Mahua Moitra : త్వరగా బంగ్లా ఖాళీ చేయండి.. టీఎంసీ నేత మహువా మొయిత్రాకు అల్టిమేటం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahua Moitra : టీఎంసీ నేత మహువా మొయిత్రా ఇటీవల పార్లమెంట్ నుంచి బహిష్కరించబడిన సంగతి తెలిసిందే. ఇప్పడు ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయనందుకు అల్టిమేటం అందుకున్నారు. ఈ మేరకు ఆమె మరో నోటీసు అందుకుంది. ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయకుంటే తనను బలవంతంగా బంగ్లాను ఖాళీ చేయిస్తామని ఆ నోటీసులో పేర్కొన్నారు. పార్లమెంటు నుండి సస్పెన్షన్ తర్వాత, మహువా మొయిత్రా ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయమని అనేక నోటీసులు అందుకున్నారు. ఇంత జరుగుతున్నా ఆమె ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయడం లేదు. నోటీసు ప్రకారం, ఆమె పార్లమెంటు సభ్యత్వం కోల్పోయిన తర్వాత, ఈ బంగ్లాకు అర్హురాలు కాదు. అందువల్ల ఆమె 9B టెలిగ్రాఫ్ లేన్లోని టైప్ 5 బంగ్లాను ఖాళీ చేయాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం బంగ్లాను ఖాళీ చేసేందుకు నెల రోజుల గడువు ఇచ్చారు. అయితే ఈలోగా కోర్టును కూడా ఆశ్రయించినా అక్కడి నుంచి కూడా ఉపశమనం లభించలేదు.
Read Also:Delhi : ఢిల్లీలో భారీగా పడిపోయిన ఉష్ణోగ్రతలు.. పొగమంచు కారణంగా 53 విమానాలు రద్దు..
Also Read
- Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
- రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
- MP: ‘సారీ అమ్మా, నాన్న.. మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు’.. కన్నీరు పెట్టిస్తున్న నీట్ విద్యార్థిని సూసైడ్ నోట్
- SL vs WI: కెప్టెన్గా కుసాల్ మెండిస్ బోణి.. వెస్టిండీస్పై శ్రీలంక ఘన విజయం.!
మహువా ప్రభుత్వ బంగ్లాను వెంటనే ఖాళీ చేయాలని నోటీసులో పేర్కొన్నారు. సభ్యత్వం కోసం ఒక నెల గడువు ముగిసిన తర్వాత జనవరి 7న అలాట్మెంట్ రద్దు చేయబడింది. ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాలని మహువా మొయిత్రాకు పలుమార్లు నోటీసులు అందాయి. అదే సమయంలో ఇప్పుడు బంగ్లాను ఖాళీ చేయకుంటే అవసరమైతే బలవంతంగా గెంటేస్తామని తాజా నోటీసులో పేర్కొన్నారు. డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ ఆమెకు ఈ నోటీసు పంపింది.
Read Also:Power Cuts in Hyderabad: హైదరాబాద్ లో విద్యుత్ కోతలు.. నేటి నుంచి ఫిబ్రవరి 10 వరకు..!
ప్రభుత్వ బంగ్లాను ఎప్పుడు ఖాళీ చేయాలి?
ఎంపీగా ఎన్నికైన తర్వాత టీఎంసీ నేత మహువా మొయిత్రా టెలిగ్రాఫ్ లేన్లో ప్రభుత్వ బంగ్లాను పొందారు. చట్టం ప్రకారం, ఎంపీలు పార్లమెంటు సభ్యత్వాన్ని విడిచిపెట్టిన తర్వాత ఒక నెల మాత్రమే ప్రభుత్వ నివాసాన్ని ఉంచుకోవచ్చు. దీని తర్వాత వారు బంగ్లాను ఖాళీ చేయాలి. సవరించిన చట్టం ప్రకారం, ప్రభుత్వ వసతి గృహాల నుండి అనధికార వ్యక్తులను తొలగించడానికి 3 రోజుల ముందు ఎస్టేట్ అధికారి షోకాజ్ నోటీసు జారీ చేయవచ్చు. ఇంతకుముందు ఈ వ్యవధి 60 రోజులు. పార్లమెంటులో ప్రశ్నలు అడిగినందుకు డబ్బు తీసుకున్నందుకు దోషిగా తేలడంతో మహువా మొయిత్రా పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయారు.
తాజావార్తలు
-
OTT : పెద్ద సినిమాలకు ఓటీటీ డీల్ కాకుంటే రిలీజ్ డేట్ ప్రకటించరా?
-
Google AI Scam Call Detection: గూగుల్ నుంచి కొత్త AI స్కామ్ కాల్ డిటెక్షన్ ఫీచర్.. యూజర్లకు భారీ ఊరట
-
Donald Trump: సొంత పార్టీ నుంచే ట్రంప్కు ఎదురుదెబ్బ! అమెరికా పార్లమెంట్లో సంచలనం.. ఏం జరిగిందంటే?
-
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. భుజంగరావుకు 14 రోజుల రిమాండ్
-
IRCTC: నకిలీ బుకింగ్లపై పట్టు బిగించిన ఐఆర్ సీటీసీ.. 3.03 కోట్ల అనుమానాస్పద ఐడీలు డీయాక్టివేట్
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!