POK: పీఓకేలో నిరసనలకు మోకరిల్లిన పాక్ ప్రభుత్వం.. రూ.23 బిలియన్లు విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై ప్రజల ఆగ్రహం తారాస్థాయికి చేరుకుంది. అక్కడ హింసాత్మక నిరసనలకు పాకిస్థాన్ ప్రభుత్వం మోకరిల్లింది. పీఓకేలోని భీంబర్ నుంచి బయలుదేరిన నిరసనకారుల కాన్వాయ్ సోమవారం దిర్కోట్ నుంచి ముజఫరాబాద్లోకి ప్రవేశించింది. ఈ ఆందోళనకారులు ముజఫరాబాద్లోని అసెంబ్లీని చుట్టుముట్టనున్నారు. పీఓకేలో నాలుగో రోజు ఇంటర్నెట్, మొబైల్ సేవలు బంద్ అయ్యాయి. ఇదిలా ఉండగా, నిరసనకారులను శాంతింపజేయడానికి, పాకిస్థాన్ ప్రభుత్వం రూ.23 బిలియన్ల బడ్జెట్ను కేటాయించింది. పీఓకేలో హింసాత్మక నిరసనల తర్వాత, రేంజర్లు వీధుల్లోకి వచ్చారు. షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం ముఖ్యనేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
READ MORE: AP Polling: ఈసీ లెక్కల ప్రకారం ఏపీలో పోలింగ్ ఎంతంటే..?
Also Read
స్థానిక ప్రభుత్వం కూడా విద్యుత్ ధరలు, రొట్టె ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం పీఓకేలో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. శుక్రవారం నుంచి ఈ ప్రాంతంలో నిరసనలు కొనసాగుతున్నాయి. సోమవారం వరుసగా నాలుగో రోజు పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం జరిగింది. మృతుల సంఖ్య మూడుకు చేరింది. వీరిలో ఇద్దరు ఆందోళనకారులు, ఒక ఎస్ఐ ఉన్నారు. ఆదివారం జరిగిన ఘర్షణలో 100 మందికి పైగా గాయపడ్డారు. గత నాలుగు రోజులుగా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, పన్నుల పెంపునకు వ్యతిరేకంగా రాజధాని ముజఫరాబాద్కు మార్చ్కు పీఓకేలోని సామాజిక కార్యకర్తలు, వ్యాపారులు, న్యాయవాదులతో ఏర్పడిన జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చింది. సోమవారం కూడా లక్షలాది మంది నిరసనకారులు ముజఫరాబాద్ వైపు లాంగ్ మార్చ్ కొనసాగించారు. మార్చ్ను అడ్డుకునేందుకు పోలీసులు బలవంతంగా ప్రయోగించడంతో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ, షాబాజ్ షరీఫ్తో సమావేశం ముగిసిన వెంటనే, పీఓకే ప్రధాని హక్ విద్యుత్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. హక్ మాట్లాడుతూ.. స్థానిక నివాసితులు గత కొన్ని రోజులుగా తక్కువ విద్యుత్, పిండిపై సబ్సిడీని డిమాండ్ చేస్తున్నారు. అందుబాటులో ఉండే విద్యుత్, చౌక పిండి అవసరాన్ని ఎవరూ విస్మరించలేరన్నారు. రొట్టెల ధరలను కూడా తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!