Shamshabad: కోడలిని చంపి పూడ్చేసిన అత్తామామలు.. పోలీసులు ఎలా పట్టుకున్నారంటే?
- మద్యం మత్తులో కోడలిని హత్య చేసిన అత్తామామలు
- శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అత్తామామలు మద్యం మత్తులో కోడలిని హత్యచేశారు. ఈ దారుణమైన సంఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సాతంరాయి వద్ద చోటు చేసుకుంది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం… శంషాబాద్ మండలం రామాపురం తండాకు చెందిన ముడావత్ దోలిని అదే తండాకు చెందిన ముడావత్ సురేష్ కు15 సంవత్సరాల క్రితం వివాహం అయింది. గత కొన్ని రోజులుగా భార్య భర్తల మద్య గొడవల కారణంగా అత్త తుల్శీ, మామ అనంతి సాతంరాయిలో ఉంటూ కూలీ పనులు చేస్తున్నారు. అయితే రెండు నెలల క్రితం సురేష్ దోలి భార్యాభర్తలు గ్యాస్ స్టవ్ రిపేయిర్ కోసం శంషాబాద్ వచ్చారు.
READ MORE: Australian Open 2025: ఆస్ట్రేలియన్ ఓపెన్లో తెలుగు కుర్రాడు.. అరంగేట్రంలోనే దిగ్గజ ఆటగాడితో ఢీ!
Also Read
- Indian Rupee: రూపాయికి 'చీకటి' రోజు.. జీవితకాల కనిష్టానికి పడిపోయిన భారత కరెన్సీ..
- 8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
- Sambhaji Maharaj Jayanti: ఛత్రపతి శివాజీ వారసుడు.. మొఘలుల సింహస్వప్నం! ఛత్రపతి శంభాజీ మహారాజ్ వీరగాథ ఇదే..
- IPL Most Centuries: ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన వీరులు వీరే.. అగ్రస్థానంలో విరాట్ కోహ్లీ.!
అప్పటికే ఇద్దరి మద్య తీవ్ర స్థాయిలో గోడవలు జరిగాయి. దీంతో దోలి సాతంరాయిలో ఉన్న అత్తమామల వద్దకు వచ్చింది. అత్త, మామ, కోడలు కలిసి కల్లు కాంపౌండ్ లో మద్యం సేవించారు. ముగ్గురు మత్తులోకి జారుకున్నాక కోడలు దోలిని సాతంరాయి త్రీలోక అపార్ట్మెంట్ సమీపంలోని నిర్మాణుష ప్రాంతానికి తీసుకొచ్చారు. అక్కడ అమెను హత్యచేసి మట్టిలో పూడ్చేసి వెళ్ళిపోయారు. అయితే నిర్మాణంలో ఉన్న త్రిలోక అపార్ట్మెంట్ వారు మట్టిని తీసుకొచ్చి అక్కడే డప్ చేయడంతో దాదాపు 25 ఫీట్ల లోనికి దోలి మృతదేహం కూడుకుపోయింది. ఏమీ తెలియనట్టు కొడుకుతో కలిసి కోడలు కనిపించడం లేదని శంషాబాద్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కానీ పోలీసులకు ఎక్కడా ఎలాంటి క్లూ లభించలేదు. పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిజం బయటకు వచ్చింది. మట్టి కుప్పలో కూడుకుపోయిన మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు పోష్టు మర్టం నిమిత్తం ఉస్మానియా మార్చరికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
READ MORE: Deputy CM Pawan Kalyan: రేపు పిఠాపురంలో పవన్ పర్యటన.. తొలిసారిగా ఏడీబీ రోడ్డులో..! ఎందుకంటే..?
తాజావార్తలు
-
Indian Rupee: రూపాయికి ‘చీకటి’ రోజు.. జీవితకాల కనిష్టానికి పడిపోయిన భారత కరెన్సీ..
-
Rajat Patidar: దెబ్బ గట్టిగా తాకింది, ఇప్పుడు బాగానే ఉన్నా.. ఇక వదలను!
-
India Bans Sugar Exports: చక్కెర ఎగుమతులపై భారత్ నిషేధం.. ఎందుకు? పూర్తి వివరాలు
-
SBI GPAI: SBI అకౌంట్ ఉన్నవారు తప్పక తీసుకోవాల్సిన పాలసీ!.. రూ.20 లక్షలు పొందే ఛాన్స్!
-
Tollywood : టాలీవుడ్లో సెగలు పుట్టిస్తున్న ‘సింగిల్ స్క్రీన్’ వివాదం.. రెండుగా చీలిన నిర్మాతలు
ట్రెండింగ్
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!