YS Viveka Case: వైఎస్ వివేకా హత్య కేసు.. ముగియనున్న డెడ్లైన్.. తర్వాతేంటి..?
YS Viveka Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నేటితో విచారణ ముగియనుంది.. వివేకా హత్య కేసు దర్యాప్తు పూర్తి చేసేందుకు సీబీఐకి సుప్రీంకోర్టు విధించిన గడువు నేటితో ముగియనుంది.. మరి కేసు దర్యాప్తు కొలిక్కి వచ్చిందా? లేదా సుప్రీంకోర్టును మరింత గడువు కోరనున్నారా? అనే ఉత్కంఠ నెలకొంది.. ఈ కేసులో ఇప్పటికే ఉదయ్ కుమార్రెడ్డిని, వైఎస్ భాస్కర్రెడ్డిని అరెస్ట్ చేసింది సీబీఐ.. అయితే, అరెస్ట్ చేసిన 90 రోజుల్లో నిందితులపై దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ వేయాల్సి ఉంటుంది.. వీరిపై జులై 12వ తేదీ లోగా ఛార్జిషీట్ వేయకపోతే బెయిల్ వచ్చే అవకాశం ఉంది.. మరోవైపు.. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ వివేకా కూతురు సునీత వేసిన పిటిషన్పై వచ్చే నెల 3న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.. ఈ నేపథ్యంలో సీబీఐ మరింత సమయం కోరే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది..
Read Also: Monsoon Food Tips: వర్షాకాలంలో ఈ ఫుడ్ అస్సలు తీసుకొవద్దు.. ఆరోగ్యానికి చాలా ప్రమాదం!
Also Read
- FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
- Sanju Samson: గుజరాత్ టైటాన్స్పై చేసిన పరుగులు 11.. అయినా మరో రికార్డ్ సాధించిన సంజూ శాంసన్..
- Weight Loss: బరువు తగ్గాలనుకునే వారికి శుభవార్త.. ఇంత వరకు ఎవరూ చెప్పని చిట్కా.. 99 శాతం సక్సెస్..
- Bangladesh: బంగ్లాదేశ్ ఎయిర్ఫోర్స్లో తాలిబాన్లు.. బయటపడ్డ పాకిస్తాన్ మూలాలు..
జూన్ 30వ తేదీ లోపు కేసు దర్యాప్తు పూర్తి చేయాలని గతంలో సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.. ఇప్పటికే ఈ కేసులో సుదీర్ఘంగా సాక్షులను, నిందితులను, అనుమానితులను విచారణ చేసిన సీబీఐ.. వివేక హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి పాత్ర పై విచారణ చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేసింది.. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పొందిన తర్వాత ఐదుసార్లు ప్రశ్నించింది.. వివేక హత్య కేసులో విచారణ ముగిసిందని భావిస్తుండడంతో.. కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుందనే ఆసక్తికరంగా మారింది.. జులై 3న సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై విచారణ సాగుతున్న నేపథ్యంలో.. ఈ కేసులో విచారణ కోసం మరికొంత సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టును సీబీఐ కోరనున్నట్టు తెలుస్తోంది. కాగా, 2019 మార్చి 15వ తేదీన వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు.. అప్పటి నుంచి పలు రకాల మలుపు తిరుగుతూనే ఉంది.. అయితే, హైకోర్టు ఆదేశాలతో 2020లో ఈ కేసు సీబీఐకి చేరిన విషయం విదితమే.
తాజావార్తలు
-
FTA: ఇరాన్ యుద్ధం గొడవలో ప్రపంచం.. సైలెంట్గా కీలక ఒప్పందాన్ని పూర్తి చేసిన భారత్..
-
Sanju Samson: గుజరాత్ టైటాన్స్పై చేసిన పరుగులు 11.. అయినా మరో రికార్డ్ సాధించిన సంజూ శాంసన్..
-
Post Office Scheme: కేవలం వడ్డీతోనే రూ.18 లక్షలు.. సింపుల్గా కోటీశ్వరులు అయ్యే ఛాన్స్!
-
Weight Loss: బరువు తగ్గాలనుకునే వారికి శుభవార్త.. ఇంత వరకు ఎవరూ చెప్పని చిట్కా.. 99 శాతం సక్సెస్..
-
Nadendla Manohar : డీజిల్ కొరతకు కారణం ఇదే.. రేపు ఉదయం కల్లా బంకులకు స్టాక్.. మంత్రి కీలక ప్రకటన..!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!