US: టెక్సాస్లో ఘోర రోడ్డు ప్రమాదం.. భారతీయ సంతతికి చెందిన ముగ్గురు మృతి
- అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం
- భారతీయ సంతతికి చెందిన ముగ్గురు కుటుంబ సభ్యులు మృతి ఒంటరి వాడైన కుమారుడు అడ్రియన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో భారతీయ సంతతికి చెందిన ముగ్గురు కుటుంబ సభ్యులు మృతి చెందారు. ఈ ఘటన టెక్సాస్లోని లంపాసాస్ కౌంటీలో జరిగింది. రోడ్డు ప్రమాదంలో 45 ఏళ్ల అరవింద్ మణి, అతని భార్య 40 ఏళ్ల ప్రదీపా అరవింద్, 17 ఏళ్ల కుమార్తె ఆండ్రిల్ అరవింద్ మరణించినట్లు సమాచారం. అరవింద్ మణి కుటుంబం లియాండర్లో నివసిస్తున్నారు. అయితే.. ఇప్పుడు ఆ కుటుంబంలో ఒక్కరే మిగిలారు. ప్రమాదం జరిగిన సమయంలో అరవింద్ మణి 14 ఏళ్ల కుమారుడు అడ్రియన్ కారులో లేడని సమాచారం.
Rishabh Pant: రిషబ్ పంత్లో ఈ కళ కూడా ఉందా.. వీడియో వైరల్
Also Read
- Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
- Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
- Tilak Varma Gesture: రోహిత్ కోసం తిలక్ వర్మ '45' స్పెషల్ గెస్టర్.. వీడియో వైరల్
- Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
U.S. రూట్ 281లో కారు ప్రయాణిస్తోందని టెక్సాస్ భద్రతా అధికారులు తెలిపారు. ఈ కారును డ్రైవర్ జాసింటో కోవ్ నడుపుతున్నాడు. వారు కారులో ప్రయాణిస్తున్న సమయంలో.. ప్రమాదవశాత్తు కారు వెనుక టైరు పగిలింది. దీంతో కారు అదుపు తప్పి మరో రెండు వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు కాగా.. మృతి చెందారు. కారులో అరవింద్ మణి, అతని భార్య, కుమార్తెను ఉత్తర టెక్సాస్లోని కళాశాలకు తీసుకువెళుతుండగా ప్రమాదం జరిగింది. అయితే అదృవశాత్తు తల్లిదండ్రులు తమ కొడుకును ఇంటి వద్ద వదిలిపెట్టారు. దీంతో.. అతను ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అయితే.. ఈ ప్రమాదంలో కుటుంబ సభ్యులను కోల్పోవడంతో తీవ్రంగా రోదిస్తున్నాడు. మరోవైపు… ప్రమాద ఘటనపై పబ్లిక్ సేఫ్టీ ఆఫీసర్ ట్రూపర్ బ్రియాన్ వాష్కో మాట్లాడుతూ.. “నా 26 ఏళ్ల కెరీర్లో ఇంతటి ఘోరమైన ప్రమాదాన్ని చూడటం ఇదే తొలిసారి” అని అన్నారు.
Komatireddy Venkat Reddy : మునిగిపోయిన పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు..
ఈ ప్రమాదంపై రూస్ స్కూల్ ప్రిన్సిపాల్ విచారం వ్యక్తం చేశారు. అతను ఒక లేఖ వ్రాశాడు. ‘మా విద్యార్థి ఆండ్రిల్ అరవింద్ మరణించారని తెలియజేయడానికి నేను చాలా బాధపడ్డాను. ఆండ్రిల్ మరియు అతని తల్లిదండ్రులు ఈ ఉదయం రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ వార్తతో మేము చాలా బాధపడ్డాము. మా ఆలోచనలు ఆండ్రిల్ కుటుంబంతో ఉన్నాయి. కుటుంబంలో జీవించి ఉన్న ఏకైక సభ్యుడు అడ్రియన్కు సహాయం చేయడానికి $758,000 కంటే ఎక్కువ సేకరించాం’ అని తెలిపారు.
తాజావార్తలు
-
Slumdog – 33 Temple Road: పూరి జగన్నాథ్ ‘స్లమ్డాగ్’ నుంచి సాలిడ్ అప్డేట్..
-
Cricket Record: గల్లీ క్రికెట్లో కూడా ఇన్ని పరుగులు రావు కదయ్యా.. 50 ఓవర్లలో 822 పరుగులు, 794 పరుగుల తేడాతో విజయం..!
-
Nokia: నోకియా అత్యంత చౌకైన 5G ఫోన్ వచ్చేస్తోంది.. 6000mAh బ్యాటరీ, 6.67-అంగుళాల HD+ డిస్ప్లే
-
Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
-
RAPO23 : కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత : రామ్ పోతినేని
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!