Indian pilot Gopi Thotakura: నింగిలోకి మొదటి భారతీయ అంతరిక్ష యాత్రికుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపిచంద్ తోటకూర రికార్డు సృష్టించారు. ‘బ్లూ ఆరిజిన్’ సంస్థ చేపట్టిన ‘న్యూ షెపర్డ్’ ప్రాజెక్టులో టూరిస్ట్గా వెళ్లారు. 1984లో రాకేశ్ శర్మ అంతరిక్షయానం చేసిన విషయం తెలిసిందే. కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్, రాజా చారి, శిరీష బండ్ల వీరంతా భారత మూలాలున్న అమెరికా పౌరులు. భారత తొలి స్పేస్ టూరిస్ట్గా తాజాగా గోపీచంద్ చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉంటున్నప్పటికీ.. భారత పాస్పోర్టు కలిగి ఉన్నారు.
Also Read
- Supreme Court: E20 పెట్రోల్పై సుప్రీంకోర్టులో కీలక విచారణ.. సంచలన విషయాన్ని బయటపెట్టిన కేంద్రం!
- Andhra Pradesh Ranks No.1: మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా ఏపీ.. దేశంలోనే అగ్రస్థానం
- National Doctors Day 2026: మద్యం, ఒత్తిడి, మధుమేహం.. ప్రజల్లో ఉన్న అపోహలపై వైద్యుల క్లారిటీ
- LA 2028 Olympics: ఒలింపిక్స్లో భారత్-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్ ఉంటుందా? క్లారిటీ ఇదిగో..
అమెజాన్ వ్యవస్థాపకుడు, బిలియనీర్ జెఫ్ బెజోస్కు చెందిన అంతరిక్ష సంస్థే బ్లూ ఆరిజిన్. ఈ కంపెనీ ఇప్పటికే న్యూ షెపర్డ్ మిషన్ పేరిట అంతరిక్ష యాత్రలకు శ్రీకారం చుట్టింది. బ్లూ ఆరిజిన్ రాబోయే సంవత్సరాల్లో NASA సహకారంతో మానవులను చంద్రునిపైకి పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది. కాగా.. బ్లూ ఆరిజిన్ న్యూ షెపర్డ్ -25 మిషన్లోని ఆరుగురు సిబ్బందిలో భారతీయ సంతతికి చెందిన గోపీచంద్ తోటకూర ఉన్నారు. ఎన్ఎస్-25 మిషన్కు గోపీచంద్ సహా మొత్తం ఆరుగురిని ఎంపిక చేశారు. వెంచర్ క్యాపిలిస్ట్ మాసన్ ఏంజెల్, ఫ్రాన్స్ ఔత్సాహిక పారిశ్రామికవేత్త సిల్వైన్ చిరోన్, అమెరికా టెక్ వ్యాపారి కెన్నెత్ ఎల్ హెస్, సాహసయాత్రికుడు కరోల్ షాలర్, అమెరికా వైమానికదళ మాజీ కెప్టెన్ ఎడ్ డ్వైట్ ఎన్ఎస్-25లో ప్రయాణించనున్నారు. డ్వైట్ 1961లో అంతరిక్షయానానికి ఎంపికైన తొలి నల్లజాతి వ్యోమగామి. కానీ, వివిధ కారణాల వల్ల ఆయనకు రోదసీలోకి వెళ్లే అవకాశం మాత్రం రాలేదు.
విజయవాడలో జన్మించిన గోపీచంద్ తోటకూర అమెరికాలో ఆరోనాటికల్ సైన్స్లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు. తర్వాత ఆయన కమర్షియల్ జెట్ పైలట్గా పని చేశారు. బుష్ ప్లేన్లు, ఏరోబాటిక్ ప్లేన్లు, సీప్లేన్లు, గ్లైడర్లు, హాట్ ఎయిర్ బెలూన్లకు కూడా పైలట్గా వ్యవహరించారు. అట్లాంటాలో ప్రిజెర్వ్ లైఫ్ కార్ప్ అనే ఒక వెల్నెస్ సెంటర్కు గోపీచంద్ సహ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. కాగా, ఇంతకుముందు పలువురు భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులు అంతరిక్షయానం చేసినప్పటికీ వారంతా అమెరికా పౌరులు. గోపీచంద్ మాత్రం ఇప్పటికీ భారతీయ పౌరుడే. ఆయన వద్ద భారత పాస్పోర్టే ఉంది.
కాగా.. బ్లూ ఆరిజిన్ న్యూ షెపర్డ్ సెప్టెంబరు 2022లో రాకెట్ దుర్ఘటన అనంతరం రెండేళ్లకు తర్వాత మొదటి సారి ఆదివారం ఆకాశాన్ని తాకింది. న్యూ షెపర్డ్ రాకెట్.. క్యాప్సూల్ వెస్ట్ టెక్సాస్లోని ఒక ప్రైవేట్ ర్యాంచ్లో బ్లూ ఆరిజిన్ సౌకర్యాల నుంచి ఉదయం 9:36 (స్థానిక సమయం) గంటలకు బయలుదేరినట్లు CNN నివేదించింది. NS-25 అని పిలువబడే మిషన్ ప్రత్యక్ష ప్రసారం బ్లూ ఆరిజిన్ వెబ్సైట్లో ఉదయం 8:12 గంటలకు (స్థానిక సమయం) ప్రారంభమైంది. ప్రయోగంలో భాగంగా గమ్యస్థానం చేరాక.. రాకెట్ సిబ్బంది క్యాప్సూల్ నుంచి విడిపోయింది. వాతావరణం యొక్క సరిహద్దును దాటి 105.7 కిలోమీటర్లకు చేరుకుంది. అందులోని క్యాప్సూల్, గమ్డ్రాప్ ఆకారపు పాడ్ సిబ్బందిని మోసుకుని భూమికి తీసుకొచ్చింది. వారంతా సురక్షితంగా వచ్చారు. వారు పారాచూట్ సాయంతో భూమినికి చేరుకున్నారు. అంతకు ముందు అంతరిక్షంలో గురుత్వాకర్షణ లేకపోవడాన్ని వాళ్లు గమనించారు. సిబ్బంది తమ సీటు బెల్ట్లను విప్పి కొన్ని నిమిషాల పాటు పాడ్ చుట్టూ తేలాలని చూశారు. అంతరిక్షంలో కొత్త అనుభూతిని పొందారు.
తాజావార్తలు
-
Supreme Court: E20 పెట్రోల్పై సుప్రీంకోర్టులో కీలక విచారణ.. సంచలన విషయాన్ని బయటపెట్టిన కేంద్రం!
-
Andhra Pradesh Ranks No.1: మహిళా పారిశ్రామికవేత్తలకు అండగా ఏపీ.. దేశంలోనే అగ్రస్థానం
-
Ginger Benefits: నెలరోజులు రోజూ అల్లం తింటే.. మీ శరీరంలో జరిగే మార్పులు ఇవే!
-
Vaibhav Sooryavanshi: ఇంగ్లండ్ బౌలర్లకు ఏమీ తెలియదు.. తొలి టీ20లోనే వైభవ్ను ఆడించాలి!
-
RRB Technician Recruitment 2026: రైల్వేలో 6,557 ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు ప్రారంభం, పూర్తి వివరాలు ఇవే
ట్రెండింగ్
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!
-
Inspiring Success Story: అమ్మ బంగారు గాజులు.. కూతురి బంగారు భవిష్యత్తు.. యువతి ఎమోషనల్ పోస్ట్ వైరల్
-
IND vs ENG 1st T20: తొలి టీ20లో వైభవ్ అరంగేట్రం.. సంజుకు కూడా ఛాన్స్.. వేటు ఎవరిపై!
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!