TTD Update: రేపు స్థానికులకు శ్రీవారి దర్శనం.. టోకెన్స్ జారీ చేసిన టీటీడీ!
- ప్రతి నెలా మొదటి మంగళవారం దర్శనభాగ్యం
- డిసెంబరు 3న స్థానికులకు శ్రీవారి దర్శనం
- ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని ధర్మకర్తల మండలి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రతి నెలా మొదటి మంగళవారం దర్శనభాగ్యం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో డిసెంబరు 3న స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. ఇందుకు సంబంధించి నేడు తిరుపతిలోని మహతి ఆడిటోరియం, తిరుమల బాలాజీ నగర్లోని కమ్యూనిటీ హాల్లో దర్శన టోకెన్లు ఉచితంగా జారీ చేశారు. మహతి ఆడిటోరియంలో 2,500 టోకెన్లు.. బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో 500 టోకెన్లు ఉదయం 3 నుంచి 5 గంటల మధ్య జారీ చేశారు.
టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మహతి ఆడిటోరియం వద్ధ టోకెన్లు జారీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… ‘గత నెల 18వ తేది స్థానికులకు శ్రీవారి దర్శనం పునరద్దరిస్తూ నిర్ణయం తీసుకున్నాం. టీటీడీ నిర్ణయాన్ని సీఎం చంద్రబాబు నాయుడుకు వివరించా. సీఎం సూచనల మేరకు తిరుపతి రూరల్, రేణిగుంట, చంద్రగిరి వాసులకు దర్శనం కల్పించాం. ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి స్థానికులు ధన్యవాదాలు తెలపాలి’ అని అన్నారు. ‘స్థానికులకు శ్రీవారి దర్శనం పునరుద్ధరణ జరిగిన ఈ రోజు శుభదినం. ప్రతి నెలా మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం ఉంటుంది. రెండు రోజుల ముందు స్థానికులకు టోకెన్లు జారీ చేస్తాం. తిరుపతిలోని మహతి ఆడిటోరియం, తిరుమలలో కమ్యూనిటీ హాల్లో టోకెన్లు జారీ చేస్తాం’ అని ఈఓ శ్యామల రావు చెప్పారు.
Also Read
- Rohit Sharma: హిట్మ్యాన్ సూపర్ షోతో సీన్ రివర్స్..! ‘కథ ఇంకా ముగియలేదు’
- Uday Krishna Reddy: లైంగిక వేధింపుల కేసులో ట్విస్ట్.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణ రెడ్డి ఆత్మహత్య యత్నం..!
- Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
- PM Modi: వాదనలు బలంగా ఉండాలి.. శబ్దం కాదు.. వర్షాకాల సమావేశాలపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
‘ఎన్నికల హామీ మేరకు ఎన్డీఎ కూటమి ప్రభుత్వం స్థానికులకు శ్రీవారి దర్శనం పునరుద్ధరణ చేసింది. ఐదేళ్ల తరువాత స్థానికులకు శ్రీవారి దర్శన భాగ్యం కలిగింది. స్థానికుల ఐదేళ్ల కల ఇవాళ నెరవేరింది. స్థానికుల కల నెరవేరడానికి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కారకులు. అలాగే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈఓ, అదనపు ఈఓ, టీటీడీ సిబ్బందికి నా కృతజ్ఞతలు. తిరుపతితో పాటు చంద్రగిరి, రేణిగుంట వాసులకు దర్శనం కల్పిండం మంచి పరిణామం’ అని ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అన్నారు. ‘చంద్రగిరి వాసులకు శ్రీవారి దర్శనం కల్పించడం సంతోషం. చంద్రగిరి నియోజకవర్గంలో తిరుచానూరు పద్మావతి అమ్మవారు, శ్రీవారి మెట్టు ఉన్నాయి. చంద్రగిరి వాసులకు దర్శనం కల్పించాలని కోరిన వెంటనే సీఎం చంద్రబాబు అంగీకరించారు. చంద్రగిరి వాసులకు దర్శనం కల్పించిన టీటీడీ చైర్మన్కు నా కృతజ్ఞతలు’ అని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్థి నాని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Ananya Pande : అనన్య పాండే నడుము గగిల్లిన గుప్తా
-
Rohit Sharma: హిట్మ్యాన్ సూపర్ షోతో సీన్ రివర్స్..! ‘కథ ఇంకా ముగియలేదు’
-
Vivo X300e: వివో X300e.. 7200mAh బ్యాటరీ, Snapdragon 8 Gen 5 చిప్, 50MP ZEISS కెమెరాతో కొత్త ఫ్లాగ్షిప్
-
Team India: 200 వికెట్స్ తీసినా విలువ లేదా.. ఇక రిటైర్ అవ్వడమే బెటరా?
-
Zee5 Upcoming Movies: జీ5 మెగా లైనప్ అనౌన్స్.. వెంకటేష్, బాలయ్య, నాగచైతన్య సినిమాలతో భారీ ప్లాన్!
ట్రెండింగ్
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!
-
Rohit Sharma History: 50 ఏళ్ల లార్డ్స్ చరిత్రలో ఇదే మొదటిసారి.. తొలి బ్యాటర్గా రోహిత్ అరుదైన రికార్డు!
-
Rohit Sharma Last ODI: రోహిత్ శర్మ చివరి వన్డే ఆడేశాడా?.. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర సమాధానం!
-
Shubman Gill: అప్పటివరకు పోటీలోనే ఉన్నాం.. ఆ ముగ్గురే ముంచారు.. లార్డ్స్ ఓటమిపై శుభ్మన్ గిల్ షాకింగ్ కామెంట్స్!