Mahua Moitra : త్వరగా బంగ్లా ఖాళీ చేయండి.. టీఎంసీ నేత మహువా మొయిత్రాకు అల్టిమేటం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahua Moitra : టీఎంసీ నేత మహువా మొయిత్రా ఇటీవల పార్లమెంట్ నుంచి బహిష్కరించబడిన సంగతి తెలిసిందే. ఇప్పడు ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయనందుకు అల్టిమేటం అందుకున్నారు. ఈ మేరకు ఆమె మరో నోటీసు అందుకుంది. ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయకుంటే తనను బలవంతంగా బంగ్లాను ఖాళీ చేయిస్తామని ఆ నోటీసులో పేర్కొన్నారు. పార్లమెంటు నుండి సస్పెన్షన్ తర్వాత, మహువా మొయిత్రా ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయమని అనేక నోటీసులు అందుకున్నారు. ఇంత జరుగుతున్నా ఆమె ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయడం లేదు. నోటీసు ప్రకారం, ఆమె పార్లమెంటు సభ్యత్వం కోల్పోయిన తర్వాత, ఈ బంగ్లాకు అర్హురాలు కాదు. అందువల్ల ఆమె 9B టెలిగ్రాఫ్ లేన్లోని టైప్ 5 బంగ్లాను ఖాళీ చేయాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం బంగ్లాను ఖాళీ చేసేందుకు నెల రోజుల గడువు ఇచ్చారు. అయితే ఈలోగా కోర్టును కూడా ఆశ్రయించినా అక్కడి నుంచి కూడా ఉపశమనం లభించలేదు.
Read Also:Delhi : ఢిల్లీలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. పొగమంచు కారణంగా 53 విమానాలు రద్దు..
Also Read
- Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
- T20 World Cup: ఆమె భర్త కోసం ప్రాక్టీస్ ఎగ్గొట్టింది.. చివరకు డ్రెస్సింగ్ రూమ్లో పరువు పోయింది..
- Off The Record: ఉదయగిరి టీడీపీలో అంతర్గత విభేదాలు? ఆయనపై అసంతృప్తి పెరుగుతోందా?
- Indian Railway: ఇండియన్ రైల్వేలో సరికొత్త విప్లవం.. టెక్నాలజీ వాడకంలో భారత్ నెక్స్ట్ లెవెల్..
మహువా ప్రభుత్వ బంగ్లాను వెంటనే ఖాళీ చేయాలని నోటీసులో పేర్కొన్నారు. సభ్యత్వం కోసం ఒక నెల గడువు ముగిసిన తర్వాత జనవరి 7న అలాట్మెంట్ రద్దు చేయబడింది. ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని మహువా మొయిత్రాకు పలుమార్లు నోటీసులు అందాయి. అదే సమయంలో ఇప్పుడు బంగ్లాను ఖాళీ చేయకుంటే అవసరమైతే బలవంతంగా గెంటేస్తామని తాజా నోటీసులో పేర్కొన్నారు. డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ ఆమెకు ఈ నోటీసు పంపింది.
Read Also:Power Cuts in Hyderabad: హైదరాబాద్ లో విద్యుత్ కోతలు.. నేటి నుంచి ఫిబ్రవరి 10 వరకు..!
ప్రభుత్వ బంగ్లాను ఎప్పుడు ఖాళీ చేయాలి?
ఎంపీగా ఎన్నికైన తర్వాత టీఎంసీ నేత మహువా మొయిత్రా టెలిగ్రాఫ్ లేన్లో ప్రభుత్వ బంగ్లాను పొందారు. చట్టం ప్రకారం, ఎంపీలు పార్లమెంటు సభ్యత్వాన్ని విడిచిపెట్టిన తర్వాత ఒక నెల మాత్రమే ప్రభుత్వ నివాసాన్ని ఉంచుకోవచ్చు. దీని తర్వాత వారు బంగ్లాను ఖాళీ చేయాలి. సవరించిన చట్టం ప్రకారం, ప్రభుత్వ వసతి గృహాల నుండి అనధికార వ్యక్తులను తొలగించడానికి 3 రోజుల ముందు ఎస్టేట్ అధికారి షోకాజ్ నోటీసు జారీ చేయవచ్చు. ఇంతకుముందు ఈ వ్యవధి 60 రోజులు. పార్లమెంటులో ప్రశ్నలు అడిగినందుకు డబ్బు తీసుకున్నందుకు దోషిగా తేలడంతో మహువా మొయిత్రా పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయారు.
తాజావార్తలు
-
Story Board : నాలుగోసారి గెలవడానికి.. మోడీ దగ్గరున్న త్రిశూల వ్యూహాలేంటి..?
-
Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
-
T20 World Cup: ఆమె భర్త కోసం ప్రాక్టీస్ ఎగ్గొట్టింది.. చివరకు డ్రెస్సింగ్ రూమ్లో పరువు పోయింది..
-
Golconda Hostel Incident : గోల్కొండ హాస్టల్లో షాక్.. బాత్రూంలో ప్రసవం, శిశువు మృతి!
-
Off The Record: ఉదయగిరి టీడీపీలో అంతర్గత విభేదాలు? ఆయనపై అసంతృప్తి పెరుగుతోందా?
ట్రెండింగ్
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!