Odisha: పిల్లలకు గుడ్లు ఇవ్వడం లేదని.. అంగన్వాడీ కార్యకర్తను చెట్టుకు కట్టేసి కొట్టిన మహిళలు
- ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన
- పిల్లలకు గుడ్లు ఇవ్వడం లేదని.. అంగన్వాడీ కార్యకర్తను చెట్టుకు కట్టేసి కొట్టిన మహిళలు
- మహిళ పరిస్థితి విషయం
- జిల్లా ఆస్పత్రికి తరలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ గ్రామస్థులు అంగన్వాడీ కార్యకర్తను చెట్టుకు కట్టేసి కొట్టారు. మహిళా ఉద్యోగి అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు సక్రమంగా ఆహారం, ముఖ్యంగా గుడ్లు అందించడం లేదని ఆరోపించారు. సెప్టెంబర్ 19న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.
READ MORE: Indian Railways: టిక్కెట్ లేకుండా జనరల్ కోచ్లో ప్రయాణిస్తున్నారా..? ఫైన్ ఎంతో తెలుసా..?
Also Read
- AP Govt: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 1వ తేదీ ఉదయం నుంచే ప్రారంభం..
- Abhishek Banerjee: మమతా మేనల్లుడిని ప్రజలు ఎందుకు కొట్టారు..?
- DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే.శివకుమార్ ఎన్నిక.. జూన్ 3న సీఎంగా ప్రమాణస్వీకారం
- Accidnet: ఆఫ్ఘనిస్తాన్లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ ట్రక్కు.. 22 మంది మృతి..
బాధితురాలి పేరు ఊర్మిళ సమాల్. సిలాంగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్నారు. ఆమె రోజువారీ పనులు చేస్తుండగా గ్రామానికి చెందిన కొందరు మహిళలు అక్కడికి చేరుకున్నారు. మహిళా ఉద్యోగిని తన బాధ్యతలను విస్మరించారని ఆరోపిస్తూ.. అంగన్వాడీ కేంద్రం వెలుపల చెట్టుకు కట్టేసి దుర్భాషలాడారు. ఈ సమయంలో ఉద్యోగి సహాయం కోసం అభ్యర్థించారు. కానీ ఎవరూ సహాయం చేయలేదు.
READ MORE:RK Roja: రాజకీయ లబ్ధి కోసం శ్రీవారిని కూడా వదలడం లేదు.. రోజా కీలక వ్యాఖ్యలు
అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన పిల్లల తల్లులు ఆహార సరఫరాలో అవకతవకలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఆమె మా పిల్లలకు క్రమం తప్పకుండా గుడ్లు పెట్టడం లేదు. మేము దీని గురించి ఇంతకు ముందే ఫిర్యాదు చేశాం” అని దాడి సమయంలో ఒక మహిళ నివేదించారు. ఆరోపణలకు తోడు.. ఆ ఉద్యోగిని గతంలో ఓ చిన్నారిని గుర్తు తెలియని కారణాలతో అంగన్వాడీ కేంద్రంలోకి లాక్కెళ్లి కొట్టిందని గ్రామస్థులు పేర్కొన్నారు.
READ MORE:Tirupati Laddoo Row: తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో పిటిషన్..
ఘటనా స్థలానికి చేరుకున్న సీడీపీఓ..
స్థానిక అధికారులు జోక్యం చేసుకునే వరకు పరిస్థితి మరింత దిగజారింది. ఘటనపై సమాచారం అందుకున్న బలియాపాల్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ (సీడీపీఓ) పర్బతి ముర్ము ఇతర అంగన్వాడీ కార్యకర్తలతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కోపంతో ఉన్న గ్రామస్థులను శాంతింపజేసి ఊర్మిళా సామల్ను రక్షించారు. ఆమె మొదట వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ ఆమె పరిస్థితి దిగజారడంతో బాలాసోర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
AP Govt: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 1వ తేదీ ఉదయం నుంచే ప్రారంభం..
-
Abhishek Banerjee: మమతా మేనల్లుడిని ప్రజలు ఎందుకు కొట్టారు..?
-
Heatwave : భారత్లో వేడి గాలులకు 30వేల మంది చనిపోతారా? అధ్యయనంలో సంచలన విషయాలు!
-
Mitsubishi Pajero: పజెరో మళ్లీ రానుందా? 2031 నాటికి 13 కొత్త వాహనాలపై మిత్సుబిషి ఫోకస్.. కొత్త SUV ఎలా ఉండబోతోందంటే?
-
DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే.శివకుమార్ ఎన్నిక.. జూన్ 3న సీఎంగా ప్రమాణస్వీకారం
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..