YS Viveka Case: వైఎస్ వివేకా హత్య కేసు.. ముగియనున్న డెడ్లైన్.. తర్వాతేంటి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Viveka Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నేటితో విచారణ ముగియనుంది.. వివేకా హత్య కేసు దర్యాప్తు పూర్తి చేసేందుకు సీబీఐకి సుప్రీంకోర్టు విధించిన గడువు నేటితో ముగియనుంది.. మరి కేసు దర్యాప్తు కొలిక్కి వచ్చిందా? లేదా సుప్రీంకోర్టును మరింత గడువు కోరనున్నారా? అనే ఉత్కంఠ నెలకొంది.. ఈ కేసులో ఇప్పటికే ఉదయ్ కుమార్రెడ్డిని, వైఎస్ భాస్కర్రెడ్డిని అరెస్ట్ చేసింది సీబీఐ.. అయితే, అరెస్ట్ చేసిన 90 రోజుల్లో నిందితులపై దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ వేయాల్సి ఉంటుంది.. వీరిపై జులై 12వ తేదీ లోగా ఛార్జిషీట్ వేయకపోతే బెయిల్ వచ్చే అవకాశం ఉంది.. మరోవైపు.. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ వివేకా కూతురు సునీత వేసిన పిటిషన్పై వచ్చే నెల 3న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.. ఈ నేపథ్యంలో సీబీఐ మరింత సమయం కోరే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది..
Read Also: Monsoon Food Tips: వర్షాకాలంలో ఈ ఫుడ్ అస్సలు తీసుకొవద్దు.. ఆరోగ్యానికి చాలా ప్రమాదం!
Also Read
- Meerpet: భారీ అగ్నిప్రమాదం.. ప్లాస్టిక్ గోదాం దగ్ధం.. భారీ ఆస్తి నష్టం..!
- FIFA World Cup: ఫ్రాన్స్కు ఫ్యూజులు అవుట్.. ఫైనల్లోకి దూసుకెళ్లిన స్పెయిన్..!
- Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
- Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
జూన్ 30వ తేదీ లోపు కేసు దర్యాప్తు పూర్తి చేయాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.. ఇప్పటికే ఈ కేసులో సుదీర్ఘంగా సాక్షులను, నిందితులను, అనుమానితులను విచారణ చేసిన సీబీఐ.. వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర పై విచారణ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది.. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పొందిన తర్వాత ఐదుసార్లు ప్రశ్నించింది.. వివేక హత్య కేసులో విచారణ ముగిసిందని భావిస్తుండడంతో.. కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందనే ఆసక్తికరంగా మారింది.. జులై 3న సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ సాగుతున్న నేపథ్యంలో.. ఈ కేసులో విచారణ కోసం మరికొంత సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టును సీబీఐ కోరనున్నట్టు తెలుస్తోంది. కాగా, 2019 మార్చి 15వ తేదీన వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు.. అప్పటి నుంచి పలు రకాల మలుపు తిరుగుతూనే ఉంది.. అయితే, హైకోర్టు ఆదేశాలతో 2020లో ఈ కేసు సీబీఐకి చేరిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Meerpet: భారీ అగ్నిప్రమాదం.. ప్లాస్టిక్ గోదాం దగ్ధం.. భారీ ఆస్తి నష్టం..!
-
Daily Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ఆర్థిక నష్టాలు తప్పవు!
-
JanaNayagan : జననాయగన్ మరోసారి సెన్సార్.. అదనంగా మరో 41 సెకండ్స్
-
FIFA World Cup: ఫ్రాన్స్కు ఫ్యూజులు అవుట్.. ఫైనల్లోకి దూసుకెళ్లిన స్పెయిన్..!
-
AK 64 : శ్రీలీల ఆఫర్ కయాద్ లోహార్ తన్నుకు పోయిందా..?
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!