OYO: ఓయోలో యువతి, యువకుడి మృతదేహాలు..అసలేం జరిగింది..?
- ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
- యువతి విషం తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు
- యూపీలోని సంభాల్ జిల్లాలో ఘటన
- విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలుపనున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ యువకుడు తన నివాసానికి వందల కిలోమీట్ల దూరంలోని ఓ ప్రాంతానికి వచ్చాడు. అక్కడే ఉన్న ఓ అమ్మాయిని కలిశాడు. వారిద్దరూ ఐడీ ఫ్రూప్ చూయించి ఓయోలో రూమ్ తీసుకున్నారు. రూమ్ లోకి వెళ్లారు. అంతే మళ్లీ బయటకు రాలేదు. వారి గడువు ముగియడంతో హోటల్ సిబ్బంది వారి తలుపు తట్టారు. అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో భయబ్రంతులకు గురైన సిబ్బంది కిటికీ ఓ పెన్ చేసి ఏం రూమ్ లోకి చూశారు. దీంతో వాళ్లు ఒక్కసారిగా కంగుతిన్నారు. గదిలో యువకుడి వేళాడుతూ..కనిపించాడు. యువతి మంచంపై చలనం లేకుండా పడింది. దీంతో వెంటనే పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని సంభాల్ జిల్లాలో చోటుచేసుకుంది.
READ MORE: UGC- NET2024: ఆదివారమే పేపర్ లీక్.. ఆ వెంటనే డార్క్ నెట్లో ప్రత్యక్షం..
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
పోలీసుల కథనం ప్రకారం.. ఢిల్లీలోని గౌతమ్ నగర్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల యువకుడు, సంభాల్కు చెందిన 23 ఏళ్ల యువతి గురువారం మధ్యాహ్నం సదర్ కొత్వాలి ప్రాంతంలోని మొహల్లా ఫతేహుల్లా సరాయ్లో ఉన్న ఓయో హోటల్ రూమ్ బుక్ చేసుకున్నారు. హోటల్ మేనేజర్ యువకుడు, యువతి ఐడీ ప్రూఫ్ తీసుకుని గదిని కేటాయించారు. చెక్అవుట్ సమయం రాత్రి 11 గంటలు. సమయం ముగియడంతో హోటల్ మేనేజర్ అమిత్ గది తలుపు తట్టాడు. గది లోపల నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో మేనేజర్కు అనుమానం వచ్చింది. మెట్లు ఎక్కి కిటికీలోంచి చూడగా.. గది లోపల యువకుడి మృతదేహం వేలాడుతూ ఉండడం, మంచంపై బాలిక అపస్మారక స్థితిలో పడి ఉండడం కనిపించింది. దీంతో వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్పీ కుల్దీప్ సింగ్ గుణవత్, అదనపు ఎస్పీ శ్రీశ్చంద్ర, కొత్వాలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ బృందం కూడా ఘటనా స్థలంలో క్షుణ్ణంగా విచారణ జరిపి ఆధారాలు సేకరించింది. అనంతరం బాలుడు, బాలిక మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. హోటల్ మేనేజర్ నుంచి సమాచారం తీసుకున్నారు. ఒక యువకుడు, యువతి ఐడీ ప్రూఫ్ ఆధారంగా మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు. యువకుడు ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కాగా, బాలిక నోటి నుంచి నురగ రావడంతో ఆమె విషం సేవించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆ హోటల్ను పోలీసులు సీజ్ చేశారు.
తాజావార్తలు
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
-
Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!