ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ACB Raids on Tirumala Deputy EO Lokanatham: తిరుమల శ్రీవారి ఆలయం డిప్యూటీ ఈవో మెండు లోకనాథం ఇంట్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. లోకనాథంపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు అయింది. ఈ కేసులో భాగంగా తిరుపతిలోని పెద్దకాపు లేఅవుట్లో ఉన్న ఆయన నివాసంలో అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉదయం 6 గంటల నుంచే సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో మొత్తం ఐదు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
మెండు లోకనాథం ప్రధాన నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన ఇతర ప్రాంతాల్లోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తిరుపతిలో ఉన్న ఆయన ఇద్దరు బావమరుదుల ఇళ్లలోనూ ఏసీబీ తనిఖీలు చేస్తోంది. అలాగే ఏర్పేడు మండలం చెల్లూరులోని లోకనాథం సోదరుడి నివాసంలో కూడా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. లోకనాథం ఆస్తులు, ఆదాయ మార్గాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కీలక పత్రాలు, ఇతర వివరాలను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. అదే సమయంలో తిరుమలలోని లోకనాథం కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆయన విధులు నిర్వహిస్తున్న కార్యాలయానికి సంబంధించిన రికార్డులు, అధికారిక పత్రాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.
Also Read
- IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
- Pawan Kalyan Fan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పెను విషాదం.. కరెంట్ షాక్తో అభిమాని మృతి!
- AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం
- 8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
ఏసీబీ సోదాలు కొనసాగుతున్న సమయంలో డిప్యూటీ ఈవో మెండు లోకనాథం తిరుమల శ్రీవారి ఆలయంలో విధుల్లో ఉన్నారు. ఆయన కోసం తిరుమల క్వార్టర్స్ ముందు కూడా ఏసీబీ అధికారులు వేచి వున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భాగంగా ఈ సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో.. లోకనాథం ఆస్తుల వివరాలు, వాటి విలువ, ఆదాయ వనరులకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నారు. సోదాలు పూర్తయిన తర్వాతే స్వాధీనం చేసుకున్న పత్రాలు, నగదు లేదా ఇతర ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరానున్నాయి. 2011లో టీటీడీ డిప్యూటీ ఈవో భూపతి రెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. 15 ఏళ్ల తర్వాత టీటీడీ ఉద్యోగి నివాసంలో ఏసీబీ తనిఖీలు చేపట్టింది.
తాజావార్తలు
-
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
-
Panja Re Release: 15 ఏళ్ల తర్వాత కూడా తగ్గని పవన్ కళ్యాణ్ క్రేజ్.. ‘పంజా’ రీ రిలీజ్కు అదిరిపోయే ఓపెనింగ్స్!
-
Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్తో రోజంతా సాఫ్ట్గా!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
BCCI Selection Rule: బీసీసీఐ కీలక మార్పు.. ఇకపై 100 కాదు 200 శాతం.. టీమిండియా ఆటగాళ్లకు చుక్కలే!
ట్రెండింగ్
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!