Rajasthan:సైనికుడిని స్టేషన్లో బట్టలు విప్పి కొట్టిన పోలీసులు.. మంత్రి ఫైర్
- రాజస్థాన్ లో పోలీసుల అత్యుత్సాహం
- ఆర్మీ జవాన్తో అనుచితంగా ప్రవర్తించిన వైనం
- స్టేషన్ లో బట్టలు విప్పిమరీ కొట్టిన పోలీసులు
- కేబినెట్ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ సీరియస్
- చర్యలు తీసుంటామని హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్ లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. జైపూర్లోని షిప్రాపత్ పోలీస్ స్టేషన్లో ఆర్మీ జవాన్తో అనుచితంగా ప్రవర్తించారు. దీంతో క్యాబినెట్ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఈ సంఘటనపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. పోలీసు స్టేషన్ సిబ్బందిని మందలించారు. పోలీసులు చట్టాన్ని అడ్డుపెట్టుకుని అనుచితంగా ప్రవర్తిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పోలీసు శాఖ ప్రతిష్టను దిగజార్చాయన్నారు. స్టేషన్ కు చేరుకుని పోలీసులను హెచ్చరించారు.
READ MORE: AP CM Chandrababu: స్కూల్ వ్యాన్ల ఫిట్ నెస్ పరీక్షలకు సీఎం చంద్రబాబు ఆదేశం
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
అసలేం జరిగిందంటే.. జమ్మూ కాశ్మీర్లో కమాండోగా నియమించబడిన అరవింద్ సింగ్ రాజ్పుత్ తనకు తెలిసిన వారి కేసుకు సంబంధించి నగరంలోని షిప్రాపత్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. అక్కడ ఆయనపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. బట్టలు సైతం తొలగించారని బాధితుడు ఆరోపించారు. బాధిత సైనికుడు వీడియో కూడా బయటకు వచ్చింది. వీడియోలో సైనికుడు మాట్లాడుతూ.. “నా స్నేహితుడు రాజ్వీర్ షెకావత్ ఆగస్టు 11వ తేదీ రాత్రి తన స్నేహితులతో పార్టీకి వెళ్లాడు. వైన్ క్లబ్పై పోలీసులు దాడి చేశారు. అతన్ని షిప్రాపాత్ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న నేను పోలీస్ స్టేషన్కి వెళ్లాను. అరెస్టుకు గల కారణాలను అడిగితే నాపై అసభ్యకరంగా ప్రవర్తించారు. నన్ను బట్టలు విప్పి రిమాండ్ రూమ్కి తీసుకెళ్లి కొట్టారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.
READ MORE:Jharkhand: ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డును చంపి పరారైన అత్యాచార దోషి..
ఈ ఘటన జరిగిన వెంటనే కేబినెట్ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ డీజీపీ, పోలీస్ కమిషనర్తో మాట్లాడి సీరియస్గా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఘటనలో పాల్గొన్న ఐదుగురు పోలీసుల మానసిక స్థితిని పరిశీలిస్తామని మంత్రి రాథోడ్ తెలిపారు. పోలీసుల తీరు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ‘సైనికుడు ఏదో పని కోసం ఇక్కడకు వచ్చారు. ఈ క్రమంలో పోలీసులు బట్టలు విప్పి మరి లాఠీలతో కొట్టారు. ఐదుగురు పోలీసులు కలిసి సైనికుడిపై దాడి చేయడం బాధకరం. సైనికుడి మెడికల్ రిపోర్టు చూసి ఆశ్చర్యపోయాను. ఇప్పుడు కూడా యూనిఫారాన్ని గౌరవిస్తాను. ఇలా రౌడీయిజం చేసే హక్కు రాజ్యాంగం ఎవరికీ ఇవ్వలేదు.” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!