కేరళలో ఓ మంత్రి కాన్వాయ్ లోని ఓ వాహనం వేగంగా వచ్చి బలంగా ఢీ కొట్టడంతో అంబులెన్స్ లో ఉన్న పేషెంటుకు తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో తిరువనంతపురం పోలీసులు రెండు వాహనాల డ్రైవర్ల మీద కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. కేరళ రాజధానిలోని బిజీ కూడలిలో రెడ్ సిగ్నల్ పడటంతో విద్యాశాఖ మంత్రి వి. శివన్ కుట్టి కాన్వాయ్ రాంగ్ రూట్లో రావడంతో అక్కడి ట్రాఫిక్ పోలీసులు మంత్రి కాన్వాయ్ కు దారిచ్చేందుకు ట్రాఫిక్ ను మళ్లించే ప్రయత్నం చేశారు. అంతలో అటుగా ఎమర్జెన్సీ పరిస్థితుల్లో పేషెంటును ఆసుపత్రికి తరలిస్తున్న అంబులెన్సు సరైన దారిలోనే వచ్చింది.
Read Also: Chandrayaan 3: చంద్రయాన్-3 ప్రయోగం సక్సెస్.. భారత్ చరిత్ర సృష్టించాలంటే అది జరగాలి..
కానీ రోడ్డు మధ్యలో ఓ బైకు ఆగిపోవడంతో దాన్ని తప్పింకుని అంబులెన్స్ ముందుకు వెళ్ళింది. అది గమనించని మంత్రి శివన్ కుట్టి కాన్వాయ్ అంబులెన్సును బలంగా ఢీకొట్టింది. వెంటనే అంబులెన్స్ పల్టీ కొట్టడంతో అందులో ఉన్న పేషెండ్ కు గాయాలు అయ్యాయి. అదృష్టావశాత్తు అక్కడే ఉన్న పోలీసు తృటిలో పెను ప్రమాదాన్ని తప్పించుకున్నారు.
Read Also: Vishwak Sen: విశ్వక్ సేన్ షాకింగ్ డెసిషన్.. అప్పుడేనా?
కాన్వాయ్ తర్వాత బైక్ ను కూడా లైట్ గా తాగిలించింది. దీంతో బైక్ పై ఉన్న వారు కూడా ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. కానీ అంబులెన్సులోని పేషెంటుకు మాత్రం తీవ్ర గాయాలయ్యాయని అక్కడి పోలీసులు తెలిపారు. మంత్రి కాన్వాయ్ వాహనాన్ని నడిపిన డ్రైవరును అంబులెన్స్ డ్రైవరును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పేర్కొన్నారు. అంబులెన్స్ లోని పేషెంట్ ను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.