Tirumala Laddu: తిరుపతి లడ్డూ ప్రసాదం వివాదంపై స్పందించిన సద్గురు!
- తిరుపతి లడ్డూ ప్రసాదం వివాదం.
- స్పందించిన ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు.
- హిందూ దేవాలయాలను ప్రభుత్వ పాలనతో కాకుండా భక్తులైన హిందువులే నిర్వహించాలంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirumala Laddu: లడ్డూ ప్రసాదం అంశంపై కోయంబత్తూర్కు చెందిన ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, అధినేత సద్గురు తన స్పందనను వ్యక్తం చేశారు. ఆలయ ప్రసాదంలో ఆవు కొవ్వును భక్తులు వినియోగించడం అత్యంత అసహ్యకరమని అన్నారు. అందుకే దేవాలయాలు ప్రభుత్వ పరిపాలన ద్వారా కాకుండా భక్తులచే నడపబడాలని సద్గురు అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో ప్రసాదంగా అందించే లడ్డూలలో నెయ్యి కల్తీ అని ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. లడ్డులో జంతు కొవ్వు, చేప నూనె కూడా కలిపినట్లు రిపోర్ట్స్ ఉన్నాయి అంటూ అయన తెలిపారు.
Kaleshwaram Commission: రేపటి నుంచి ఇంజనీర్లను ప్రశ్నించనున్న కాళేశ్వరం కమిషన్..
Also Read
- Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
- Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
- BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
- Earthquake: 7 రోజుల్లో 187 భూకంపాలు.. "రింగ్ ఆఫ్ ఫైర్"లో ఏం జరుగుతోంది?
అయితే, లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వును ఉపయోగించడంపై భారీ వివాదం తర్వాత, ఆలయ నిర్వాహకులు ఈ పవిత్ర ప్రసాదం పవిత్రతను పునరుద్ధరించారు. ఈ విషయమై శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ నిర్వహణ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (టీటీడీ) గత శుక్రవారం సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్లో శ్రీవారి లడ్డూల పవిత్రత ఇప్పుడు మచ్చలేనిదని పేర్కొంది. భక్తులందరి సంతృప్తి కోసం లడ్డూ ప్రసాదాల పవిత్రతను కాపాడేందుకు టీటీడీ కట్టుబడి ఉందని తెలిపింది.
Good Cholesterol vs Bad Cholesterol: మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్ మధ్య తేడా తెలుసా..?
ఈ విషయంలో ఇషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు తన స్పందనను తెలియజేస్తూ.., భక్తి లేని చోట స్వచ్ఛత ఉండదని ఆయన అన్నారు. హిందూ దేవాలయాలను ప్రభుత్వ పాలనతో కాకుండా భక్తులైన హిందువులే నిర్వహించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తిరుమలలో ప్రతిరోజూ దాదాపు 3 లక్షల లడ్డూలు తయారవుతాయి. లడ్డూను శనగపిండి, నెయ్యి, పంచదార, జీడిపప్పు, ఎండుద్రాక్ష, యాలకుల నుండి తయారు చేస్తారు. దీని రెసిపీ సుమారు 300 సంవత్సరాల నాటిదని చెబుతారు. ఆలయ నిర్వాహకులు ఈ ప్రసాదం ద్వారా ప్రతి సంవత్సరం సుమారు రూ. 500 కోట్లు ఆదాయం చేకూరుతుంది.
Devotees consuming beef tallow in the Temple prasadam is beyond disgusting. This is why Temples should be run by Devotees, not by government administrations. Where there is no Devotion, there shall be no sanctity. Time the Hindu Temples are run by devout Hindus, not by government… https://t.co/4c53zVro7G
— Sadhguru (@SadhguruJV) September 21, 2024
తాజావార్తలు
-
Healthy Snacks: నో జంక్.. ఓన్లీ హెల్తీ స్నాక్! ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు..
-
Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
-
Kishan Reddy: రేవంత్ అమెరికా టూర్ రద్దు.. కిషన్ రెడ్డి కౌంటర్..!
-
Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
-
BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!