Taxes : మీ జేబులు ఖాళీ చేసే పన్నులు నేటి నుంచి ఏవేవి అమలవుతున్నాయో తెలుసా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Taxes : ప్రతినెల పన్నుల విషయంలో కొన్ని మార్పుల ఉంటాయి. అలానే ఈ రోజు నుంచి కొన్ని పన్నుల్లో మార్పులు చేర్పులు ఉన్నాయి. అవి నేరుగా మీ జేబుకు చిల్లుపెడుతుంటాయి, అందుకే వాటి గురించి తప్పనిసరిగా తెలుసుకుని అప్రమత్తంగా ఉండాలి. మే 1 నుంచి పన్నుల్లో చాలా మార్పులు రాబోతున్నాయి. జీఎస్టీ, సీఎన్జీ, గ్యాస్ సిలిండర్లు, మ్యూచువల్ ఫండ్స్తో సహా అనేక నియమాల్లో మార్పులు ఉంటాయి. బ్యాటరీతో నడిచే వాహనాలకు సంబంధించిన నిబంధనలలో కూడా కొన్ని మార్పులు వచ్చాయి.
జీఎస్టీకి సంబంధించిన రూల్స్లో కొత్తగా వచ్చిన మార్పులను పారిశ్రామికవేత్తలు పాటించాలి. ఏదైనా లావాదేవీకి సంబంధించిన రసీదును ఏడు రోజుల్లోగా ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్లో అప్లోడ్ చేయాలి. ఈ కొత్త నిబంధన మే 1 నుంచి అమల్లోకి రానుంది. రూ.100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న కంపెనీలకు ఈ నిబంధన వర్తిస్తుంది. సీఎన్జీ ధరలు ప్రతి నెల మొదటి రోజు లేదా మొదటి వారంలో మారుతాయి. పెట్రోలియం కంపెనీలు నెల మొదటి వారంలో గ్యాస్ ధరలను మారుస్తాయి. ఏప్రిల్లో ముంబై, ఢిల్లీలో సీఎన్జీ, పీఎన్జీ ధరలు తగ్గాయి. ఈ నేపథ్యంలో మే 1న కూడా సీఎన్జీ, పీఎన్జీ ధరల్లో మార్పు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
Also Read
- England Team: ఇంగ్లాండ్ జట్టు తదుపరి కెప్టెన్ ఎవరు..? కెప్టెన్సీ రేసులో సీనియర్ బ్యాటర్..
- PM Modi: ఇన్స్టాగ్రామ్ వాడండి, యూత్కు దగ్గరకండి.. మంత్రులకు మోడీ క్లాస్..
- Price Change: 200MP కెమెరా, 6510mAh బ్యాటరీ, 16GB RAM గల Vivo ఫోన్.. ధరలో మార్పులు..
- CJP Protest: జంతర్ మంతర్ వద్ద సంచలనం.. పోలీస్ కానిస్టేబుల్ రాజీనామా..
Read Also: PM Modi’s Roadshow: కర్ణాటక రోడ్ షోలో ప్రధాని పైకి మొబైల్ ఫోన్ విసిరిన మహిళ..
మార్కెట్ రెగ్యులేటర్ సెబీ మ్యూచువల్ ఫండ్స్ నిబంధనలను మార్చింది. దీని ప్రకారం, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడానికి ఉపయోగించే డిజిటల్ వాలెట్ RBI KYC పొందాలి. ఈ నియమం మే 1, 2023 నుండి అమలులోకి వస్తుంది. అలాగే, మే 1 నుంచి బ్యాటరీతో నడిచే టూరిస్ట్ వాహనాల నుంచి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి లైసెన్స్ రుసుమును వసూలు చేయదు.
మే 1 నుండి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎంబీ) ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకుండా లావాదేవీని నిలిపివేస్తే, రూ. 10 + GST జరిమానా విధించబడుతుంది. అలాగే, ఖాతాలో అవసరమైన బ్యాలెన్స్ ఉన్నప్పటికీ ఏటీఎం లావాదేవీ విఫలమైతే సమస్యను పరిష్కరించడానికి పీఎంబీ మార్గదర్శకాలను రూపొందించింది. ఏటీఎం లావాదేవీ వైఫల్యం గురించి కస్టమర్ ఫిర్యాదు చేస్తే, ఫిర్యాదు స్వీకరించిన వారం రోజుల్లో బ్యాంక్ సమస్యను పరిష్కరిస్తుంది. నెల రోజుల్లో సమస్యను పరిష్కరించడంలో బ్యాంకు విఫలమైతే, కస్టమర్ నుండి రోజుకు రూ.100 వసూలు చేస్తారు. వారికి రేటు ప్రకారం పరిహారం చెల్లిస్తామని బ్యాంకు తెలిపింది.
Read Also: Monday Bhakthi Tv Lord Shiva Pooja: సోమవారం ఈ పూజలు చేస్తే సకల పాపాల నుంచి విముక్తి
తాజావార్తలు
-
England Team: ఇంగ్లాండ్ జట్టు తదుపరి కెప్టెన్ ఎవరు..? కెప్టెన్సీ రేసులో సీనియర్ బ్యాటర్..
-
PM Modi: ఇన్స్టాగ్రామ్ వాడండి, యూత్కు దగ్గరకండి.. మంత్రులకు మోడీ క్లాస్..
-
Bhatti Vikramarka : సింగరేణి బ్లాకులు ప్రైవేట్ పరమైతే తీవ్ర ప్రమాదం
-
Nara Rohith: ‘కపాలి’తో సర్ప్రైజ్ ఇచ్చిన నారా రోహిత్.. పోస్టర్తోనే హైప్!
-
Price Change: 200MP కెమెరా, 6510mAh బ్యాటరీ, 16GB RAM గల Vivo ఫోన్.. ధరలో మార్పులు..
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!