Rajasthan:సైనికుడిని స్టేషన్లో బట్టలు విప్పి కొట్టిన పోలీసులు.. మంత్రి ఫైర్
- రాజస్థాన్ లో పోలీసుల అత్యుత్సాహం
- ఆర్మీ జవాన్తో అనుచితంగా ప్రవర్తించిన వైనం
- స్టేషన్ లో బట్టలు విప్పిమరీ కొట్టిన పోలీసులు
- కేబినెట్ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ సీరియస్
- చర్యలు తీసుంటామని హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజస్థాన్ లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. జైపూర్లోని షిప్రాపత్ పోలీస్ స్టేషన్లో ఆర్మీ జవాన్తో అనుచితంగా ప్రవర్తించారు. దీంతో క్యాబినెట్ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ఈ సంఘటనపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ.. పోలీసు స్టేషన్ సిబ్బందిని మందలించారు. పోలీసులు చట్టాన్ని అడ్డుపెట్టుకుని అనుచితంగా ప్రవర్తిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పోలీసు శాఖ ప్రతిష్టను దిగజార్చాయన్నారు. స్టేషన్ కు చేరుకుని పోలీసులను హెచ్చరించారు.
READ MORE: AP CM Chandrababu: స్కూల్ వ్యాన్ల ఫిట్ నెస్ పరీక్షలకు సీఎం చంద్రబాబు ఆదేశం
Also Read
- PoK Protest: వారు కూడా భారత్ లాంటి శత్రువులే.. పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
- Price Hike from August 1: ఆగస్టు 1 నుంచి ధరల మోత.. నూనె, సబ్బు, టీవీ, ఫ్రిజ్ నుంచి కార్ల వరకు పెరగనున్న ధరలు..!
- Lok sabha: ఎయిరిండియా ప్రమాద దర్యాప్తుపై కేంద్రం కీలక ప్రకటన
- Kiren Rijiju: ‘‘రాహుల్ గాంధీ హత్య చేశారని నేను కూడా చెప్పొచ్చు’’.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు..
అసలేం జరిగిందంటే.. జమ్మూ కాశ్మీర్లో కమాండోగా నియమించబడిన అరవింద్ సింగ్ రాజ్పుత్ తనకు తెలిసిన వారి కేసుకు సంబంధించి నగరంలోని షిప్రాపత్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. అక్కడ ఆయనపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. బట్టలు సైతం తొలగించారని బాధితుడు ఆరోపించారు. బాధిత సైనికుడు వీడియో కూడా బయటకు వచ్చింది. వీడియోలో సైనికుడు మాట్లాడుతూ.. “నా స్నేహితుడు రాజ్వీర్ షెకావత్ ఆగస్టు 11వ తేదీ రాత్రి తన స్నేహితులతో పార్టీకి వెళ్లాడు. వైన్ క్లబ్పై పోలీసులు దాడి చేశారు. అతన్ని షిప్రాపాత్ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న నేను పోలీస్ స్టేషన్కి వెళ్లాను. అరెస్టుకు గల కారణాలను అడిగితే నాపై అసభ్యకరంగా ప్రవర్తించారు. నన్ను బట్టలు విప్పి రిమాండ్ రూమ్కి తీసుకెళ్లి కొట్టారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.
READ MORE:Jharkhand: ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డును చంపి పరారైన అత్యాచార దోషి..
ఈ ఘటన జరిగిన వెంటనే కేబినెట్ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ డీజీపీ, పోలీస్ కమిషనర్తో మాట్లాడి సీరియస్గా దర్యాప్తు చేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఘటనలో పాల్గొన్న ఐదుగురు పోలీసుల మానసిక స్థితిని పరిశీలిస్తామని మంత్రి రాథోడ్ తెలిపారు. పోలీసుల తీరు ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ‘సైనికుడు ఏదో పని కోసం ఇక్కడకు వచ్చారు. ఈ క్రమంలో పోలీసులు బట్టలు విప్పి మరి లాఠీలతో కొట్టారు. ఐదుగురు పోలీసులు కలిసి సైనికుడిపై దాడి చేయడం బాధకరం. సైనికుడి మెడికల్ రిపోర్టు చూసి ఆశ్చర్యపోయాను. ఇప్పుడు కూడా యూనిఫారాన్ని గౌరవిస్తాను. ఇలా రౌడీయిజం చేసే హక్కు రాజ్యాంగం ఎవరికీ ఇవ్వలేదు.” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి FIRలో సంచలన విషయాలు..
-
PoK Protest: వారు కూడా భారత్ లాంటి శత్రువులే.. పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు..
-
Sandhya Theatre Stampede Case: తొక్కిసలాట కేసు: నాంపల్లి కోర్టు కీలక ఆదేశాలు
-
Price Hike from August 1: ఆగస్టు 1 నుంచి ధరల మోత.. నూనె, సబ్బు, టీవీ, ఫ్రిజ్ నుంచి కార్ల వరకు పెరగనున్న ధరలు..!
-
Ajay Bhupathi: టైటిల్ కోసం జపాన్ వరకు వెళ్లడం ఏంది సామి.. ‘RX100’ టైటిల్ గురించి అజయ్ భూపతి షాకింగ్ రివీల్!
ట్రెండింగ్
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్టాప్లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!