TMC MP Controversy: అమిత్షా తల నరికి టేబుల్పై పెట్టాలి.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీఎంసీ ఎంపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TMC MP Controversy: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. కేంద్ర హోంమత్రి అమిత్ షా బంగ్లాదేశ్ చొరబాట్లను ఆపలేకపోతే, ఆయన తల నరికి ప్రధానమంత్రి టేబుల్పై ఉంచాలని ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలతో ప్రకటన విడుదల చేశారు. దీంతో ఒక్కసారిగా ఆమె ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఇలాగే ఆమె గతంలో కూడా పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి.
READ ALSO: Asia Cup 2025: ఆ ఐదుగురు ప్లేయర్లు దుబాయ్కు వెళ్లరు: బీసీసీఐ
Also Read
- 144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
- Youtube Videos: రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తే లక్ష రూపాయలు... క్రియేటర్లకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..
- Ongole: లిఫ్ట్లో ఇరుక్కుని మహిళ మృతి..! సీసీటీవీ ఫుటేజ్ వైరల్..
- Smart Phones: కేవలం రూ.17,999 లకే వాటర్ ప్రూఫ్ మొబైల్.. IP64, IP65 రేటింగ్.. 7000mAh బ్యాటరీ..
సరిహద్దులను రక్షించే బాధ్యత హోంమంత్రిదే..
దేశ సరిహద్దులను రక్షించే బాధ్యత హోంమంత్రిదేనని ఎంపీ మహువా మొయిత్రా అన్నారు. ఆగస్టు 15న ఎర్రకోట నుంచి చొరబాట్లపై ప్రధాని మాట్లాడుతున్నప్పుడు, హోంమంత్రి మొదటి వరుసలో కూర్చుని చప్పట్లు కొడుతున్నారు. లక్షలాది మంది భారత్లోకి అక్రమంగా చొరబడుతూనే ఉన్నారు. మన భూమిని ఆక్రమించుకుంటున్నారని అన్నారు. దేశాన్ని రక్షించడంలో హోంమంత్రి విఫలమయ్యారని, కాబట్టి ఆయన తల నరికి ప్రధానమంత్రి టేబుల్ మీద ఉంచాలని మొయిత్రా తీవ్ర స్థాయిలో విమర్శించారు. తాజాగా ఆమె చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ప్రజలు నుంచి కూడా ఎంపీ ప్రకటనపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.
గతంలోను పలు వివాదాస్పద వ్యాఖ్యలు..
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా గతంలోనూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచిన సందర్భాలు ఉన్నాయి. 2021లో ఆమె లోక్సభలో మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. న్యాయవ్యవస్థ నిష్పాక్షికతను ఆమె ప్రశ్నించడంతో పాటు, గొగోయ్పై లైంగిక వేధింపుల ఆరోపణలను లోక్సభలో ప్రస్తావించారు. నాడు ఈ ప్రకటనపై సభలో తీవ్ర దుమారం చెలరేగింది. 2022లో అహ్మదాబాద్లో మాంసాహారంపై నిషేధం నేపథ్యంలో లోక్సభలో మహువా మొయిత్రా జైన సమాజం గురించి ప్రస్తావించారు. జైన సమాజం దీనిని అవమానకరంగా భావించింది. మాజీ ఎంపీ విజయ్ దర్దా ఈ ప్రకటనను ఖండించడంతో, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 2023లో లోక్సభలో మొయిత్రా అధికార పార్టీ సభ్యురాలిపై దుర్భాషలాడినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2024లో మహిళా కమిషన్ ఛైర్పర్సన్ రేఖశర్మ.. హత్రాస్ తొక్కిసలాట స్థలానికి గొడుగు పట్టుకున్న వ్యక్తితో వెళుతున్న వీడియోపై మహువా మొయిత్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యపై మహిళా కమిషన్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయ్యింది.
READ ALSO: Luknow: లక్నోలో విషాదం.. అసలేమైందంటే…
తాజావార్తలు
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Sai Abhyankkar: ఎక్స్ గర్ల్ఫ్రెండ్ పేరుతోనే పాట.. సాయి అభ్యంకర్ ‘రాధిమా’ వెనుక అసలు కథ ఇదే!
-
Youtube Videos: రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తే లక్ష రూపాయలు… క్రియేటర్లకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..
-
Volvo EX90: LiDAR సేఫ్టీతో వస్తున్న లగ్జరీ ఎలక్ట్రిక్ SUV వోల్వో EX90.. 600KM రేంజ్..!
-
Ongole: లిఫ్ట్లో ఇరుక్కుని మహిళ మృతి..! సీసీటీవీ ఫుటేజ్ వైరల్..
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!