Prakash Raj: గెలిచేముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత ఇంకో అవతారం! ప్రకాశ్ రాజ్ ట్వీట్ వైరల్
- తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వివాదం
- ప్రకాశ్ రాజ్-పవన్ కల్యాణ్ మధ్య మాటల యుద్ధం
- ఏందుకు మనకీ అయోమయం అంటూ మరో ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Prakash Raj vs Pawan Kalyan: ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చేస్తున్న పోస్టులు నెట్టింట వైరల్గా మారాయి. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ను కోట్ చేస్తూ మొదలైన ఆయన పోస్టుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే మూడు ట్వీట్స్ చేసిన ప్రకాశ్ రాజ్.. తాజాగా మరో పోస్ట్ చేశారు. ‘గెలిచేముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత ఇంకో అవతారం. ఏంటీ అవాంతరం.. ఏందుకు మనకీ అయోమయం.. ఏది నిజం?. జస్ట్ ఆస్కింగ్?..’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ వివాదంపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, భక్తులు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 20న పవన్ కల్యాణ్ను కోట్ చేస్తూ ప్రకాశ్ రాజ్ ఓ పోస్ట్ పెట్టారు. ‘ప్రియమైన పవన్ కళ్యాణ్ గారు.. మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది. దయచేసి దర్యాప్తు చేయండి.. నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోండి. అనవసర భయాలు కల్పించి.. దీన్ని జాతీయ స్థాయిలో చర్చించుకునేలా మీరెందుకు చేస్తున్నారు. మన దేశంలో ఇప్పటికే ఉన్న మతపరమైన ఉద్రిక్తలు చాలు. జస్ట్ ఆస్కింగ్’ అని పేర్కొన్నారు.
Also Read
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
- Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్పే..
Also Read: Devara Jatharaa: టైగర్ వేటకు సమయం ఆసన్నమైంది.. మరికొన్ని గంటల్లో ఎరుపెక్కనున్న థియేటర్లు!
ప్రకాశ్ రాజ్ ట్వీట్పై పవన్ కల్యాణ్ స్పందించారు. ఇంద్రకీలాద్రి దుర్గగుడిలో ఆలయ మెట్లను శుభ్రం చేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ప్రకాశ్ రాజ్తో పాటు అందరికీ చెబుతున్నా.. విమర్శలకు ముందు ఏం జరిగిందో ముందు తెలుసుకోండి. సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదు’ అని అన్నారు. దీనిపై ప్రకాశ్ రాజ్ ఓ వీడియో రిలీజ్ చేశారు. ‘పవన్ కళ్యాణ్ గారు.. నేను మీ ప్రెస్ మీట్ చూశాను. నేను చెప్పిందాన్ని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను విదేశాల్లో షూటింగ్లో ఉన్నా. ఈ నెల 30 తర్వాత భారత్ వచ్చి మీ ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతా. ఈలోగా మీకు వీలుంటే.. నా ట్వీట్ను మళ్లీ చదవి అర్థం చేసుకోండి’ అని అన్నారు. అనంతరం హీరో కార్తీ సారీ చెప్పిన దానికి స్పందిస్తూ.. ‘చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! జస్ట్ ఆస్కింగ్’ అని మరో ట్వీట్ చేశారు. తాజాగా మరో ట్వీట్ చేశారు.
గెలిచేముందు ఒక అవతారం… గెలిచిన తర్వాత ఇంకో అవతారం..
ఏంటీ అవాంతరం.. ఏందుకు మనకీ అయోమయం… ఏది నిజం?
జస్ట్ ఆస్కింగ్? #justasking— Prakash Raj (@prakashraaj) September 26, 2024
తాజావార్తలు
-
Ponnam Prabhakar : బీఆర్ఎస్ నిరసనలపై పొన్నం ఫైర్.. ‘లెక్కలు చెప్పండి’ అంటూ వార్నింగ్..
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!