Taxes : మీ జేబులు ఖాళీ చేసే పన్నులు నేటి నుంచి ఏవేవి అమలవుతున్నాయో తెలుసా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Taxes : ప్రతినెల పన్నుల విషయంలో కొన్ని మార్పుల ఉంటాయి. అలానే ఈ రోజు నుంచి కొన్ని పన్నుల్లో మార్పులు చేర్పులు ఉన్నాయి. అవి నేరుగా మీ జేబుకు చిల్లుపెడుతుంటాయి, అందుకే వాటి గురించి తప్పనిసరిగా తెలుసుకుని అప్రమత్తంగా ఉండాలి. మే 1 నుంచి పన్నుల్లో చాలా మార్పులు రాబోతున్నాయి. జీఎస్టీ, సీఎన్జీ, గ్యాస్ సిలిండర్లు, మ్యూచువల్ ఫండ్స్తో సహా అనేక నియమాల్లో మార్పులు ఉంటాయి. బ్యాటరీతో నడిచే వాహనాలకు సంబంధించిన నిబంధనలలో కూడా కొన్ని మార్పులు వచ్చాయి.
జీఎస్టీకి సంబంధించిన రూల్స్లో కొత్తగా వచ్చిన మార్పులను పారిశ్రామికవేత్తలు పాటించాలి. ఏదైనా లావాదేవీకి సంబంధించిన రసీదును ఏడు రోజుల్లోగా ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్లో అప్లోడ్ చేయాలి. ఈ కొత్త నిబంధన మే 1 నుంచి అమల్లోకి రానుంది. రూ.100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలకు ఈ నిబంధన వర్తిస్తుంది. సీఎన్జీ ధరలు ప్రతి నెల మొదటి రోజు లేదా మొదటి వారంలో మారుతాయి. పెట్రోలియం కంపెనీలు నెల మొదటి వారంలో గ్యాస్ ధరలను మారుస్తాయి. ఏప్రిల్లో ముంబై, ఢిల్లీలో సీఎన్జీ, పీఎన్జీ ధరలు తగ్గాయి. ఈ నేపథ్యంలో మే 1న కూడా సీఎన్జీ, పీఎన్జీ ధరల్లో మార్పు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
Also Read
- CM Vijay vs DMK: సీఎం విజయ్-త్రిషపై అనుచిత వ్యాఖ్యలు.. మాజీ మంత్రి అరెస్ట్..
- Indian Govt: ఇక నుంచి ఆ యాప్స్ పని చేయవు.. ఈ రెండు యాప్స్పై బ్యాన్ విధించిన కేంద్రం..
- India Real Estate: రియల్ ఎస్టేట్ మార్కెట్కు బంపర్ బూస్ట్.. 2026 తొలి అర్ధభాగంలో భారీ పెట్టుబడులు..
- Ravi Shastri: "చాలా పెద్ద తప్పు చేస్తున్నారు".. టీమిండియా మేనేజ్మెంట్పై రవిశాస్త్రి ఫైర్!
Read Also: PM Modi’s Roadshow: కర్ణాటక రోడ్ షోలో ప్రధాని పైకి మొబైల్ ఫోన్ విసిరిన మహిళ..
మార్కెట్ రెగ్యులేటర్ సెబీ మ్యూచువల్ ఫండ్స్ నిబంధనలను మార్చింది. దీని ప్రకారం, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి ఉపయోగించే డిజిటల్ వాలెట్ RBI KYC పొందాలి. ఈ నియమం మే 1, 2023 నుండి అమలులోకి వస్తుంది. అలాగే, మే 1 నుంచి బ్యాటరీతో నడిచే టూరిస్ట్ వాహనాల నుంచి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి లైసెన్స్ రుసుమును వసూలు చేయదు.
మే 1 నుండి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎంబీ) ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకుండా లావాదేవీని నిలిపివేస్తే, రూ. 10 + GST జరిమానా విధించబడుతుంది. అలాగే, ఖాతాలో అవసరమైన బ్యాలెన్స్ ఉన్నప్పటికీ ఏటీఎం లావాదేవీ విఫలమైతే సమస్యను పరిష్కరించడానికి పీఎంబీ మార్గదర్శకాలను రూపొందించింది. ఏటీఎం లావాదేవీ వైఫల్యం గురించి కస్టమర్ ఫిర్యాదు చేస్తే, ఫిర్యాదు స్వీకరించిన వారం రోజుల్లో బ్యాంక్ సమస్యను పరిష్కరిస్తుంది. నెల రోజుల్లో సమస్యను పరిష్కరించడంలో బ్యాంకు విఫలమైతే, కస్టమర్ నుండి రోజుకు రూ.100 వసూలు చేస్తారు. వారికి రేటు ప్రకారం పరిహారం చెల్లిస్తామని బ్యాంకు తెలిపింది.
Read Also: Monday Bhakthi Tv Lord Shiva Pooja: సోమవారం ఈ పూజలు చేస్తే సకల పాపాల నుంచి విముక్తి
తాజావార్తలు
-
IND vs ENG 2nd T20: సంజును తొలగించకుండా, వైభవ్కు అవకాశం ఇవ్వాలంటే.. ఇదొక్కటే మార్గం!
-
CM Vijay vs DMK: సీఎం విజయ్-త్రిషపై అనుచిత వ్యాఖ్యలు.. మాజీ మంత్రి అరెస్ట్..
-
iQOO Z11i: ఐకూ Z11i విడుదల.. 6500mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లే, Snapdragon 4 Gen 2
-
Indian Govt: ఇక నుంచి ఆ యాప్స్ పని చేయవు.. ఈ రెండు యాప్స్పై బ్యాన్ విధించిన కేంద్రం..
-
India Real Estate: రియల్ ఎస్టేట్ మార్కెట్కు బంపర్ బూస్ట్.. 2026 తొలి అర్ధభాగంలో భారీ పెట్టుబడులు..
ట్రెండింగ్
-
IND vs ENG 2nd T20: సంజు అవుట్, వైభవ్ ఇన్.. రెండో టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!