Odisha: పిల్లలకు గుడ్లు ఇవ్వడం లేదని.. అంగన్వాడీ కార్యకర్తను చెట్టుకు కట్టేసి కొట్టిన మహిళలు
- ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన
- పిల్లలకు గుడ్లు ఇవ్వడం లేదని.. అంగన్వాడీ కార్యకర్తను చెట్టుకు కట్టేసి కొట్టిన మహిళలు
- మహిళ పరిస్థితి విషయం
- జిల్లా ఆస్పత్రికి తరలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ గ్రామస్థులు అంగన్వాడీ కార్యకర్తను చెట్టుకు కట్టేసి కొట్టారు. మహిళా ఉద్యోగి అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు సక్రమంగా ఆహారం, ముఖ్యంగా గుడ్లు అందించడం లేదని ఆరోపించారు. సెప్టెంబర్ 19న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.
READ MORE: Indian Railways: టిక్కెట్ లేకుండా జనరల్ కోచ్లో ప్రయాణిస్తున్నారా..? ఫైన్ ఎంతో తెలుసా..?
Also Read
- Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
- IND Vs PAK: పాకిస్థాన్పై భారత్ ఘన విజయం.. ధావన్ హాఫ్ సెంచరీతో మెరుపులు..
- New Smart Phone: 9020mAH బ్యాటర్, 12GB RAM, AMOLED డిస్ప్లే.. విడుదలకు ముందే లీకైన ఫీచర్స్..
- YS Jagan: ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే అరెస్టులు: వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
బాధితురాలి పేరు ఊర్మిళ సమాల్. సిలాంగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్నారు. ఆమె రోజువారీ పనులు చేస్తుండగా గ్రామానికి చెందిన కొందరు మహిళలు అక్కడికి చేరుకున్నారు. మహిళా ఉద్యోగిని తన బాధ్యతలను విస్మరించారని ఆరోపిస్తూ.. అంగన్వాడీ కేంద్రం వెలుపల చెట్టుకు కట్టేసి దుర్భాషలాడారు. ఈ సమయంలో ఉద్యోగి సహాయం కోసం అభ్యర్థించారు. కానీ ఎవరూ సహాయం చేయలేదు.
READ MORE:RK Roja: రాజకీయ లబ్ధి కోసం శ్రీవారిని కూడా వదలడం లేదు.. రోజా కీలక వ్యాఖ్యలు
అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన పిల్లల తల్లులు ఆహార సరఫరాలో అవకతవకలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఆమె మా పిల్లలకు క్రమం తప్పకుండా గుడ్లు పెట్టడం లేదు. మేము దీని గురించి ఇంతకు ముందే ఫిర్యాదు చేశాం” అని దాడి సమయంలో ఒక మహిళ నివేదించారు. ఆరోపణలకు తోడు.. ఆ ఉద్యోగిని గతంలో ఓ చిన్నారిని గుర్తు తెలియని కారణాలతో అంగన్వాడీ కేంద్రంలోకి లాక్కెళ్లి కొట్టిందని గ్రామస్థులు పేర్కొన్నారు.
READ MORE:Tirupati Laddoo Row: తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్..
ఘటనా స్థలానికి చేరుకున్న సీడీపీఓ..
స్థానిక అధికారులు జోక్యం చేసుకునే వరకు పరిస్థితి మరింత దిగజారింది. ఘటనపై సమాచారం అందుకున్న బలియాపాల్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సీడీపీఓ) పర్బతి ముర్ము ఇతర అంగన్వాడీ కార్యకర్తలతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కోపంతో ఉన్న గ్రామస్థులను శాంతింపజేసి ఊర్మిళా సామల్ను రక్షించారు. ఆమె మొదట వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ ఆమె పరిస్థితి దిగజారడంతో బాలాసోర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
-
Kaatalan OTT Release: నిజమైన ఏనుగుతో ఫైట్.. సునీల్, లోకేష్ నటించిన 8.2 రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి!
-
Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
-
KJQ Pre Release Event: ఫ్యాన్స్ కు పూనకాలే.. డిసెంబర్ 2న ప్రభాస్ ‘ఫౌజీ’ ప్రీమియర్స్ .. KJQ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్
-
Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
ట్రెండింగ్
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!