Atrocious : సమాజం ఎటుపోతుంది.. ముక్కలు ముక్కలుగా నరుక్కుంటున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atrocious : హత్యల్లో సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. ఒక్క దెబ్బతో చంపితే బాగోలేదని.. జనాలు కొత్త రూట్ ఎంచుకుంటున్నారు. చంపినా కసి తీరట్లేదేమో.. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరుకుతున్నారు. ఇది ఆ మధ్య జరిగిన శ్రద్ధావాకర్ హత్య నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి దేశంలో ప్రతి రోజు ఏదో ఒక చోట ముక్కలుగా నరికిన హత్య వార్తలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. గతంలో బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలో జరిగిన ఘటనలు సంచలనంగా మారగా తాజాగా ఒడిశాలోనూ ఇలాంటి దారుణమే జరిగింది. ఓ భర్త తన భార్యను ముక్కలు ముక్కలుగా నరికి గోనె సంచిలో కుక్కాడు. హత్య అనంతరం వాటిని ఎవరూ లేని ప్రాంతంలో పారేశాడు.
Read Also:BIG Breaking: రేపే తెలంగాణ టెన్త్ ఫలితాలు.. మంత్రి సబిత అధికారిక ప్రకటన
Also Read
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
- Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
- Telangana : తెలంగాణ ఉద్యమకారులకు గుడ్న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
- CSK Vs LSG: లక్నో గ్రౌండ్లో కార్తీక్ శర్మ వీరవిహారం.. నిర్ణీత 20 ఓవర్లలో చెన్నై భారీ స్కోరు..
వివరాల్లోకి వెళితే.. ఒడిశా రాష్ట్రం బాలేశ్వర్ జిల్లాలోని పలాసియా గ్రామంలో సాధబ్ దాస్, మామాదాస్ జంటకు పదేళ్ల కిందట వివాహం అయ్యింది. వారిద్దరు సాధబ్ తల్లిదండ్రులతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఈ దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే గత ఆదివారం కూడా గొడవ జరిగింది. కోపంలో అతడు తన భార్యను హత్య చేశాడు. తర్వాత మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. అనంతరం వాటిని ఓ గోనె సంచిలో వేసుకుని.. గ్రామానికి సమీపంలో ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడు. అతడు పడేసేటప్పడు పలువురు అతడిని గమనించారు. ఈ విషయాన్ని బాధితురాలి కుటుంబానికి తెలియజేశారు. వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఓ చోట గోనె సంచిలో మామాదాస్ ముక్కలుగా పడివున్న మృతదేహం కనిపించింది. వెంటనే బస్తా పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి వచ్చారు. దీనిపై కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు మొదలుపెట్టారు. కాగా.. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
Read Also:Bus Accident : మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం.. బస్సు నదిలో పడి 22 మంది మృతి
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..