Tragedy : సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు సమీపంలోని తెల్లాపూర్ మున్సిపాలిటీలో విషాద ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ మూడు అంతస్తుల భవనం పై నుండి ప్రమాదవశాత్తు కిందపడిన మూడేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని విలిమల ప్రాంతంలో ఓ నిర్మాణ కార్యక్రమం కొనసాగుతోంది. మధ్యప్రదేశ్కు చెందిన రూప్ సింగ్ అనే మేస్త్రీ, అతని భార్య కార్మికురాలిగా అక్కడే పని చేస్తున్నారు. వారి మూడేళ్ల కొడుకు అక్కడే ఆడుకుంటుండగా, అప్రమత్తత లేకపోవడంతో మూడు అంతస్తుల భవనం పై నుండి కిందపడిపోయాడు.
Mollywood : స్టార్ హీరో ఉన్ని ముకుందన్పై..మేనేజర్ పోలీసు కేస్
ప్రమాదానికి ముఖ్యమైన కారణం భవన నిర్మాణంలో తగిన రక్షణ చర్యలు లేకపోవడమే. మూడు అంతస్తుల భవనానికి సరైన రెయిలింగ్ లేకపోవడం వల్ల బాలుడు కింద పడిపోయినట్టు తెలుస్తోంది. తీవ్ర గాయాలవల్ల చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఇలాంటి ఘటనలు భవన నిర్మాణాల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడాన్ని సూచిస్తున్నాయి. పనిచేస్తున్న కార్మికుల పిల్లల భద్రతపై సంబంధిత అధికారులు, నిర్మాణ సంస్థలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఒక చిన్నారి అమూల్యమైన ప్రాణం కోల్పోవడం లోపభూయిష్ట వ్యవస్థను చూపుతోంది. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అదే సమయంలో, నిర్మాణ కంపెనీపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.