NTV Telugu Site icon

Breaking: కామారెడ్డిలో హై టెన్షన్.. పోలీసులపై రాళ్లు, సీఐ తలకు గాయం

Kamareddy

Kamareddy

కామారెడ్డి జిల్లా కేంద్రంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. జీవదాన్ స్కూల్ పై విద్యార్థి సంఘాలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో.. ఆందోళనకారులు పోలీసుల పై రాళ్ళు రువ్వారు. దీంతో.. పట్టణ సీఐ తలకు గాయాలు అయ్యాయి. వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు.. తోపులాటలో హెడ్ కానిస్టేబుల్ కాలు విరిగింది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. ఈ క్రమంలో.. పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి నాయకులకు గాయాలయ్యాయి.

Read Also: Amaravati: రాజధానిలో తొలి భూ కేటాయింపు చేసిన కూటమి ప్రభుత్వం

ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న జిల్లా ఎస్పీ సింధు శర్మ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ పరిస్థితులను పరిశీలించారు. అయితే.. ఆరేళ్ల బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన పీఈటి నాగరాజును కఠినంగా శిక్షించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో.. స్కూల్ గుర్తింపు రద్దు కోరుతూ ముట్టడించారు. ఉదయం నుంచి ఐదు గంటలుగా కామారెడ్డిలో ఆందోళన కొనసాగుతుంది.

Read Also: Hyderabad: హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం.. పలు చోట్ల భారీ వర్షం