Atrocious : సమాజం ఎటుపోతుంది.. ముక్కలు ముక్కలుగా నరుక్కుంటున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atrocious : హత్యల్లో సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. ఒక్క దెబ్బతో చంపితే బాగోలేదని.. జనాలు కొత్త రూట్ ఎంచుకుంటున్నారు. చంపినా కసి తీరట్లేదేమో.. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరుకుతున్నారు. ఇది ఆ మధ్య జరిగిన శ్రద్ధావాకర్ హత్య నుంచి స్టార్ట్ అయింది. అప్పటి నుంచి దేశంలో ప్రతి రోజు ఏదో ఒక చోట ముక్కలుగా నరికిన హత్య వార్తలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. గతంలో బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలో జరిగిన ఘటనలు సంచలనంగా మారగా తాజాగా ఒడిశాలోనూ ఇలాంటి దారుణమే జరిగింది. ఓ భర్త తన భార్యను ముక్కలు ముక్కలుగా నరికి గోనె సంచిలో కుక్కాడు. హత్య అనంతరం వాటిని ఎవరూ లేని ప్రాంతంలో పారేశాడు.
Read Also:BIG Breaking: రేపే తెలంగాణ టెన్త్ ఫలితాలు.. మంత్రి సబిత అధికారిక ప్రకటన
Also Read
- Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
- AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
- Vinukonda: అత్యాచారం చేశాడంటూ ఫిర్యాదు.. పోలీస్ స్టేషన్ లో లొంగిపోయిన మాజీ సీఐ చినమల్లయ్య.!
- Abhijeet Dipke: అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు.. నేటి నుంచి నిరసనలు
వివరాల్లోకి వెళితే.. ఒడిశా రాష్ట్రం బాలేశ్వర్ జిల్లాలోని పలాసియా గ్రామంలో సాధబ్ దాస్, మామాదాస్ జంటకు పదేళ్ల కిందట వివాహం అయ్యింది. వారిద్దరు సాధబ్ తల్లిదండ్రులతో కలిసి ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఈ దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలోనే గత ఆదివారం కూడా గొడవ జరిగింది. కోపంలో అతడు తన భార్యను హత్య చేశాడు. తర్వాత మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. అనంతరం వాటిని ఓ గోనె సంచిలో వేసుకుని.. గ్రామానికి సమీపంలో ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో పడేశాడు. అతడు పడేసేటప్పడు పలువురు అతడిని గమనించారు. ఈ విషయాన్ని బాధితురాలి కుటుంబానికి తెలియజేశారు. వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఓ చోట గోనె సంచిలో మామాదాస్ ముక్కలుగా పడివున్న మృతదేహం కనిపించింది. వెంటనే బస్తా పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి వచ్చారు. దీనిపై కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు మొదలుపెట్టారు. కాగా.. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
Read Also:Bus Accident : మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం.. బస్సు నదిలో పడి 22 మంది మృతి
తాజావార్తలు
-
Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
-
The Odyssey Ticket Price : రికార్డులు బద్దలు కొడుతున్న విజువల్ వండర్.. టికెట్ రేటు ఒక్కోటి ఒకటిన్నర లక్ష.!
-
Prakash Raj: నాగబాబుకు ప్రకాష్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్.. “మేము గొర్రెలం కాదు..!”
-
Devara 2 Update : ‘వర’కు ఏమైంది ?… జాన్వీ ప్రశ్నపై తారక్ సీరియస్
-
AFG vs IND: మనవ్ సుతార్ అరంగేట్రం.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గిల్ సేన.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!