Tiger Tension: పులి పేరు ఎత్తితేనే హడలిపోతున్నారు.. రైతులు, స్థానికుల్లో ఆందోళన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tiger Tension: పులి పేరు ఎత్తితే చాలు పరుగులు పెడుతున్నారు ఏలూరు జిల్లాలోని పలు మండలాల ప్రజలు. గతంలో ఎప్పుడూ చూడని విధంగా పంట పొలాల్లో పులి అడుగు జాడలు కనిపించడంతో హడలెత్తిపోతున్నారు అక్కడి రైతులు, కూలీలు. ప్రశాంతమైన ప్రాంతంలో పులి పాదముద్రల జాడ బయటపడటంతో భయం గుప్పిట్లోకి వెళ్లిపోయారు అక్కడి ప్రజలు.. ఎప్పుడు ఎం జరుగుతుందుందో అనే ఆందోళణ అక్కడి జనంలో కనిపిస్తోంది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదుగాని ఏలూరు జిల్లా వాసులను పెద్దపులి ఇప్పుడు హడలెత్తిస్తోంది.
Read Also: Gedela Srinubabu: ప్రజాస్వామ్య పరిరక్షణకు యువతే కీలకం..
Also Read
- AP Heatwave Alert: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
- Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
- TG Bharath vs Byreddy Siddharth Reddy: బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై మంత్రి టీజీ భరత్ క్రిమినల్ పరువునష్టం దావా
- PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
పంటపొలాల్లో పనులు చేసుకునే కూలీలు పాదముద్రలు చూసి మొదట అనుమాన పడ్డారు. విషయం ఆనోట ఈనోట పాకడంతో మరింత అప్రమత్తమయ్యారు రైతులు. ఏలూరు జిల్లా దెందులూరు మండలం మేధినరావు పాలెంలో తాజాగా వెలుగు చూసిన పులిపాద ముద్రలు అక్కడి ప్రజలను హడలెత్తిపోయేలా చేస్తున్నాయి. రెండురోజుల క్రితం ద్వారకాతిరుమల మండలంలో అలజడి సృష్టించిన పులి పాదముద్రలు ఇప్పుడు దెందులూరు మండలం చేరుకున్నాయి. మూడు నాలుగు రోజుల క్రితం బుట్టాయగూడెం, నల్లజర్ల, ద్వారకాతిరుమల మండలాల్లో పులి సంచరించినట్టు అక్కడి ఆనవాళ్లు స్పష్టం చేస్తున్నాయి. ఒక ప్రాంతంలో ఆవును సైతం పులి తినేసింది. తాజాగా శనివారం ఉదయం దెందులూరు మండలంలోని పెరుగుగూడెం, మేదినరావుపాలెం గ్రామంలోని మొక్కజొన్న తోటలో పులిపాదముద్రలు తీవ్ర కలకలం రేపాయి. అదే రోజు ఉదయం పొలానికి నీరు పెట్టి తర్వాతి రోజు వచ్చి చూసిన రైతులకు పులి అడుగులు కనిపించడంతో అక్కడ పులి ఉందని ఫిక్సయ్యారు రైతులు. దీంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు పులి సంచరించిన ప్రాంతానికి చేరుకుని వివరాలు సేకరించడంతోపాటు పాదముద్రలను సేకరించారు.
Read Also: Uttar Pradesh: పెళ్లి ఆగిపోయిందని.. అమ్మాయి తల్లి, సోదరుడిని హత్య చేసిన వ్యక్తి..
సాదారణంగా 13 సెంటీమీటర్ల కంటే ఎక్కువ పొడవున్న పాదముద్రలు కనిపిస్తే అవి పులివిగా గుర్తిస్తారు. కానీ, ఇక్కడి పంటపొలాల్లో 18 సెంటీ మీటర్లు ఉన్న పాదముద్రలు సైతం కనిపిస్తున్నాయి. దీనిని బట్టి చూస్తే ఇక్కడ సంచరించేది మగ పులి అయిఉండొచ్చనేది కొందరి వాదన. ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులు దృవీకరించాల్సి ఉంది. పెద్ద పులి పాదముద్రలు ఉన్నప్పటికీ.. దానిని నేరుగా చూసిన వారు ఎవరు లేకపోవడంతో మరిన్ని ఆధారాలు సేకరించే పనిలో అటవీశాఖ అధికారులున్నారు. పెద్దపులి సంచారం కన్ఫామ్ అయితే అక్కడ బోను ఏర్పాటు చేసి దాన్ని బంధించేందుకు చర్యలు తీసుకోనున్నారు. అప్పటి వరకు ఆప్రాంత రైతులకు కూలీలకు పెద్దపులి భయం తప్పేలా లేదు..
తాజావార్తలు
-
Rajasthan Royals Record: రాజస్థాన్ రాయల్స్ నయా రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే మొదటి జట్టుగా ఆర్ఆర్!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ విధ్వంసం.. ఒక్క ఇన్నింగ్స్తో ఐపీఎల్ చరిత్రనే తిరగరాసిన బుడ్డోడు..
-
AP Heatwave Alert: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు..
-
Rishabh Pant: మేం తోపులం, కానీ కలిసిరాలేదు.. రిషభ్ పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
God of War Confirmed: ఎన్టీఆర్ ఫ్యాన్స్కి డబుల్ ట్రీట్..నాగవంశీ సాలిడ్ హింట్!
ట్రెండింగ్
-
Google I/O 2026: AIలో Google దూకుడు.. కొత్త Gemini 3.5 Flash నుంచి AI చిప్స్ వరకు భారీ ప్రకటనలు.!
-
PCOS గురించి ఈ నిజాలు తెలుసా..? వైద్యులు చెబుతున్న కీలక విషయాలు ఇవే.!
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?