OYO: ఓయోలో యువతి, యువకుడి మృతదేహాలు..అసలేం జరిగింది..?
- ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
- యువతి విషం తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు
- యూపీలోని సంభాల్ జిల్లాలో ఘటన
- విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలుపనున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ యువకుడు తన నివాసానికి వందల కిలోమీట్ల దూరంలోని ఓ ప్రాంతానికి వచ్చాడు. అక్కడే ఉన్న ఓ అమ్మాయిని కలిశాడు. వారిద్దరూ ఐడీ ఫ్రూప్ చూయించి ఓయోలో రూమ్ తీసుకున్నారు. రూమ్ లోకి వెళ్లారు. అంతే మళ్లీ బయటకు రాలేదు. వారి గడువు ముగియడంతో హోటల్ సిబ్బంది వారి తలుపు తట్టారు. అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో భయబ్రంతులకు గురైన సిబ్బంది కిటికీ ఓ పెన్ చేసి ఏం రూమ్ లోకి చూశారు. దీంతో వాళ్లు ఒక్కసారిగా కంగుతిన్నారు. గదిలో యువకుడి వేళాడుతూ..కనిపించాడు. యువతి మంచంపై చలనం లేకుండా పడింది. దీంతో వెంటనే పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని సంభాల్ జిల్లాలో చోటుచేసుకుంది.
READ MORE: UGC- NET2024: ఆదివారమే పేపర్ లీక్.. ఆ వెంటనే డార్క్ నెట్లో ప్రత్యక్షం..
Also Read
- CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
- Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో క్లీన్ చిట్.. ఆనందంతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ.!
- Cyber Crime: 11వ తరగతి డ్రాపౌట్.. రూ. 64 కోట్ల సైబర్ దోపిడీ.. 18 ఏళ్ల మాస్టర్మైండ్ అరెస్ట్!
- Talliki Vandanam: ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త.. 41 లక్షల మంది ఖాతాల్లో డబ్బులు జమ..
పోలీసుల కథనం ప్రకారం.. ఢిల్లీలోని గౌతమ్ నగర్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల యువకుడు, సంభాల్కు చెందిన 23 ఏళ్ల యువతి గురువారం మధ్యాహ్నం సదర్ కొత్వాలి ప్రాంతంలోని మొహల్లా ఫతేహుల్లా సరాయ్లో ఉన్న ఓయో హోటల్ రూమ్ బుక్ చేసుకున్నారు. హోటల్ మేనేజర్ యువకుడు, యువతి ఐడీ ప్రూఫ్ తీసుకుని గదిని కేటాయించారు. చెక్అవుట్ సమయం రాత్రి 11 గంటలు. సమయం ముగియడంతో హోటల్ మేనేజర్ అమిత్ గది తలుపు తట్టాడు. గది లోపల నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో మేనేజర్కు అనుమానం వచ్చింది. మెట్లు ఎక్కి కిటికీలోంచి చూడగా.. గది లోపల యువకుడి మృతదేహం వేలాడుతూ ఉండడం, మంచంపై బాలిక అపస్మారక స్థితిలో పడి ఉండడం కనిపించింది. దీంతో వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్పీ కుల్దీప్ సింగ్ గుణవత్, అదనపు ఎస్పీ శ్రీశ్చంద్ర, కొత్వాలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ బృందం కూడా ఘటనా స్థలంలో క్షుణ్ణంగా విచారణ జరిపి ఆధారాలు సేకరించింది. అనంతరం బాలుడు, బాలిక మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. హోటల్ మేనేజర్ నుంచి సమాచారం తీసుకున్నారు. ఒక యువకుడు, యువతి ఐడీ ప్రూఫ్ ఆధారంగా మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు. యువకుడు ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కాగా, బాలిక నోటి నుంచి నురగ రావడంతో ఆమె విషం సేవించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆ హోటల్ను పోలీసులు సీజ్ చేశారు.
తాజావార్తలు
-
NBK : ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కు బాలయ్య.. షూటింగ్ కు బ్రేక్
-
India Test Squad: శ్రీలంకతో టెస్టు సిరీస్.. టీమిండియాలోకి మరో కొత్త ప్లేయర్!
-
CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
-
Yamaha Electric Scooter: యమహా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. కీ-లెస్ ఇగ్నిషన్, మార్చుకోగల బ్యాటరీతో త్వరలో ఎంట్రీ?
-
Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో క్లీన్ చిట్.. ఆనందంతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ.!
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!