Bombay High Court: అండం, వీర్య దానం ఇచ్చిన మహిళకు పిల్లలపై చట్టపరమైన హక్కు లేదు..
- అండం.. వీర్య దానం ఇచ్చిన మహిళకు పిల్లలపై ఎటువంటి చట్టపరమైన హక్కులు ఉండవు
- జీవ సంబంధమైన తల్లిదండ్రులుగా చెప్పుకోలేరని బాంబే హైకోర్టు తీర్పు
- పిల్లలకు వారు జీవసంబంధ తల్లిదండ్రులుగా చెప్పడం కుదరదని స్పష్టం.
అండం, వీర్య దానం ఇచ్చిన మహిళకు పిల్లలపై ఎటువంటి చట్టపరమైన హక్కులు ఉండవని.. జీవ సంబంధమైన తల్లిదండ్రులుగా చెప్పుకోలేరని బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. కాగా.. తన ఐదేళ్ల చిన్నారికి సందర్శన హక్కు కల్పించాలని కోరుతూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ మిలింద్ జాదవ్తో కూడిన హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ విచారించింది. సరోగసీ ద్వారా పుట్టిన తన కుమార్తెలు అండం దానం చేసిన తన భర్త, చెల్లెలుతో కలిసి జీవిస్తున్నారని ఆ మహిళ తన పిటిషన్లో పేర్కొంది.
Bangladesh: హిందూ నేతలని కలిసిన బంగ్లా తాత్కాలిక అధినేత మహమ్మద్ యూనస్..
Also Read
- Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
- AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
- Shruti Haasan: ఆ దర్శనం తర్వాత నా జీవితమే మారిపోయింది..
- AshuReddy Audio Leaks : అషు రెడ్డి ఆడియో కాల్స్ లీక్.. నా మాట వినకుంటే అంతే సంగతులని వార్నింగ్
2018లో సరోగసీ మహిళ ద్వారా పిల్లలు పుట్టగా.. 2019లో కవల బాలికలు జన్మించారు. పిటిషనర్ సోదరికి అండాలను దానం చేసినందున.. ఆమెకు జీవసంబంధమైన తల్లిదండ్రులుగా గుర్తించే చట్టబద్ధమైన హక్కు ఉందని పిటిషనర్ భర్త వాదించాడు. కాగా.. 2019లో పిటిషనర్ సోదరి కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. 2019 నుంచి 2021 మార్చి వరకు ఇద్దరు పిల్లలతో కలిసి పిటిషనర్, ఆమె భర్త కలిసే ఉన్నారు. ఆ తరువాత వైవాహిక బంధంలో విభేదాల కారణంగా 2021లో భార్యకు చెప్పకుండా ఇద్దరు పిల్లలతో కలిసి భర్త వేరే ఇంటికి వెళ్లిపోయాడు.
DSC Exam Key: తెలంగాణ డీఎస్సీ ప్రిలిమినరీ కీ విడుదల
అక్కడ రోడ్డు ప్రమాదంతో కుంగుబాటుకు గురైన తన మరదలు.. పిల్లల బాగోగులను చూసుకునేందుకు తనతోనే ఉంటుందని పిటిషనర్ భర్త చెప్పడంతో పిటీషనర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం ఆమె హైకోర్టును ఆశ్రయించగా ఈ తీర్పు వెలువడింది. కాగా.. 2018లో పిల్లలు గర్భం దాల్చినందున సరోగసీ చట్టానికి 2021 సవరణ వర్తించదని.. దానికి బదులుగా ICMR మార్గదర్శకాలు వర్తిస్తాయని హైకోర్టు నియమించిన అమికస్ ధర్మాసనానికి తెలిపారు. కవలలకు జీవసంబంధమైన తల్లిగా చెప్పుకునే హక్కు చెల్లెలికి లేదని హైకోర్టు పేర్కొంది. అందువల్ల ప్రతి వారాంతంలో మూడు గంటల పాటు భార్య కుమార్తెలను కలిసేందుకు అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది.
తాజావార్తలు
-
Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
-
AP Fuel Crisis: తగ్గిన పెట్రోల్ డీజిల్ కొరత ప్రభావం.. లిమిట్ పెంచిన బంక్లు..
-
Shruti Haasan: ఆ దర్శనం తర్వాత నా జీవితమే మారిపోయింది..
-
AshuReddy Audio Leaks : అషు రెడ్డి ఆడియో కాల్స్ లీక్.. నా మాట వినకుంటే అంతే సంగతులని వార్నింగ్
-
China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!