Robbery in Train: హుబ్లీ-విజయవాడ ప్యాసింజర్ రైలులో భారీ చోరీ
- హుబ్లీ-విజయవాడ ప్యాసింజర్ రైలులో భారీ చోరీ
- రూ.3 కోట్ల విలువైన మూడున్నర కేజీల బంగారం..రూ 50 వేల నగదు అపహరణ
Robbery in Train: నంద్యాల జిల్లాలో హుబ్లీ-విజయవాడ ప్యాసింజర్ రైలులో భారీ చోరీ జరిగింది. రూ.3 కోట్ల విలువైన మూడున్నర కేజీల బంగారం, రూ 50 వేల నగదు అపహరణకు గురైంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బళ్లారి , హోస్పేట్ ప్రాంతాల్లో బంగారు ఆభరణాలను అమ్మడానికి పల్నాడు జిల్లా సత్తెనపల్లె వ్యాపారులు రంగారావు , సతీష్ కుమార్ వెళ్లారు. తిరుగు ప్రయాణంలో హుబ్లీ-విజయవాడ ప్యాసింజర్ రైలులో నరసరావుపేటకు రంగారావు , సతీష్ కుమార్ బయలుదేరారు. మూడున్నర కిలోల బంగారు ఆభరణాలు, రూ 50 వేల నగదును బ్యాగ్లో పెట్టుకున్నారు. ఏసీ కోచ్లో వారిద్దరు నిద్రపోయారు. తెల్లవారుజామున 4 గంటలకు బ్యాగ్ ఉన్నట్లు నంద్యాలలో చూసుకున్నారు. రైలు దొనకొండ చేరేసరికి బంగారం, నగదు ఉన్న బ్యాగ్ మాయమైంది. నంద్యాల-గిద్దలూరు మధ్య బ్యాగ్ను ఆగంతకులు అపహరించారు. ఫోన్ ద్వారా నంద్యాల రైల్వే పీఎస్కు రంగారావు ఫిర్యాదు చేశారు. పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.
Read Also: Sajjala Ramakrishna Reddy: సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై సజ్జల కౌంటర్
Also Read
తాజావార్తలు
-
MLC Jayamangala Venkataramana: ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ రాజీనామా తిరస్కరణ..
-
Donald Trump: కనిపించిన వెంటనే కాల్చిపారేయండి.. హార్ముజ్పై ట్రంప్ సంచలన ఆదేశాలు..
-
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్లో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై చర్చ.. రేపు కీలక భేటీ..
-
Telangana Govt: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం.. ఏప్రిల్ 26న రాష్ట్ర పండుగ..
-
Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!