TMC MP Controversy: అమిత్షా తల నరికి టేబుల్పై పెట్టాలి.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీఎంసీ ఎంపీ
TMC MP Controversy: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. కేంద్ర హోంమత్రి అమిత్ షా బంగ్లాదేశ్ చొరబాట్లను ఆపలేకపోతే, ఆయన తల నరికి ప్రధానమంత్రి టేబుల్పై ఉంచాలని ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రకటన విడుదల చేశారు. దీంతో ఒక్కసారిగా ఆమె ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఇలాగే ఆమె గతంలో కూడా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి.
READ ALSO: Asia Cup 2025: ఆ ఐదుగురు ప్లేయర్లు దుబాయ్కు వెళ్లరు: బీసీసీఐ
Also Read
- CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
- Tragedy: వయ్యారాలు ఒలకబోస్తూ 5 గురు స్త్రీలు.. ఏకాంతంగా కలిసేందుకు ఆహ్వానాలు.. చివరకు ఇలా..
- White Towel: ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్ల టవల్ ఎందుకు?.. దీని వెనుక ఉన్న స్టోరీ ఇదే!
- TG EAPCET-2026 : షెడ్యూల్ విడుదల.. హాల్ టికెట్ల డౌన్లోడ్ ఎప్పుడంటే.?
సరిహద్దులను రక్షించే బాధ్యత హోంమంత్రిదే..
దేశ సరిహద్దులను రక్షించే బాధ్యత హోంమంత్రిదేనని ఎంపీ మహువా మొయిత్రా అన్నారు. ఆగస్టు 15న ఎర్రకోట నుంచి చొరబాట్లపై ప్రధాని మాట్లాడుతున్నప్పుడు, హోంమంత్రి మొదటి వరుసలో కూర్చుని చప్పట్లు కొడుతున్నారు. లక్షలాది మంది భారత్లోకి అక్రమంగా చొరబడుతూనే ఉన్నారు. మన భూమిని ఆక్రమించుకుంటున్నారని అన్నారు. దేశాన్ని రక్షించడంలో హోంమంత్రి విఫలమయ్యారని, కాబట్టి ఆయన తల నరికి ప్రధానమంత్రి టేబుల్ మీద ఉంచాలని మొయిత్రా తీవ్ర స్థాయిలో విమర్శించారు. తాజాగా ఆమె చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ప్రజలు నుంచి కూడా ఎంపీ ప్రకటనపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.
గతంలోను పలు వివాదాస్పద వ్యాఖ్యలు..
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా గతంలోనూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన సందర్భాలు ఉన్నాయి. 2021లో ఆమె లోక్సభలో మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థ నిష్పాక్షికతను ఆమె ప్రశ్నించడంతో పాటు, గొగోయ్పై లైంగిక వేధింపుల ఆరోపణలను లోక్సభలో ప్రస్తావించారు. నాడు ఈ ప్రకటనపై సభలో తీవ్ర దుమారం చెలరేగింది. 2022లో అహ్మదాబాద్లో మాంసాహారంపై నిషేధం నేపథ్యంలో లోక్సభలో మహువా మొయిత్రా జైన సమాజం గురించి ప్రస్తావించారు. జైన సమాజం దీనిని అవమానకరంగా భావించింది. మాజీ ఎంపీ విజయ్ దర్దా ఈ ప్రకటనను ఖండించడంతో, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 2023లో లోక్సభలో మొయిత్రా అధికార పార్టీ సభ్యురాలిపై దుర్భాషలాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2024లో మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రేఖశర్మ.. హత్రాస్ తొక్కిసలాట స్థలానికి గొడుగు పట్టుకున్న వ్యక్తితో వెళుతున్న వీడియోపై మహువా మొయిత్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యపై మహిళా కమిషన్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయ్యింది.
READ ALSO: Luknow: లక్నోలో విషాదం.. అసలేమైందంటే…
తాజావార్తలు
-
CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
-
Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. ‘మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం’.. అంటూ ఆగ్రహం!
-
TGSRTC : సమ్మె విరమించి యధావిధిగా విధుల్లోకి హాజరుకావాలి.. ఆర్టీసీ ఎండీ సూచన
-
Vivo X300 Ultra, Vivo X300 FE: కెమెరా కింగ్గా రాబోతున్న Vivo X300 సిరీస్.. రిలీజ్ డేట్ ఫిక్స్
-
CM Chandrababu: వర్మ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసహనం..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?