Gandhinagar: మూడు దశాబ్దాలుగా ఆ నియోజకవర్గంలో బీజేపీ ఎదురు లేదు..
ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్ లో గాంధీనగర్ నియోజకవర్గాన్ని బీజేపీ కంచుకోటగా పరిగణిస్తారు. 34 నాలుగేళ్లుగా ఆ నియోజకవర్గంలో బీజేపీ పాగా వేసింది. అటల్ బిభారీ వాజ్ పేయి, అధ్వాణి వంటి బీజేపీ కీలక నేతలు ఈ నియోజకవర్గం నుంచే గెలుపొందారు. 1989 నుంచి ఈ సీటును బీజేపీ కైవసం చేసుకుంటోంది. కాంగ్రెస్ తరఫున ఎంత మంది మహా నేతలు బరిలోకి దిగిన ఫలితం లేకుండా పోతోంది. గతంలో టీఎన్ శేషన్, రాజేఫ్ ఖన్నాలు సైతం ఓటమిపాలయ్యారు. ఈ సారి కూడా గాంధీ నగర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ తరఫున ఆ పార్టీ గుజరాత్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా పనిచేస్తున్న సోనాల్ పటేల్ పోటీ చేస్తున్నారు.
READ MORE: Sunita Williams Space Mission: సునీతా విలియమ్స్ మూడో అంతరిక్ష యాత్ర వాయిదా, కారణం ఏమిటంటే?
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
గత ఎన్నికల్లో ఐదున్నర లక్షల తేడాతో అమిత్ షా విజయ కేతనం ఎగురవేశారు. ఈ సారి మెజార్టీ పెరుగుతుందని బీజేపీ నేతలు పేర్కొంటున్నారు. కాగా.. గాంధీ నగర్ పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అవి గాంధీనగర్ నార్త్, కలోల్, సనంద్, ఘట్లోడియా, వేజల్పూర్, నారన్ పురా, సబర్మతి. ఈ మొత్తం స్థానాలను గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తన ఖాతాలో వేసుకుంది. 1999 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ గా పనిచేసిన టీఎన్ శేషన్ కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగారు. అతని ప్రత్యర్థిగా అధ్వాణి పోటీలో ఉన్నారు. అధ్వాణికి గట్టి పోటీ ఇవ్వగలిగాడే తప్ప.. విజయం సాధించలేకపోయారు..శేషన్. అప్పటి నుంచి ఆ సీటు కాషాయ మయంగానే ఉంది. 1996 లో వాజ్ పేయి ఈ స్థానంతో పాటు లక్నో నుంచి కూడా బరిలోకి దిగారు. ఈ రెండు స్థానాల్లో విజయం సాధించడంతో గాంధీనగర్ లో రాజీనామా చేశారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి విజయ్ పటేల్ పై బాలీవుడ్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నాను కాంగ్రెస్ బరిలోకి దింపింది. ఖన్నా ఓటమి పాలయ్యారు. ఈ సారి మాత్రం అమిత్ షా దాదాపు 10 లక్షల ఓట్ల మెజార్టీ సాధిస్తారని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుంది.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!