TN Elections 2026: నేటితో ముగియనున్న ఎన్నికల ప్రచారం.. తెలుగు ఓటర్లే లక్ష్యంగా సీఎం చంద్రబాబు రోడ్ షో!
- నేటితో ముగియనున్న తమిళనాడు ఎన్నికల ప్రచారం
- ప్రధాన పార్టీల అగ్రనేతలంతా రోడ్ షోలు, భారీ ర్యాలీలతో బిజీ
- తెలుగు ఓటర్లే లక్ష్యంగా సీఎం చంద్రబాబు రోడ్ షో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల హోరాహోరీ ప్రచారానికి నేటితో తెరపడనుంది. రాష్ట్రంలోని మొత్తం 234 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు బహిరంగ ప్రచారం ముగుస్తుంది. నిబంధనల ప్రకారం పోలింగ్కు 48 గంటల ముందే ప్రచారం ముగించాల్సి ఉండటంతో.. ప్రధాన పార్టీల అగ్రనేతలంతా రోడ్ షోలు, భారీ ర్యాలీలతో ముగింపు పర్వానికి సిద్ధమయ్యారు. సీఎం స్టాలిన్ చెన్నైలోని తన కొలత్తూరు నియోజకవర్గంలో భారీ రోడ్ షోతో ప్రచారాన్ని ముగిస్తారు. అటు ప్రతిపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి తన సొంత నియోజకవర్గమైన ఎడప్పాడిలో బహిరంగ సభలో పాల్గొంటున్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గంలో పార్టీ శ్రేణులతో కలిసి ప్రచారం ముగిస్తారు. హీరో విజయ్ తన నియోజకవర్గం పెరంబూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెన్నైలోని తెలుగు ఓటర్లే లక్ష్యంగా రంగంలోకి దిగారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ టినగర్, ఆవడి పరిసరాల్లో మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు రోడ్ షో నిర్వహించనున్నారు. గత నెల రోజులుగా రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో అగ్రనేతలు సుడిగాలి పర్యటనలు చేశారు. అధికార డీఎంకే, విపక్ష ఏఐఏడీఎంకే, బీజేపీ కూటములు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శాయశక్తులా ప్రయత్నించాయి.
Also Read
- Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
- Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
- DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
- Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
Also Read: Daily Horoscope: మంగళవారం దిన ఫలాలు.. వ్యాపారంలో జాగ్రత్త!
సీఎం స్టాలిన్ దాదాపు 120కి పైగా బహిరంగ సభలు, రోడ్ షోలలో పాల్గొని తన ప్రభావాన్ని చాటారు. అటు విపక్ష నేత ఎడప్పాడి పళనిస్వామి కూడా వెనక్కి తగ్గకుండా 100 ప్రాంతాల్లో పర్యటించి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఇక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తన ‘ఎన్ మన్ ఎన్ మక్కల్’ యాత్రతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలను చుట్టేసి రికార్డు సృష్టించారు. విజయ్ తన పార్టీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా ప్రాంతాల్లో సుడిగాలి పర్యటనలు చేశారు. ఇక తెలుగు ఓటర్లు కీలకమైన చెన్నై, కృష్ణగిరి, హోసూరు వంటి ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రోడ్ షో నిర్వహించారు. దాదాపు 10-15 కీలక ప్రాంతాల్లో బాబు ఎన్డీఏ అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహించారు. సాయంత్రం 5 గంటల నుంచి మైకులు మూగబోనుండటంతో.. నేతలంతా తమ తమ నియోజకవర్గాల్లో ముగింపు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
తాజావార్తలు
-
Srithej : శ్రీతేజ్ కుటుంబానికి అల్లు ఫ్యామిలీ భరోసా: చదువు బాధ్యత నాదేనన్న అల్లు అరవింద్!
-
Iran-US: ఇస్లామాబాద్లో మళ్లీ చర్చలు జరగబోతున్నాయా? తాజా బ్రేకింగ్ న్యూస్ ఇదే!
-
Ricky Ponting: క్యాచ్ వదిలేసిన శశాంక్ సింగ్.. పంజాబ్ కోచ్ రికీ పాంటింగ్ సంచలన వ్యాఖ్యలు..
-
DMK: కాంగ్రెస్ను నమ్మి భారీ మూల్యం చెల్లించుకున్నాము..
-
Hardik Pandya: ముంబై నుంచి హార్దిక్ పాండ్య ఔట్.. సూర్యకుమార్ సారథ్యంలో తదుపరి మ్యాచ్ లు..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!