POK: పీఓకేలో నిరసనలకు మోకరిల్లిన పాక్ ప్రభుత్వం.. రూ.23 బిలియన్లు విడుదల
పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో పెరుగుతున్న ద్రవ్యోల్బణంపై ప్రజల ఆగ్రహం తారాస్థాయికి చేరుకుంది. అక్కడ హింసాత్మక నిరసనలకు పాకిస్థాన్ ప్రభుత్వం మోకరిల్లింది. పీఓకేలోని భీంబర్ నుంచి బయలుదేరిన నిరసనకారుల కాన్వాయ్ సోమవారం దిర్కోట్ నుంచి ముజఫరాబాద్లోకి ప్రవేశించింది. ఈ ఆందోళనకారులు ముజఫరాబాద్లోని అసెంబ్లీని చుట్టుముట్టనున్నారు. పీఓకేలో నాలుగో రోజు ఇంటర్నెట్, మొబైల్ సేవలు బంద్ అయ్యాయి. ఇదిలా ఉండగా, నిరసనకారులను శాంతింపజేయడానికి, పాకిస్థాన్ ప్రభుత్వం రూ.23 బిలియన్ల బడ్జెట్ను కేటాయించింది. పీఓకేలో హింసాత్మక నిరసనల తర్వాత, రేంజర్లు వీధుల్లోకి వచ్చారు. షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం ముఖ్యనేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
READ MORE: AP Polling: ఈసీ లెక్కల ప్రకారం ఏపీలో పోలింగ్ ఎంతంటే..?
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
స్థానిక ప్రభుత్వం కూడా విద్యుత్ ధరలు, రొట్టె ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం పీఓకేలో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. శుక్రవారం నుంచి ఈ ప్రాంతంలో నిరసనలు కొనసాగుతున్నాయి. సోమవారం వరుసగా నాలుగో రోజు పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం జరిగింది. మృతుల సంఖ్య మూడుకు చేరింది. వీరిలో ఇద్దరు ఆందోళనకారులు, ఒక ఎస్ఐ ఉన్నారు. ఆదివారం జరిగిన ఘర్షణలో 100 మందికి పైగా గాయపడ్డారు. గత నాలుగు రోజులుగా పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, పన్నుల పెంపునకు వ్యతిరేకంగా రాజధాని ముజఫరాబాద్కు మార్చ్కు పీఓకేలోని సామాజిక కార్యకర్తలు, వ్యాపారులు, న్యాయవాదులతో ఏర్పడిన జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చింది. సోమవారం కూడా లక్షలాది మంది నిరసనకారులు ముజఫరాబాద్ వైపు లాంగ్ మార్చ్ కొనసాగించారు. మార్చ్ను అడ్డుకునేందుకు పోలీసులు బలవంతంగా ప్రయోగించడంతో ఆందోళనకారులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ, షాబాజ్ షరీఫ్తో సమావేశం ముగిసిన వెంటనే, పీఓకే ప్రధాని హక్ విద్యుత్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. హక్ మాట్లాడుతూ.. స్థానిక నివాసితులు గత కొన్ని రోజులుగా తక్కువ విద్యుత్, పిండిపై సబ్సిడీని డిమాండ్ చేస్తున్నారు. అందుబాటులో ఉండే విద్యుత్, చౌక పిండి అవసరాన్ని ఎవరూ విస్మరించలేరన్నారు. రొట్టెల ధరలను కూడా తగ్గిస్తున్నట్లు ప్రకటించారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!