Draupadi Murmu: కౌన్సిలర్ టూ రాష్ట్రపతి.. దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన గిరిజన మహిళ చరిత్ర..!
- రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు 67 సంవత్సరాలు
- ఆమె 1958లో ఒడిశాలో జన్మించారు
- శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ, ఖర్గే
- రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చరిత్ర తెలుసుకుందాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు 67 సంవత్సరాలు. ఆమె 1958లో ఇదే రోజున జన్మించారు. ముర్ము పుట్టిన రోజు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సహా పలువురు నాయకులు రాష్ట్రపతికి శుభాకాంక్షలు తెలిపారు. అధ్యక్షురాలు ముర్ము ఉత్తరాఖండ్లోని రాజ్పూర్ రోడ్డులో నిర్మించిన రాష్ట్రపతి నికేతన్లో తన పుట్టినరోజును జరుపుకుంటారు.ఈ సమయంలో ఆమె ఇక్కడి ప్రజలకు ఒక ప్రత్యేక బహుమతిని కూడా ఇవ్వనున్నారు. తన బర్త్డే సందర్భంగా ఆధునిక పబ్లిక్ పార్కుకు పునాది వేయనున్నారు. ఈ పార్క్ను 132 ఎకరాల్లో నిర్మిస్తున్నారు.
READ MORE: DCCB Director Kidnap: నిర్మల్ డీసీసీబీ డైరెక్టర్ కిడ్నాప్.. ఆరుగురు అరెస్ట్
Also Read
- Gill Century Celebration: శుభ్మన్ గిల్ సెంచరీ.! ఆనందంతో తండ్రి స్టేడియంలోనే.. వీడియో వైరల్
- GT vs RR: గిల్ విధ్వంసం.. సుదర్శన్ సునామీ! ఐపీఎల్లో సరికొత్త రికార్డులు..
- Amaravati Land Allocation: అమరావతిలో 114 సంస్థలకు 1,269 ఎకరాలు కేటాయింపు..
- Riyan Parag: ఆ ఒక్కటే మా ఓటమిని శాసించింది.. రాజస్థాన్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు.!
వాస్తవానికి.. దేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పీఠాన్ని అగ్రవర్ణాలు, ముస్లింలు, దళితులు అధిరోహించినా.. ఇప్పటి వరకు ఎస్టీలకు మాత్రం ఆ అవకాశం దక్కలేదు. స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్లకు అది సాధ్యమైంది. చరిత్రలో తొలిసారి అత్యున్నత పీఠంపై ఆదివాసీ మహిళ ఆసీన్నులయ్యారు. ముర్ము ప్రారంభ జీవితం కష్టాలు, పోరాటాలతో నిండిపోయింది. ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న ఆమె చివరకు దేశ అత్యున్నత స్థాయికి ఎదిగారు. ద్రౌపదీ ముర్ము ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా బైదపోసిలో 1958 జూన్ 20న జన్మించారు. భువనేశ్వర్లోని రమాదేవి మహిళా కళాశాలలో బీఏ పూర్తి చేసిన ఆమె.. ఆ తర్వాత నీటిపారుదల శాఖలో జూనియర్ అసిస్టెంట్గా (1973-1983 మధ్యకాలంలో).. రాయ్రంగపూర్లో శ్రీ అరబిందో ఇంటెగ్రల్ ఎడ్యుకేషన్ సెంటర్లో ఉపాధ్యాయురాలిగా (1994-1997) పనిచేశారు. భారత రాష్ట్రపతులందరిలో అతి పిన్న వయస్కురాలు (64 ఏళ్లు) ఈమే కావడం విశేషం.
READ MORE: India vs England: సాయి సుదర్శన్ అరంగ్రేటం.. మొదట బ్యాటింగ్ చేయనున్న భారత్..!
గతంలో ఈ రికార్డు నీలం సంజీవ రెడ్డి (67 ఏళ్లు) పేరిట ఉండగా.. అనంతరం 64 ఏళ్ల ముర్ము దక్కించుకున్నారు. 1997లో బీజేపీలో చేరిన ఆమె రాయ్రంగపుర్ కౌన్సిలర్గా, వైస్ఛైర్మన్గా ఎన్నికయ్యారు. 2000 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2000-2002 మధ్య ఒడిశా రవాణా, వాణిజ్యశాఖ మంత్రిగా పనిచేశారు. 2004లో రాయ్రంగ్పుర్ ఎమ్మెల్యేగా రెండోసారి ఎన్నికయ్యారు. 2002 నుంచి 2015 వరకు మయూర్భంజ్ జిల్లా బీజేపీ అధ్యక్షురాలిగా, ఒడిశా ఎస్టీ మోర్చా అధ్యక్షురాలుగా, పనిచేశారు. 2015లో ఝార్ఖండ్ గవర్నర్గా నియమితులయ్యారు. 2022లో నిర్వహించిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఆమెను ఎన్డీయే బరిలో దించింది. ఆమె విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై భారీ విజయం సాధించారు.
తాజావార్తలు
-
Gill Century Celebration: శుభ్మన్ గిల్ సెంచరీ.! ఆనందంతో తండ్రి స్టేడియంలోనే.. వీడియో వైరల్
-
GT vs RR: గిల్ విధ్వంసం.. సుదర్శన్ సునామీ! ఐపీఎల్లో సరికొత్త రికార్డులు..
-
Sai Sudarshan: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వింత రికార్డు.. కెరీర్లో మూడోసారి విచిత్రంగా అవుటైన సాయి సుదర్శన్..
-
Amaravati Land Allocation: అమరావతిలో 114 సంస్థలకు 1,269 ఎకరాలు కేటాయింపు..
-
Riyan Parag: ఆ ఒక్కటే మా ఓటమిని శాసించింది.. రాజస్థాన్ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు.!
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..