OYO: ఓయోలో యువతి, యువకుడి మృతదేహాలు..అసలేం జరిగింది..?
- ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య
- యువతి విషం తాగి బలవన్మరణానికి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు
- యూపీలోని సంభాల్ జిల్లాలో ఘటన
- విచారణ అనంతరం పూర్తి వివరాలు తెలుపనున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ యువకుడు తన నివాసానికి వందల కిలోమీట్ల దూరంలోని ఓ ప్రాంతానికి వచ్చాడు. అక్కడే ఉన్న ఓ అమ్మాయిని కలిశాడు. వారిద్దరూ ఐడీ ఫ్రూప్ చూయించి ఓయోలో రూమ్ తీసుకున్నారు. రూమ్ లోకి వెళ్లారు. అంతే మళ్లీ బయటకు రాలేదు. వారి గడువు ముగియడంతో హోటల్ సిబ్బంది వారి తలుపు తట్టారు. అక్కడి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో భయబ్రంతులకు గురైన సిబ్బంది కిటికీ ఓ పెన్ చేసి ఏం రూమ్ లోకి చూశారు. దీంతో వాళ్లు ఒక్కసారిగా కంగుతిన్నారు. గదిలో యువకుడి వేళాడుతూ..కనిపించాడు. యువతి మంచంపై చలనం లేకుండా పడింది. దీంతో వెంటనే పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని సంభాల్ జిల్లాలో చోటుచేసుకుంది.
READ MORE: UGC- NET2024: ఆదివారమే పేపర్ లీక్.. ఆ వెంటనే డార్క్ నెట్లో ప్రత్యక్షం..
Also Read
- Astrology: జూలై 2 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి ఊహించని గుడ్ న్యూస్..
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
పోలీసుల కథనం ప్రకారం.. ఢిల్లీలోని గౌతమ్ నగర్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల యువకుడు, సంభాల్కు చెందిన 23 ఏళ్ల యువతి గురువారం మధ్యాహ్నం సదర్ కొత్వాలి ప్రాంతంలోని మొహల్లా ఫతేహుల్లా సరాయ్లో ఉన్న ఓయో హోటల్ రూమ్ బుక్ చేసుకున్నారు. హోటల్ మేనేజర్ యువకుడు, యువతి ఐడీ ప్రూఫ్ తీసుకుని గదిని కేటాయించారు. చెక్అవుట్ సమయం రాత్రి 11 గంటలు. సమయం ముగియడంతో హోటల్ మేనేజర్ అమిత్ గది తలుపు తట్టాడు. గది లోపల నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో మేనేజర్కు అనుమానం వచ్చింది. మెట్లు ఎక్కి కిటికీలోంచి చూడగా.. గది లోపల యువకుడి మృతదేహం వేలాడుతూ ఉండడం, మంచంపై బాలిక అపస్మారక స్థితిలో పడి ఉండడం కనిపించింది. దీంతో వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్పీ కుల్దీప్ సింగ్ గుణవత్, అదనపు ఎస్పీ శ్రీశ్చంద్ర, కొత్వాలి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ బృందం కూడా ఘటనా స్థలంలో క్షుణ్ణంగా విచారణ జరిపి ఆధారాలు సేకరించింది. అనంతరం బాలుడు, బాలిక మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. హోటల్ మేనేజర్ నుంచి సమాచారం తీసుకున్నారు. ఒక యువకుడు, యువతి ఐడీ ప్రూఫ్ ఆధారంగా మృతుల కుటుంబాలకు సమాచారం అందించారు. యువకుడు ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. కాగా, బాలిక నోటి నుంచి నురగ రావడంతో ఆమె విషం సేవించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆ హోటల్ను పోలీసులు సీజ్ చేశారు.
తాజావార్తలు
-
DC Release Date: గ్యాంగ్స్టర్ గా లోకేష్ కనగరాజ్.. ‘డీసీ’ రిలీజ్ డేట్ ఫిక్స్!
-
ISIS-K: మసీదులు, పాఠశాలలు, మైనారిటీ వర్గాలే టార్గెట్.. తాలిబన్లకు అతిపెద్ద శత్రువు!
-
Abhishek Sharma: టీ20ల్లో సిక్సర్ కింగ్గా అభిషేక్ శర్మ.. చరిత్ర సృష్టించిన భారత యువ ఓపెనర్
-
Explainer: ప్రతి ముగ్గురిలో ఒకరికి సోకుతుంది.. కంటి చూపును దెబ్బతీస్తుంది.. గర్భంలోని శిశువుకూ ముప్పు!
-
Astrology: జూలై 2 గురువారం దినఫలాలు.. ఈ రాశివారికి ఊహించని గుడ్ న్యూస్..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!