారానికి నేటితో తెరపడనుంది. రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు బహిరంగ ప్రచారం ముగుస్తుంది. నిబంధనల ప్రకారం పోలింగ్కు 48 గంటల ముందే ప్రచారం ముగించాల్సి ఉండటంతో.. ప్రధాన పార్టీల అగ్రనేతలంతా రోడ్ షోలు, భారీ ర్యాలీలతో ముగింపు పర్వానికి సిద్ధమయ్యారు. సీఎం స్టాలిన్ చెన్నైలోని తన కొలత్తూరు నియోజకవర్గంలో భారీ రోడ్ షోతో ప్రచారాన్ని ముగిస్తారు. అటు ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి తన సొంత నియోజకవర్గమైన ఎడప్పాడిలో బహిరంగ సభలో పాల్గొంటున్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులతో కలిసి ప్రచారం ముగిస్తారు. హీరో విజయ్ తన నియోజకవర్గం పెరంబూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెన్నైలోని తెలుగు ఓటర్లే లక్ష్యంగా రంగంలోకి దిగారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ టినగర్, ఆవడి పరిసరాల్లో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. గత నెల రోజులుగా రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో అగ్రనేతలు సుడిగాలి పర్యటనలు చేశారు. అధికార డీఎంకే, విపక్ష ఏఐఏడీఎంకే, బీజేపీ కూటములు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించాయి.
Also Read
- Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం 'అల్లం మురబ్బా' ఇంట్లోనే చేసుకోండి ఇలా..
- Rajinikanth-Kamal Haasan: రజనీ-కమల్ మెగా మల్టీస్టారర్లో త్రిష..
- 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
- Tim David: ఎందుకు బ్రో అంత కోపం.. RCB విజయంతో టిమ్ డేవిడ్ ఆ వేళ్లు చూపిస్తూ.!
Also Read: Daily Horoscope: మంగళవారం దిన ఫలాలు.. వ్యాపారంలో జాగ్రత్త!
సీఎం స్టాలిన్ దాదాపు 120కి పైగా బహిరంగ సభలు, రోడ్ షోలలో పాల్గొని తన ప్రభావాన్ని చాటారు. అటు విపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి కూడా వెనక్కి తగ్గకుండా 100 ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తన ‘ఎన్ మన్ ఎన్ మక్కల్’ యాత్రతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను చుట్టేసి రికార్డు సృష్టించారు. విజయ్ తన పార్టీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. ఇక తెలుగు ఓటర్లు కీలకమైన చెన్నై, కృష్ణగిరి, హోసూరు వంటి ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రోడ్ షో నిర్వహించారు. దాదాపు 10-15 కీలక ప్రాంతాల్లో బాబు ఎన్డీఏ అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహించారు. సాయంత్రం 5 గంటల నుంచి మైకులు మూగబోనుండటంతో.. నేతలంతా తమ తమ నియోజకవర్గాల్లో ముగింపు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
తాజావార్తలు
-
Priyanka Chopra: విజయ్ క్రేజ్ చూసి షాక్ అయిన ప్రియాంక చోప్రా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
Rajinikanth-Kamal Haasan: రజనీ-కమల్ మెగా మల్టీస్టారర్లో త్రిష..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
Drishyam3 : దృశ్యం -3 తెలుగు రీమేక్ నుండి తప్పుకున్న వెంకీ.. డబ్బింగ్ వర్షన్ రిలీజ్ కు రెడీ
ట్రెండింగ్
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?
-
Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!
-
Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత