Top Donors in India: భారత్ లోని టాప్ డోనర్స్ వీరే.. జాబితాలో 191 మంది దాతలు
- భారత్ లోని టాప్ డోనర్స్ వీరే
- జాబితాలో 191 మంది దాతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో కోటీశ్వరులకు కొదవ లేదు. ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి బిలియనీర్స్ ఉన్నారు. వారు ఎదుగుతూ సమాజ సేవలో పాలుపంచుకుంటున్నారు. పేద ప్రజలను ఆదుకునేందుకు ముందువరుసలో ఉంటున్నారు. సమాజానికి కోట్ల రూపాయల విరాళాలు ఇస్తూ తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో భారత్ లో టాప్ డోనర్స్ జాబితాను హురున్ ఇండియా రిలీజ్ చేసింది. 2025 హురున్ ఇండియా దాతృత్వ జాబితాలో 191 మంది దాతలు ఉన్నారు. వీరిలో 12 మంది కొత్తగా ప్రవేశించారు. శివ్ నాడార్ & కుటుంబం రూ. 2,708 కోట్ల విరాళంతో అగ్రస్థానంలో ఉన్నారు. తరువాత ముఖేష్ అంబానీ & కుటుంబం (రూ. 626 కోట్లు), బజాజ్ కుటుంబం (రూ. 446 కోట్లు), కుమార్ మంగళం బిర్లా & కుటుంబం (రూ. 440 కోట్లు), గౌతమ్ అదానీ & కుటుంబం (రూ.386 కోట్లు) ఉన్నారు. నందన్ నీలేకని రూ. 365 కోట్లు విరాళంగా ఇవ్వగా, హిందూజా కుటుంబం రూ. 298 కోట్లు విరాళంగా ఇచ్చారు.
Also Read:H-1B Visa: అమెరికా వద్దంటుందా..? మేమున్నాం అంటూ కెనడా ఆహ్వానం..
Also Read
- Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Off The Record: జగన్కు బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం.. కారణం ఇదేనా...!
- Pawan Kalyan Ayurvedic Treatment: కుడి భుజానికి ప్రత్యేక ఆయుర్వేద థెరపీ.. కేరళం చేరుకున్న పవన్ కల్యాణ్..
శివ్ నాడార్, అతని కుటుంబం ఐదు సంవత్సరాలలో నాలుగోసారి ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచారు. 2025లో రూ. 2,708 కోట్ల విరాళం ఇచ్చారు. అంటే రోజుకు సగటున రూ. 7.4 కోట్లు విరాళంగా ఇచ్చారు. ఇది గత సంవత్సరం కంటే 26% ఎక్కువ. ఈ నిధులలో ఎక్కువ భాగం విద్య, కళలు, సంస్కృతిని ప్రోత్సహించే శివ్ నాడార్ ఫౌండేషన్ నుంచి వచ్చాయి.
Also Read:Bihar Elections 2025: బీహార్లో ప్రశాంతంగా ముగిసిన తొలిదశ ఎన్నికల పోలింగ్..
టాప్ 10 దాతల నుంచి వచ్చిన విరాళాలు కలిపి రూ.5,834 కోట్లు. ముఖేష్ అంబానీ, అతని కుటుంబం రూ.626 కోట్ల విరాళాలతో రెండవ స్థానంలో నిలిచారు. ఇది గత సంవత్సరం కంటే 54% ఎక్కువ. వారి విరాళాలు ప్రధానంగా ఆరోగ్య సంరక్షణ, విద్య, రూరల్ ట్రాన్స్ ఫార్మేషన్ కు మద్దతు ఇచ్చే రిలయన్స్ ఫౌండేషన్కు కేటాయించబడ్డాయి. జమ్నాలాల్ బజాజ్ ట్రస్ట్, ఇతర కార్యక్రమాల ద్వారా గ్రామీణాభివృద్ధికి రూ.446 కోట్ల విరాళంతో బజాజ్ కుటుంబం మూడవ స్థానంలో ఉంది. కుమార్ మంగళం బిర్లా, అతని కుటుంబం రూ.440 కోట్లతో నాల్గవ స్థానంలో, గౌతమ్ అదానీ, అతని కుటుంబం రూ.386 కోట్లతో ఐదవ స్థానంలో నిలిచాయి.
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!